ప్రధాన మంత్రి కార్యాలయం
అయోధ్యలో రామ్ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
05 JUN 2025 6:33PM by PIB Hyderabad
అయోధ్యలో దివ్యమైన రామ్ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ రామ భక్తులందరినీ భక్తి, ఆనందాలతో నింపుతుందని ప్రధాని పేర్కొన్నారు.
మర్యాద పురుషోత్తముడు భగవంతుడు శ్రీరాముడు దేశ ప్రజలందరిని ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యంతో దీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు.
“ శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య మరో అద్భుతమైన, చారిత్రాత్మక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచింది. ఈ మహత్తరమైన, దివ్యమైన రామ్ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ చేసిన పవిత్ర సందర్భం రామభక్తులందరినీ భక్తితో, ఆనందంతో నింపుతుంది. మర్యాద పురుషోత్తముడు భగవంతుడు శ్రీ రాముడు దేశప్రజలందరికీ సుఖ సంతోషాలు, శ్రేయస్సు, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
జై శ్రీరాం”
(Release ID: 2134418)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam