వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దక్షిణాది రాష్ట్రాల్లో వినియోగదారుల భద్రత బలోపేతం లక్ష్యంగా చెన్నైలో ప్రాంతీయ కార్యశాలను నిర్వహించిన కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ


జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో.. దక్షిణాది రాష్ట్రాల నుంచే 23 శాతం ఫిర్యాదులు: కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి

100 శాతానికి పైగా పరిష్కార రేటుతో ముందంజలో కర్నాటక, కేరళ రాష్ట్రాల కమిషన్లు

Posted On: 14 JUN 2025 10:48AM by PIB Hyderabad

 వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను బలోపేతం చేస్తూసంస్థాగత సామర్థ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యం పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈనెల 13న చెన్నైలో "దక్షిణాది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో వినియోగదారుల భద్రత"అనే అంశంపై ప్రాంతీయ కార్యశాలను నిర్వహించింది.

ఈ సందర్భంగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీమతి నిధి ఖారే మాట్లాడుతూనేటి డిజిటల్ యుగానికి అనుకూలంగా ఉండే చట్టపరమైనడిజిటల్ యంత్రాంగాల అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారుప్రారంభ దశలోనే వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడంలో.. వేగవంతమైనఎలాంటి ఇబ్బందులు లేకుండా, తక్కువ ఖర్చుతోనే రైట్ టు రిపేర్ పోర్టల్-జాగృతిజాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌  వంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను ఆమె ప్రధానంగా ప్రస్తావించారుడార్క్ ప్యాటర్న్ లునకిలీ రివ్యూలుతప్పుదారి పట్టించే ప్రకటనలను అరికట్టడానికి సీసీపీఏ అమలు చేస్తున్న నియంత్రణ చర్యలను కూడా ప్రస్తావించిన ఆమె.. ఈ విషయంలో ఆదర్శప్రాయమైన పనితీరునుముఖ్యంగా అత్యధిక కేసుల్లో పరిష్కారాలను సాధిస్తున్న దక్షిణాది రాష్ట్రాలను ప్రత్యేకంగా ప్రశంసించారుముఖ్యంగా మధ్యవర్తిత్వంవర్చువల్ విచారణల ద్వారా ప్రపంచ స్థాయి ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను రూపొందించడం కోసం నిరంతర ఆవిష్కరణలుసహకారంసమ్మిళిత వినియోగం అవసరమని ఆమె పిలుపునిచ్చారు.

2025లోజాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌కు వచ్చిన 5.41 లక్షల ఫిర్యాదుల్లో 23 శాతం దక్షిణాది రాష్ట్రాల నుంచే వచ్చాయనిఇది బలమైన ప్రాంతీయ భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుందని ఆమె పేర్కొన్నారుదేశవ్యాప్తంగా నమోదైన 28.54 లక్షల కేసుల్లో 5.62 లక్షల కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారుదక్షిణాది రాష్ట్రాల్లో పెండింగ్ కేసులు 13.34 శాతం మాత్రమేనని శ్రీమతి నిధి ఖారే పేర్కొన్నారుదాఖలు అయిన వాటి కంటే ఎక్కువ కేసులను పరిష్కరించి కర్నాటకకేరళ కమిషన్లు ముందంజలో ఉన్నాయనీఅనేక జిల్లా కమిషన్లు సైతం వరుసగా మూడు సంవత్సరాల్లో 100 శాతానికి పైగా పరిష్కారాలను సాధించాయని ఆమె పేర్కొన్నారువర్చువల్ కోర్టుల ద్వారా 11,900 కంటే ఎక్కువ కేసులను విచారించామన్నారుఏఐ-ఆధారిత ఏకీకృత వేదిక -జాగృతిని గురించి వివరిస్తూ-దాఖిల్కాన్ఫోనెట్ వంటి కీలక వ్యవస్థల ఏకీకరణతో రూపొందించిన ఈ వేదిక.. చాట్‌బాట్ ఆధారిత రిజిస్ట్రేషన్బహుళ భాషల్లో అందుబాటులో ఉండడంన్యాయ నిపుణులుదివ్యాంగులైన వినియోగదారులకు మద్దతు అందించడం వంటి లక్షణాలను కలిగి ఉంటుందని తెలిపారు.

కార్యశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలోఎన్‌సీడీఆర్‌సీ అధ్యక్షులు జస్టిస్ అమరేశ్వర్ ప్రతాప్ సాహి మాట్లాడుతూ.. వినియోగదారుల రక్షణ చట్టం పరిణామ పరిధినిసంప్రదాయిక కోర్టుల నుంచి వినియోగదారుల కమిషన్లకు వ్యాజ్యాలు పెరుగుతున్న తీరును ప్రధానంగా ప్రస్తావించారువినియోగదారుల వివాద పరిష్కార వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించిమరింత మందికి దానిని అందుబాటులోకి తెచ్చేందుకు డిజిటల్-హితమైనసాంకేతికత-ఆధారితమైన విధానాలను అవలంబించాలని కోరిన ఆయన.. జిల్లా వినియోగదారుల కమిషన్లకు మార్గదర్శనం చేశారువేగంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పెరుగుతున్న డిమాండ్లను తీర్చడానికి డిజిటల్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంసాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాల్సిన ప్రాముఖ్యతను జస్టిస్ సాహి స్పష్టం చేశారుకమిషన్ ఆదేశాలను సమర్థంగా అమలు చేయడానికి ప్రభుత్వ విభాగాలతో సరైన భాగస్వామ్యం కలిగి ఉండాలనీవైద్యపరమైన నిర్లక్ష్యంఆటోమొబైల్ వివాదాల వంటి నిపుణుల అభిప్రాయాలు అవసరమయ్యే కేసుల విషయంలో వారితో సకాలంలో సమన్వయం చేసుకోవాలని సూచించారుదాని వల్ల దర్యాప్తుల్లో జాప్యం జరగదనివినియోగదారులకూ సకాలంలో పరిష్కారం లభిస్తుందన్నారు.

ఈ కార్యశాలలో సాంకేతికత అంశంపై చర్చకు నాలుగు సమావేశాలుఅదే సమయంలో మరో రెండు సమావేశాలనూ నిర్వహించారుఈ సమావేశాలకు జస్టిస్ అమరేశ్వర్ ప్రతాప్ సాహి అధ్యక్షత వహించగాశ్రీమతి నిధి ఖారే సహాధ్యక్షత వహించారుకీలక రంగాల్లో వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారాన్ని బలోపేతం చేయడం గురించి ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించారున్యాయరంగ ప్రముఖులురాష్ట్రస్థాయి అధికారులున్యాయ నిపుణుల క్రియాశీల భాగస్వామ్యంతో.. ఈ సమావేశాల్లో ఇ-జాగృతిరియల్ ఎస్టేట్-బీమా ఫిర్యాదుల యంత్రాంగాలువైద్య నిర్లక్ష్య పరిష్కార వేదికల ద్వారా డిజిటల్ ఆవిష్కరణలను గురించి ప్రధానంగా చర్చించారుఇతర సమావేశాల్లో జన్ విశ్వాస్ చట్టం-2023కు అనుగుణంగా లీగల్ మెట్రాలజీని అమలు చేయాల్సిన ప్రాముఖ్యతను చర్చించారుఅలాగే స్వతంత్ర పరీక్షల నిర్వహణతో ఉత్పత్తి నాణ్యతభద్రతను నిర్ధారించడం ద్వారాదక్షిణ భారత వినియోగదారుల భద్రతనుఈ రంగంలో జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంలో నేషనల్ టెస్ట్ హౌస్ కీలక పాత్రను ప్రధానంగా చర్చించారు.

దేశవ్యాప్తంగా వినియోగదారుల కేసుల నిరంతర పర్యవేక్షణ కోసం ఈ విభాగం ప్రత్యేకంగా కృషి చేస్తోందిదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఒకరోజు ప్రాంతీయ కార్యశాలలురాష్ట్రస్థాయి సమావేశాలను నిర్వహించడం దీనిలో భాగంగా ఉందివినియోగదారుల కేసుల పెండింగ్ సమస్యను చర్చించడానికిఅలాగే వేగవంతమైనమరింత ప్రభావవంతమైన పరిష్కారాన్ని అందించడానికి ఆచరణీయ పరిష్కారాలను గుర్తించడంలో ఈ చర్చలు కీలక వేదికలుగా పనిచేశాయి.

కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి శ్రీ భరత్ ఖేరా మాట్లాడుతూనైతిక వాణిజ్యంలో భారత చారిత్రక మూలాలనువినియోగదారుల భద్రత చట్టం-2019 పరివర్తన ప్రభావాన్ని ప్రధానంగా ప్రస్తావించారుతమిళనాడు ప్రభుత్వ సహకారఆహారం-వినియోగదారుల భద్రత శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ తిరు సత్యబ్రత సాహూ మాట్లాడుతూవినియోగదారుల భద్రత సంస్థలను బలోపేతం చేయడానికి సామర్థ్యాలను పెంపొందించడంశిక్షణ అందించాల్సిన అవసరం ఉందన్నారువినియోగదారులకు న్యాయం జరిగేలా చేయడంలో విధాన రూపకర్తల పాత్ర కీలకమని స్పష్టం చేశారు.

ఈ కార్యశాలలో పాల్గొన్న రాష్ట్రాలుసంబంధిత వ్యక్తులు వారి అధికారిక పరిధిలో వినియోగదారుల భద్రత విధానాల బలోపేతం కోసం కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉంటామని ప్రకటించడంతో ఈ కార్యశాల ముగిసిందిదక్షిణాది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోదేశవ్యాప్తంగా వినియోగదారుల శ్రేయస్సు కోసం వినియోగదారుల భద్రతా చట్టాలునిబంధనలుకార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడంలో రాష్ట్రాలుఇతర సంబంధిత వ్యక్తులుసంస్థలకు సహకారం కొనసాగుతుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటించింది.

సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారులురాష్ట్ర కమిషన్ ల సభ్యులుజిల్లా కమిషన్ ల అధ్యక్షులుసభ్యులుకర్నాటకకేరళతమిళనాడుఆంధ్రప్రదేశ్తెలంగాణలక్షద్వీప్పుదుచ్చేరిఅండమాన్-నికోబార్ దీవులు సహా దక్షిణ భారత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన ఇతర ప్రముఖులు సహా ఈ ప్రాంతంలోని స్వచ్ఛంద వినియోగదారుల సంస్థల ప్రతినిధులు ఈ కార్యశాలలో పాల్గొన్నారు.

 

***


(Release ID: 2136328)