సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
కొనసాగుతున్న 15 వ భారత ప్రెస్ కౌన్సిల్ ఏర్పాటు ప్రక్రియ: నామినేషన్లలో అధిక భాగం ఖరారు
Posted On:
08 AUG 2025 4:37PM by PIB Hyderabad
ప్రెస్ కౌన్సిల్ చట్టం 1978 నిబంధనల ప్రకారం భారత ప్రెస్ కౌన్సిల్ ఏర్పాటైంది.
15వ ప్రెస్ కౌన్సిల్ ఏర్పాటు స్థితి క్రింద విధంగా ఉంది.
-
సెక్షన్ 5లోని సబ్ సెక్షన్ 3(ఎ) ప్రకారం వర్కింగ్ జర్నలిస్టుల్లో పదమూడు మంది సభ్యులను నామినేట్ చేయాల్సి ఉండగా, వారిలో ఆరుగురు వార్తాపత్రికల ఎడిటర్లుగా, మిగిలిన ఏడుగురు ఎడిటర్లుగా కాకుండా వర్కింగ్ జర్నలిస్టులుగా ఉండాలి. ఈ సభ్యుల నియామక ప్రక్రియ ఢిల్లీ హైకోర్టులో విచారణలో ఉంది.
-
సెక్షన్ 5లోని సబ్ సెక్షన్ 3(బి) ప్రకారం, ఆరుగురిని వార్తాపత్రికల యాజమాన్యం లేదా వార్తాపత్రికల వ్యాపారాన్ని నిర్వహించే వ్యక్తులలో నుంచి నియమించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రెస్ కౌన్సిల్ నుంచి ప్రభుత్వానికి నామినేషన్లు అందాయి.
-
సెక్షన్ 5లోని సబ్ సెక్షన్ 3(సి) ప్రకారం వార్తా సంస్థలను నిర్వహించే వ్యక్తుల నుంచి ఒకరిని నామినేట్ చేయాలి. ఇందుకోసం ప్రెస్ కౌన్సిల్ నుంచి నామినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు.
-
సెక్షన్ 5లోని సబ్ సెక్షన్ 3(డి) ప్రకారం ముగ్గురు విద్య, సైన్స్, న్యాయశాస్త్రం, సాహిత్యం, సంస్కృతికి సంబంధించి ప్రత్యేక పరిజ్ఞానం లేదా ఆచరణాత్మక అనుభవం కలిగిన వ్యక్తుల్లో ఒకరిని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఒకరిని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, మరొకరిని సాహిత్య అకాడమీ నామినేట్ చేస్తాయి. ఈ సభ్యులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు.
-
సెక్షన్ 5లోని సబ్ సెక్షన్ 3(ఇ) ప్రకారం పార్లమెంట్ నుంచి ఐదుగురు సభ్యులు ఉంటారు. వీరిలో ముగ్గురిని లోక్ సభ నుంచి స్పీకర్ నామినేట్ చేస్తారు. మరో ఇద్దరిని రాజ్యసభ నుంచి చైర్మన్ నామినేట్ చేస్తారు. స్పీకర్ నుంచి నామినేషన్ల స్వీకరణ పూర్తి కాగా, రాజ్యసభ చైర్మన్ నుంచి నామినేషన్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది.
కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ ఈ రోజు లోక్ సభకు ఈ వివరాలు సమర్పించారు.
***
(Release ID: 2154509)