ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దినోత్సవం.. ప్రధానమంత్రి నివాళులు

నాడు పోస్టు చేయడమైనది: 23 JUN 2025 9:02AM by PIB Hyderabad

డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:

‘‘డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దినోత్సవం సందర్భంగా ఆయనకు కోటానుకోట్ల నమస్కారాలు. ఆయన దేశ సమగ్రత చెక్కుచెదరకుండా ఉండేలా చూడడానికి సాటిలేని సాహసాన్ని, పురుషార్థాన్ని చాటిచెప్పారు. జాతి నిర్మాణం కోసం ఆయన అందించిన అమూల్య తోడ్పాటును మనం ఎప్పటికీ శ్రద్ధాపూర్వకంగా స్మరించుకొంటూ ఉంటాం’’ అని పేర్కొన్నారు.

 


(రిలీజ్ ఐడి: 2139833) సందర్శకుల సూచీ సంఖ్య : : 29