పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో ఇండియా టూరిజం ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం-2025’ ‘‘యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్’’కు మద్దతు

నాడు పోస్టు చేయడమైనది: 19 JUN 2025 4:24PM by PIB Hyderabad

భారతదేశ చిరకాలిక శ్రేయో వారసత్వాన్నిప్రపంచ క్షేమానికి భారత్ కట్టుబాటునూ పండుగ చేసుకోవడంలో భాగంగాభారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని ఇండియా టూరిజమ్ ఒక భారీ యోగా కార్యక్రమాన్ని ఈ నెల 21న నిర్వహించనుందిఈ కార్యక్రమం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా ప్రసిద్ధి చెందిన కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లోని ప్రతిష్ఠాత్మక సన్ డయల్ పచ్చిక బయళ్లలో ఉదయం గంటల నుంచి గంటల మధ్య జరగనుంది

ఈ సంవత్సరం ప్రపంచ ఇతివృత్తంగా ఎన్నుకొన్న ‘‘యోగా ఫర్ వన్ ఎర్త్వన్ హెల్త్ మానవ క్షేమానికీపర్యావరణ సమతౌల్యానికీ విస్తారమైన బంధం ఉందని స్పష్టం చేస్తోందియోగాను శారీరక జీవశక్తికీమానసిక స్పష్టతకూమనోద్వేగ ప్రశాంతితో పాటు ఆధ్యాత్మిక క్రమబద్ధతకూ తోడ్పడే ఒక శక్తిమంతమైన సాధనంగా యోగా అనే భావనను పెంపొందిస్తారుఇవన్నీ కూడా ఒక ఆరోగ్యప్రదమైనదీర్ఘకాలం పాటు మనుగడ సాగించగల ప్రపంచాన్ని సంరక్షించుకోవడానికి అత్యవసరం

హాజరవుతారని భావిస్తున్న ప్రముఖుల్లో:

            • శ్రీ గజేంద్ర సింగ్ యాదవ్శాసనసభ గౌరవనీయ సభ్యుడు (ఎమ్ఎల్ఏ)

             • శ్రీ లక్షయ్ సింఘల్ఐఏఎస్జిల్లా మేజిస్ట్రేట్దక్షిణ ఢిల్లీ

             • ప్రియాంగ విక్రమసింఘెడిప్యూటీ హై కమిషనరుశ్రీ లంక దౌత్య కార్యాలయం 

             • వత్సల అమరసింఘెమినిస్టర్ కౌన్సెలరుశ్రీ లంక దౌత్య కార్యాలయం

             • మలేసియా నుంచి విచ్చేసే విశిష్ట అతిథులు.. ఉన్నారు.

ఈ కార్యక్రమాన్ని ప్రముఖ యోగా గురు శ్రీ గోపాల్ రుషితో పాటు ఆయన బృందం నిర్వహించనున్నారుశారీరక బలంమానసిక శ్రేయంలతో పాటు ఆంతరంగిక శాంతిలను పెంపొందించడానికి ఉద్దేశించిన సంపూర్ణ యోగాభ్యాసాల వరుసను సూచిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మార్గదర్శకత్వం వహిస్తారు.

భాగస్వామ్యం-సహకారం:

ఈ కార్యక్రమంలో 400 మంది ఉత్సాహంగా పాలుపంచుకొనే అవకాశం ఉందివారిలో:

ఇండియన్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ (ఐఏటీఓసభ్యులు

ఇండియా డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ (ఏడీటీఓఐ)

ఇండియా ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ (టీఏఏఐ)

ప్రాంతీయ స్థాయి పర్యాటక గైడ్లుయువ టూరిజం క్లబ్బులకు చెందిన విద్యార్థులతో పాటు హోటల్ మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్ల (ఐహెచ్ఎంలవిద్యార్థులు

భారత పురావస్తు సర్వే సంస్థ (ఏఎస్ఐ), పర్యాటక శాఖలకు చెందిన అధికారులతో పాటు స్థానిక పౌరులు.. ఉంటారు.

పర్యాటక రంగంలో కీలక ఆసక్తిదారులుపరిశ్రమకు చెందిన వృత్తినిపుణులతో పాటు విద్యార్థులు చురుకుగా పాలుపంచుకోవడం పర్యటనసాంస్కృతిక పరిరక్షణలతో వెల్‌నెస్‌ను సంధానించాలన్న విశాల నిబద్ధతకు అద్దం పడుతోంది.

వారసత్వ స్థలాల వద్ద యోగా ప్రపంచానికో సందేశం

చరిత్రాత్మకమైన కుతుబ్ మినార్ నేపథ్యంలో యోగా దినోత్సవ సంబంధిత కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే అది భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయాల వారసత్వమూనాయకత్వమూ తరతరాలుగా నిలిచి ఉందనీభారత్ నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తోందిఈ కార్యక్రమం వెల్‌నెస్ టూరిజానికి భారత్ తనను తాను ఒక ప్రపంచ కూడలి (గ్లోబల్ హబ్)గా నిలదొక్కుకోవాలనే తపనను సూచిస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2137744) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Odia , Tamil , Kannada