ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 06 JUL 2025 7:56AM by PIB Hyderabad

డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు ఆయనకు నివాళులు అర్పించారు. 

డాక్టర్ ముఖర్జీ చేసిన అపారమైన కృషిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. దేశ గౌరవాన్ని కాపాడేందుకు ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారని అన్నారు. అభివృద్ధి చెందిన, స్వావలంబన కలిగిన భారతదేశ నిర్మాణంలో ఆయన ఆదర్శాలు, సూత్రాలు అమూల్యమైనవని పేర్కొన్నారు. 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు. 

"అమరుడైన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. దేశ గౌరవం, 
ప్రతిష్ఠను కాపాడేందుకు ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారు. అభివృద్ధి చెందిన, స్వావలంబన భారతదేశాన్ని నిర్మించడంలో ఆయన ఆదర్శాలు, సూత్రాలు అమూల్యమైనవి."

"राष्ट्र के अमर सपूत डॉ. श्यामा प्रसाद मुखर्जी को उनकी जन्म-जयंती पर भावभीनी श्रद्धांजलि। देश की आन-बान और शान की रक्षा के लिए उन्होंने अपने प्राण न्योछावर कर दिए। उनके आदर्श और सिद्धांत विकसित और आत्मनिर्भर भारत के निर्माण में बहुमूल्य हैं।"

 

 

****

MJPS/ST


(రిలీజ్ ఐడి: 2142623) సందర్శకుల సూచీ సంఖ్య : : 22