ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరప్రదేశ్లోని సంభాల్ ప్రమాద మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్-గ్రేషియా ప్రకటించిన ప్రధానమంత్రి
Posted On:
05 JUL 2025 10:17AM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్లోని సంభాల్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000ల చొప్పున పరిహారం ప్రకటించారు.
ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా ఇలా పేర్కొన్నది:
“ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం చాలా బాధాకరం. ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
మరణించిన వారి కుటుంబాలకు పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్-గ్రేషియా ప్రకటిస్తున్నాం: PM@narendramodi”
***
**********
MJPS/SR/SKS
(Release ID: 2142472)
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam