లోక్‌సభ సచివాలయం
azadi ka amrit mahotsav

పహల్గామ్ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించిన 10 బ్రిక్స్ దేశాల పార్లమెంట్లు: ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమనే భారత్ విధానానికి పూర్తి మద్దతు


లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా నేతృత్వంలో బ్రెసిలియాలో 11వ బ్రిక్స్ పార్లమెంటరీ వేదికను సందర్శించిన భారత ప్రతినిధి బృందం

12వ బ్రిక్స్ పార్లమెంటరీ వేదిక అధ్యక్ష పగ్గాలు చేపట్టిన భారత్

Posted On: 06 JUN 2025 6:49PM by PIB Hyderabad

న్యూఢిల్లీ/బ్రెసిలియా 06 జూన్ 2025: 11వ బ్రిక్స్ పార్లమెంటరీ వేదిక 2025 జూన్ 4-5 తేదీల్లో బ్రెజిల్ లోని బ్రెసిలియాలో జరిగింది. ఇందులో భారతదేశంతో సహా మొత్తం 10 సభ్య దేశాల పార్లమెంటరీ ప్రతినిధులు పాల్గొన్నారులోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా  నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందంతో పాటు ఉన్నత స్థాయి పార్లమెంటరీ ప్రతినిధుల బృందం ఈ సమావేశంలో పాల్గొంది

భారత్బ్రెజిల్రష్యాచైనాదక్షిణాఫ్రికాఇరాన్యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ఈజిప్ట్ఇథియోపియాఇండోనేషియా మొదలైన పది బ్రిక్స్ దేశాలు ఈ సదస్సులో పాల్గొన్నాయిఆయా దేశాల పార్లమెంటరీ ప్రతినిధులు ఈ సదస్సులో చురుగ్గా పాల్గొని ఉమ్మడి ప్రకటన రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.

కృత్రిమ మేధ (ఏఐబాధ్యతాయుతమైన వినియోగంప్రపంచ వాణిజ్యంఆర్థిక వ్యవస్థఅంతర్-పార్లమెంటరీ సహకారంప్రపంచ శాంతిభద్రత వంటి కీలక అంతర్జాతీయ అంశాలపై పలు దఫాల ముమ్మర చర్చలుసంప్రదింపుల అనంతరం విస్తృత ఏకాభిప్రాయం కుదిరింది.

వివిధ అంశాలపై భారతదేశ వైఖరికి ఈ వేదికగా ప్రశంసలు వెల్లువెత్తాయివాటిని ఏకగ్రీవంగా తుది సంయుక్త ప్రకటనలో చేర్చారుముఖ్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ దృఢమైన విధానాన్ని బలంగా సమర్థించారుఅన్ని ఉగ్రవాద దాడులను భారత్ నిర్ద్వంద్వంగా ఖండించిందిఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించని విధానాన్ని అవలంబించాలని గట్టిగా వాదించింది

భారత్ లోని పహల్గామ్ లో ఇటీవల జరిగిన ఉగ్ర దాడిని సంయుక్త ప్రకటన తీవ్రంగా ఖండించిందిఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమష్టిగా వ్యవహరించడానికి భారత్సభ్యదేశాల పార్లమెంటరీ ప్రతినిధులు అంగీకరించారుఉగ్రవాద సంస్థలకు ఆర్థిక మద్దతును అరికట్టడానికిఇంటెలిజెన్స్ భాగస్వామ్యాన్ని పెంచడానికిఅభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల దుర్వినియోగాన్ని నివారించడానికిదర్యాప్తున్యాయ ప్రక్రియలలో సహకారాన్ని ప్రోత్సహించడానికి ఉమ్మడి ప్రయత్నాల అవసరాన్ని శ్రీ బిర్లా స్పష్టం చేశారు

భారతదేశ విధానానికినాయకత్వానికి ప్రత్యేక గుర్తింపు లభించిందిప్రపంచ శాంతిభద్రత కోసం అన్ని సభ్య దేశాల క్రియాశీల భాగస్వామ్యం అవసరమని బ్రిక్స్ పార్లమెంటులు ధృవీకరించాయిశ్రీ ఓం బిర్లా తన ప్రసంగంలో,  వివిధ కీలక అంశాలపై భారతదేశం తీసుకున్న దృఢమైనస్పష్టమైన స్థానాన్ని సమర్థవంతంగా ప్రస్తావించారుముఖ్యంగాఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టంగా ప్రకటించిన శక్తిమంతమైనతగిన ప్రతిస్పందనతో కూడిన కఠినమైన విధానాన్నిముఖ్యంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ సహకారంన్యాయమైనసమతుల్య అంతర్జాతీయ వ్యవస్థసాంకేతిక ఆవిష్కరణలలో భాగస్వామ్యంప్రజాస్వామ్యబద్ధంగా సమాచార మార్పిడికి సంబంధించి భారత్‌ దృఢ వైఖరిని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు

తదుపరి బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరానికి భారత్ అధ్యక్షత

సదస్సు ముగింపులోవచ్చే సంవత్సరం జరగనున్న 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరానికి భారత్ ఆతిథ్యం అందిస్తుందిలోకసభ స్పీకర్ శ్రీ ఓం బిర్లాకు ఈ మేరకు అధికారికంగా అధ్యక్ష పదవిని అప్పగించారు.

ఇప్పటి నుంచి భారతదేశం బ్రిక్స్ దేశాల పార్లమెంట్ల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంలో చురుకైన పాత్ర పోషించనుందిఅంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు పరస్పర దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లనుంది.

లోకసభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా నేతృత్వం వహించిన భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో  రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్రాజ్యసభ సభ్యుడు శ్రీ సురేంద్ర సింగ్ నాగర్లోకసభ సభ్యులు శ్రీ విజయ్ బఘేల్శ్రీ వివేక్ ఠాకూర్డాక్టర్ శబరీ బైరెడ్డి ఉన్నారు.

 

***


(Release ID: 2134748)