ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పీఎఫ్‌ఆర్‌డీఏ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ శివసుబ్రమణియన్ రామన్

Posted On: 20 JUN 2025 1:52PM by PIB Hyderabad

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏచైర్‌పర్సన్‌గా శ్రీ శివసుబ్రమణియన్ రామన్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారుభారత ప్రభుత్వం 2025, ఏప్రిల్ 8న జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఆయనను అయిదు సంవత్సరాల పదవీకాలానికి చైర్‌పర్సన్‌గా నియమించిందిఈ పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి అయిదేళ్లు లేదా ఆయనకు 65 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకువీటిలో ఏది ముందుగా జరిగితే ఆ రోజు వరకు శివసుబ్రమణియన్ ఈ పదవిలో కొనసాగనున్నారు.

శ్రీ రామన్ 1991 బ్యాచ్ ఇండియన్ ఆడిట్-అకౌంట్స్ సర్వీస్ (ఐఏ-ఏఎస్అధికారి. పీఎఫ్ఆర్‌డీఏలో చేరడానికి ముందుఆయన భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయంలో డిప్యూటీ కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్‌గాచీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పనిచేశారుఆయన గతంలో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ఐడీబీఐచైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా.. నేషనల్ ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎన్ఈఎస్ఎల్మేనేజింగ్ డైరెక్టర్చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా.. జార్ఖండ్ రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్‌గా.. అనేక కీలక పదవుల్లో పనిచేశారుసెక్యూరిటీస్ – ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)లో 2006 నుంచి 2013 వరకు చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎమ్)గాతరువాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా ఆయన పనిచేశారు.

ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి శ్రీ రామన్ ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీఎమ్‌బీఏ పట్టా పొందారులండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ నుంచి ఫైనాన్షియల్ రెగ్యులేషన్‌లో ఎమ్మెస్సీఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎల్‌ఎల్‌బీపొలిటికల్ చీఫ్ డిజిటల్ ఆఫీసర్ సర్టిఫికేషన్ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్స్ (ఐఐఏ), ఫ్లోరిడా నుంచి సర్టిఫైడ్ ఇంటర్నల్ ఆడిటర్ క్రెడెన్షియల్సెక్యూరిటీస్ లా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా వంటి వివిధ ప్రొఫెషనల్, అకడమిక్ అర్హతలను కూడా ఆయన కలిగి ఉన్నారు.

ప్రభుత్వ ఆర్థికసాంకేతికత రంగాలుఆర్థిక నియంత్రణలో తనకున్న అపార అనుభవంతో.. భారత పెన్షన్ వ్యవస్థను బలోపేతం చేస్తూపౌరులందరికీ పదవీ విరమణ భద్రతను ప్రోత్సహించే లక్ష్యంతో శ్రీ రామన్ పీఎఫ్ఆర్‌డీఏకి మార్గనిర్దేశం చేయనున్నారు.

 

***


(Release ID: 2138000)