సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి... యాత్రను ప్రారంభించనున్న కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా

2025 జూన్ 25న రాజ్యాంగ హత్యాదినాన్ని సంయుక్తంగా నిర్వహించనున్న సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఢిల్లీ ప్రభుత్వం

అత్యవసర పరిస్థితి విధించి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు

Posted On: 24 JUN 2025 6:24PM by PIB Hyderabad

దేశంలో 1975లో భారతదేశంలో అత్యవసర పరిస్థితి విధించి 50 సంవత్సరాలు పూర్తవుతోన్న సందర్భంగా దిల్లీ  ప్రభుత్వంతో కలిసి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2025 జూన్ 25న ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో రాజ్యాంగ హత్యాదినాన్ని (సంవిధాన్ హత్యా దివస్‌నిర్వహించనుందిప్రజాస్వామ్య విలువలురాజ్యాంగ హక్కులను పరిరక్షించటానికున్న ప్రాముఖ్యతను ఈ రోజు గుర్తు చేస్తోంది.
1975 
జూన్ 25న ప్రకటించిన అత్యవసర పరిస్థితి స్వాతంత్ర్యానంతరం దేశ చరిత్రలో చీకటి అధ్యాయాలలో ఒకటిగా మిగిలిపోయిందిప్రాథమిక హక్కులు నిలిపివేశారుపత్రికా స్వేచ్ఛ తగ్గిపోయిందిప్రజాస్వామ్య సంస్థల గొంతు నొక్కేశారుఅలాంటి సంక్షిష్ట సమయాన్ని మరిచిపోకుండా ప్రజాస్వామ్య పవిత్రతను సుస్థిరంగా నిలబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం జూన్ 25ని రాజ్యాంగ హత్యాదినంగా 2024లో అధికారికంగా ప్రకటించింది

దిల్లీలో జరగనున్న కార్యక్రమంలో అనేక మంది ప్రముఖులు హాజరుకానున్నారుఅందులో కొందరు:

* కేంద్ర హోంసహకార మంత్రి శ్రీ అమిత్ షా (ముఖ్య అతిథి)

కేంద్ర సమాచార ప్రసారఎలక్ట్రానిక్స్ ఐటీరైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్

కేంద్ర సాంస్కృతికపర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా

ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖ గుప్తా

ఈ కార్యక్రమంలో ముఖ్యమైనవి:

1. భారత ప్రజాస్వామ్యంపై ప్రత్యేక ప్రదర్శన:-

ఈ ప్రదర్శనను మూడు భాగాలుగా ఉండనుంది-

ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి భారత్దేశంలోని పురాతనఅందరూ పాలుపంచుకున్న ప్రజాస్వామ్య సంప్రదాయాలను ప్రదర్శించడం

ప్రజాస్వామ్య చీకటి రోజులు: 1975 అత్యవసర పరిస్థితి‌లోని సంఘటనలుపరిణామాలను వివరించడం

భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంఎన్నికల పారదర్శకతనారీ శక్తి వందన్‌ అధినియంప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ), ప్రజా ఫిర్యాదుకు సంబంధించి డిజిటల్ వేదికలు వంటి ఇటీవలి ప్రజాస్వామ్య సంస్కరణ ప్రదర్శన

2. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్‌డీనాటకం:- అత్యవసర పరిస్థితి‌కి సంబంధించి శక్తిమంతమైన నాటకీకరణ.. సాధారణ ప్రజలుప్రజాస్వామ్య సంస్థలపై ప్రభావాన్ని ప్రధానంగా తెలియజేయనున్న నాటకం.

3. అత్యవసర పరిస్థితిపై లఘు చిత్ర ప్రదర్శన:- అత్యవసర పరిస్థితి విధించడందాని పరిణామాలపై సినిమా రూపంలో తెలియజేసేందురు ప్రత్యేకంగా తయారు చేసిన చిత్రం.

4. అభిప్రాయాల గోడ (సిగ్నేచర్ ట్రిబ్యూట్ వాల్): - రాజ్యాంగ విలువల విషయంలో వారి నిబద్ధతను తెలియజేస్తూ వ్యక్తిగత సందేశాలను రాసేందుకు వీలుగా ఉండే ఇంటరాక్టివ్ ఏర్పాటు.

5. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి (లాంగ్‌లివ్ డెమోక్రసీఅనే యాత్రను ప్రారంభించటం.

కేంద్ర హోంసహకార మంత్రి శ్రీ అమిత్ షా ‘మై‌భారత్’ స్వచ్ఛంద సేవకులు నిర్వహించే "ప్రజాస్వామ్యం వర్ధిల్లాలిఅనే యాత్రను ప్రారంభించనున్నారురాజ్యాంగ విలువలుప్రజాస్వామ్య హక్కులుఅత్యవసర పరిస్థితి నుంచి నేర్చుకున్న పాఠాల గురించి అవగాహన కల్పిస్తూ ఈ యాత్ర దేశవ్యాప్తంగా సాగనుంది


 

 


 

దేశవ్యాప్తంగా కార్యక్రమాలు

ఢిల్లీలో జరిగే ఈ ప్రధాన కార్యక్రమంతో పాటు దేశమంతటా రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల్లో కార్యక్రమాలు జరగనున్నాయిసంబంధిత ముఖ్యమంత్రులుగవర్నర్లులెఫ్టినెంట్ గవర్నర్లు ఆయా కార్యక్రమాలకు నేతృత్వం వహించనున్నారుఈ కార్యక్రమాల్లో:

అత్యవసర పరిస్థితిని ప్రతిఘటించి ప్రజాస్వామ్యాన్ని రక్షించిన వ్యక్తులను సత్కరించనున్నారు

ప్రదర్శనలుబహిరంగ చర్చలుచలనచిత్ర ప్రదర్శనలు ఉండనున్నాయి

ప్రజాస్వామ్య సంస్థల దుర్బలత్వంశక్తిపై వివిధ తరాలకు చెందిన వారి మధ్య సంభాషణకు అవకాశం కల్పిస్తాయి

రాబోయే కొన్ని వారాల్లో ప్రతి రాష్ట్రంకేంద్రపాలిత ప్రాంతంలోని 50 కీలక ప్రదేశాల్లో "ప్రజాస్వామ్యం వర్ధిల్లాలిపేరుతో ప్రదర్శనలను నిర్వహించేందుకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రణాళికలు రచిస్తోంది

నేపథ్యం

భారతదేశంలో ప్రజాస్వామ్యం ఒక రాజకీయ వ్యవస్థ మాత్రమే కాదు.. అంతకంటే ఎక్కువఇది దేశ చారిత్రకసాంస్కృతిక వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన నాగరికత సత్యంరాజ్యాంగ హత్యాదినం అనేది గతంలో జరిగి అన్యాయాన్ని గుర్తు చేసుకోవటం మాత్రమే కాదు.. ప్రజాస్వామ్య సూత్రాలుసంస్థాగత సమగ్రతరాజ్యాంగ విలువలకు మన నిబద్ధతను తెలియజేయటంమన ప్రజాస్వామ్య పునాదులను రక్షించుకునే విషయంలో మన సంకల్పాన్ని తెలియజేసేందుకుగుర్తు చేసుకునేందుకుపునరుద్ధరించేందుకు ఒక దేశంగా మనం కలిసి సంఘటితం అవుతాం

 

***


(Release ID: 2139477)