ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రక్తపోటును, మధుమేహాన్ని నియంత్రించడానికి చేపట్టిన చర్యలు


• 30 ఏళ్లకంటే ఎక్కువ వయసున్న వారికి జాతీయ స్థాయిలో పరీక్షలు, చికిత్సలు.. 1.11 కోట్ల మందికి పైగా రక్తపోటు, 64 లక్షల మందికి మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ.. వారికి ఈ ఏడాది జనవరి మొదలు జూన్ వరకు చికిత్స సేవలు

• 770 జిల్లా ఎన్‌సీడీ క్లినిక్‌లు, 233 కార్డియాక్ కేర్ యూనిట్లు, సీహెచ్‌సీ స్థాయిలో 6,410 ఎన్‌సీడీ క్లినిక్‌ల ఏర్పాటు..వీటిలో సీహెచ్ఓలు, ‘ఆశా’లు, ఏఎన్ఎంలతో క్రమం తప్పక రోగి పరిశీలనలు, సూచనలు, సలహాలు, ఉచితంగా మందుల పంపిణీ

• ‘ఆశా’ల తోడ్పాటుతో పౌర సంబంధాలపై శ్రద్ధ.. రిస్క్ విషయంలో సీబీఏసీ పరికరంతో ముందస్తుగా అంచనా.. రోగులకు వైద్య సిబ్బందితో మార్గదర్శనం.. జీవన శైలిలో మార్పులు, ప్రత్యేక సంరక్షణ అవసరమైతే పెద్ద ఆస్పత్రులకు సిఫారసు

Posted On: 12 AUG 2025 3:11PM by PIB Hyderabad

ఆరోగ్యం రాష్ట్ర జాబితాలో ప్రస్తావించిన అంశంఏమైనాజాతీయ ఆరోగ్య  మిషన్ (ఎన్‌హెచ్ఎం)లో భాగంగా అసాంక్రామిక వ్యాధుల నివారణనియంత్రణలకు ఉద్దేశించిన జాతీయ కార్యక్రమం (ఎన్‌పీ-ఎన్‌సీడీ)లో రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాలకు సాంకేతిక సహాయంతో పాటు ఆర్థిక సహాయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ అందిస్తోందిఈ కార్యక్రమం మౌలిక సదుపాయాలను పటిష్ఠపరచడంపైనమానవ వనరులను పెంచడంపైనపరీక్షలుముందుగా రోగనిర్ధారణసిఫారసు సేవచికిత్సతో పాటు రక్తపోటుమధుమేహం సహా అసాంక్రామిక వ్యాధుల (ఎన్‌సీడీస్విషయంలో మానవ ఆరోగ్య పరిరక్షణ.. ఈ అంశాల్లో రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాల అవసరాలుఅవి పంపే ప్రతిపాదనలపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొంటోందిఈ కార్యక్రమం కింద 77 జిల్లా ఎన్‌సీడీ క్లినిక్‌లు, 233 కార్డియాక్ కేర్ యూనిట్లతో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 6,410 ఎన్‌సీడీ క్లినిక్‌లను ఏర్పాటు చేశారు.

రక్తపోటుమధుమేహం సహా సాధారణ ఎన్‌సీడీల పరీక్షలునివారణతో పాటు నియంత్రణే ధ్యేయంగా జనాభా ఆధారిత కార్యక్రమాన్ని ఎన్‌హెచ్ఎంలో భాగంగా  ప్రారంభించారుసమగ్ర ప్రాథమిక  ఆరోగ్య సంరక్షణలో ఎన్‌హెచ్ఎం ఒక భాగంగా ఉంటుంది. 30 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారికి ఈ కార్యక్రమంలో భాగంగా పరీక్షలు నిర్వహించారు.

వయస్సు 30 ఏళ్లుఅంత కన్నా ఎక్కువ ఉన్న వారందరికీ పరీక్షలు నిర్వహించడానికి గత ఫిబ్రవరి 20 నుంచి గత మార్చి నెలాఖరు వరకు రక్తపోటుమధుమేహం సహా ఎన్‌సీడీ పరీక్షల కార్యక్రమాన్ని ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ మొదలుపెట్టిందిఈ  కార్యక్రమాన్ని ఎన్‌పీ-ఎన్‌సీడీ కింద దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల (ఏఏఎం)లతో పాటు ఇతర ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో నిర్వహించారు.

ఎన్‌పీ-ఎన్‌సీడీ కార్యక్రమంలో భాగంగా రక్తపోటుమధుమేహం సోకినట్లు నిర్ధారణ అయిన రోగులకు వేర్వేరు స్థాయులకు చెందిన ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో మందులతో పాటు క్రమం తప్పక సమీక్షా సేవల్ని కూడా అందిస్తున్నారు:

రక్తపోటుకు అత్యవసర ఔషధాల్ని అన్ని అంచెలు.. అంటే ఏఏఎంపీహెచ్‌సీలుసీహెచ్‌సీలడీహెచ్‌..లలో అందుబాటులో ఉంచారు.

క్రమబద్ధమైనఒకే విధమైన నిర్వహణకు తోడ్పడేలా ప్రామాణిక చికిత్స ప్రమాణాలను పాటిస్తున్నారు.

ఎన్‌సీడీ పోర్టల్ ద్వారా నెలవారీ సమీక్ష సదుపాయాన్ని కల్పించారువైద్యశాలకు ఎప్పుడెప్పుడు రావాలోఏయే మందులు తీసుకోవాలో సూచిస్తున్నారు

ప్రత్యేక సంరక్షణ అవసరమైన రోగుల విషయంలో సిఫారసు వ్యవస్థను అందుబాటులో ఉంచారు

మన దేశంలో గత ఆరు నెలల్లో చికిత్సలు పొందుతున్న నమోదైన రోగుల సంఖ్యఇతర అంశాలు ఇలా ఉన్నాయి

01.01.2025 నుంచి 30.06.2025 వరకు

రక్తపోటు

డయాబెటీస్ మెల్లిటస్

రోగనిర్ధారణ పూర్తయిన వారు

1,11,83,850

64,11,051

చికిత్స పొందుతున్న వారు

1,11,83,850

64,11,051

 

రోగులకువారి కుటుంబ సభ్యులకు జీవనశైలిని మెరుగుపరచుకోవడంతో పాటు నష్టం సంభవించే అవకాశాన్ని (రిస్క్తగ్గించుకొనే విషయాలపై సూచనలుసలహాలను జిల్లా ఎన్‌సీడీ క్లినికల్ కౌన్సెలర్లు అందిస్తారుఅసాంక్రామిక వ్యాధుల నివారణనిర్వహణలకు సంబంధించిన ఐఈసీ (ఇన్ఫర్మేషన్ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్కార్యకలాపాలను కూడా వీరు నిర్వహిస్తారురోగులు ఆరోగ్యశాలలకు వచ్చినప్పుడు జీవనశైలిని ఎలా తీర్చిదిద్దుకోవాలో వైద్యాధికారులునర్సులు తెలియజెబుతారు.

గుర్తింపు పొందిన సంఘ సేవా కార్యకర్తలే ‘ఆశా’ (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ .. ఏఎస్‌హెచ్ఏ)లు. 30 ఏళ్లుఅంత కన్న ఎక్కువ వయసున్న వారికి నష్టభయం (రిస్క్ఏ మేరకు ఉందో ఆశా కార్యకర్త కమ్యూనిటీ ఆధారిత నిర్ధారణ పట్టిక (సీబీఏసీఫారాలను ఉపయోగించిపరిశీలిస్తారురక్తపోటుమధుమేహం సహా సాధారణ ఎన్‌సీడీల తనిఖీ కోసం వ్యక్తులను ఆశా వర్కరే ఏఏఎంల (ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలవద్దకు తీసుకొస్తారు.  క్రమం తప్పక ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూవ్యాధిని చాలా ముందే గుర్తించడానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని ప్రజలకు ఆశా కార్యకర్తే వివరిస్తారురోజూ ఎంత ఆహారాన్ని తీసుకోవడం మంచిదిశారీరకంగా వ్యాయామం చేయడంపొగ తాగే లేదా మద్యం తాగే అలవాట్లను మానుకోవడంవేళకు మందులు వేసుకొంటూ ఉండడం వంటి  అంశాల్లో రోగులకు సలహాలను ఇచ్చే విషయాల్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ఓ)లకుఏఎన్ఎంలకు, ‘ఆశా’లకు శిక్షణనిచ్చారు.    

ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ  ప్రతాప్‌రావ్ జాదవ్ రాజ్యసభకు ఈ  రోజు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు. ‌

 

***


(Release ID: 2155631)
Read this release in: English , Urdu , Hindi , Tamil