జాతీయ మానవ హక్కుల కమిషన్
ఆంధ్రప్రదేశ్ చిత్తూరులో అప్పు తీర్చని వ్యక్తి భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించిన వడ్డీ వ్యాపారి కేసును సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్
రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీ, డీజీపీకి ఆదేశాలు
Posted On:
20 JUN 2025 2:42PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా, కుప్పం మండలం, నారాయణపురం గ్రామంలో మహిళపై దాడికి సంబంధించి జూన్ 16న వెలువడ్డ వార్తను జాతీయ మానవహక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. భర్త చేసిన అప్పును చెల్లించని కారణంగా అతని భార్యను చెట్టుకు కట్టేసి, పదుగురి ఎదుట కొట్టినట్లు, ఆమెను గ్రామస్తులు విడిపించినట్లు మీడియా కథనం.
కథనం నిజమే అయి ఉంటే, దీనిని మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించవలసి ఉంటుందని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీ, డీజీపీకీ ఆదేశాలు జారీ చేసింది.
జూన్ 17న వెలువడ్డ మరో కథనం ప్రకారం... బాధితురాలి భర్త స్థానిక వడ్డీ వ్యాపారి వద్ద నుంచి రూ. 80,000ను అప్పుగా తీసుకున్నాడని, మూడేళ్ళు గడిచినా అప్పు తీర్చలేదని, గ్రామంలోని మరి కొందరి వద్ద కూడా అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేని స్థితిలో అతను గ్రామాన్ని విడిచి వెళ్ళిపోగా, మహిళ రోజువారీ కూలిగా మారి తన ముగ్గురి పిల్లల బాధ్యతను స్వీకరించిందని తెలుస్తోంది. వాయిదాల్లో అప్పును తీర్చివేయడం మొదలు పెట్టిందని వార్త తెలిపింది.
***
(Release ID: 2137998)