భారత ఎన్నికల సంఘం
వీటీఆర్ వెల్లడి ప్రక్రియను అప్గ్రేడ్ చేయనున్న ఎన్నికల సంఘం
Posted On:
03 JUN 2025 5:21PM by PIB Hyderabad
ఎంతమంది ఓటర్లు ఎన్నికల్లో పాల్గొన్నారన్న పోలింగ్ శాతం ధోరణులపై సకాలంలో వివరాలను అందించడం కోసం ఓ క్రమబద్ధమైన, సాంకేతిక ఆధారిత వ్యవస్థను భారత ఎన్నికల సంఘం ప్రవేశపెడుతోంది. గతంలో సాంకేతికత ప్రమేయం లేకుండా సిబ్బంది స్వయంగా నమోదు చేసే పద్ధతి ఎక్కువ సమయం తీసుకునేది. ఈ కొత్త ప్రక్రియ ఆ సమయాభావాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేశ్ కుమార్ పలు సందర్భాల్లో చాలాసార్లు చెప్పినట్టు.. సకాలంలో ప్రజలకు సమాచారం అందించాలన్న ఎన్నికల సంఘం నిబద్ధతకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
ఎన్నికల నిర్వహణ నియమాలు-1961లోని నిబంధన 49ఎస్ ఓ చట్టబద్ధమైన ఏర్పాటు చేసింది. దీని ప్రకారం- ఎన్ని ఓట్లు పోలయ్యాయో వివరించే ఫారం 17సీ ని అభ్యర్థులు నియమించుకున్న, పోలింగ్ కేంద్రం ఉన్న పోలింగ్ ఏజెంట్లకు ఎన్నిక ముగింపు సమయంలో ప్రిసైడింగ్ అధికారులు అందించాలి. ఈ చట్టపరమైన ప్రక్రియలో ఎలాంటి మార్పూ లేదు. ఎన్నిక ప్రక్రియలో ఓటర్ల భాగస్వామ్య శాతానికి సంబంధించిన ధోరణుల సమాచారాన్ని (దాదాపుగా) ప్రజలకు అందించడానికి రూపొందించిన చట్టబద్ధం కాని యంత్రాంగమైన వీటీఆర్ యాప్ అప్డేటింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తున్నారు.
ఈ కొత్త కార్యక్రమంలో, ఇకనుంచి ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ రోజున రెండు గంటలకోసారి కొత్త ఈసీఐనెట్ (ECINET) యాప్లో ఓటు వేసిన వారి సంఖ్యను నేరుగా నమోదు చేస్తారు. దీంతో పోలింగ్ ధోరణుల్లో అంచనాలను ఎప్పటికప్పుడు అందించడంలో సమయాభావం తగ్గుతుంది. నియోజకవర్గ స్థాయిలో దీనిని క్రోడీకరిస్తారు. గతంలో మాదిరిగానే రెండు గంటలకోసారి ఓటింగ్ శాతం ధోరణుల్లో అంచనాలు వెల్లడవుతూనే ఉంటాయి. మరో ముఖ్యమైన విషయమేమిటంటే, పోలింగ్ ముగిసిన వెంటనే ఆ పోలింగ్ కేంద్రం నుంచి బయలుదేరడానికి ముందే ప్రిసైడింగ్ అధికారులు ఓటింగ్ శాతం గణాంకాలను ఈసీఐనెట్లో నమోదు చేస్తారు. ఇది జాప్యాన్ని నివారించడంతోపాటు ఎన్నిక ముగిసిన అనంతరం నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్ల శాతం అంచనా అప్డేటెడ్ వీటీఆర్ యాప్ లో అందుబాటులో ఉండేలా చూస్తుంది (నెట్వర్క్ కనెక్టివిటీ ఉంటే). మొబైల్ నెట్వర్కులు అందుబాటులో లేని చోట ముందుగా ఆఫ్లైన్లో నమోదు చేసి, కనెక్టివిటీ లభించిన తర్వాత ఆన్లైన్ లో పొందుపరచవచ్చు. ఈ అప్డేటెడ్ వీటీఆర్ యాప్ బీహార్ ఎన్నికల కన్నా ముందే ఈసీఐనెట్లో అంతర్భాగం కాబోతోంది.
గతంలో ఓటర్ల సంఖ్యకు సంబంధించి గణాంకాలను సెక్టార్ అధికారులు నేరుగా సేకరించి ఫోన్ కాల్స్, ఎఎస్ఎంఎస్ లేదా మెసేజింగ్ యాప్ల ద్వారా రిటర్నింగ్ అధికారులకు పంపేవారు. రెండు గంటలకోసారి ఈ సమాచారాన్ని క్రోడీకరించి, ఓటర్ టర్నవుట్ యాప్లో అప్లోడ్ చేసేవారు. భౌతిక రికార్డులు రాత్రి వేళల్లో ఆలస్యంగా వస్తే పోలింగ్ శాతం ధోరణులను చాలాసార్లు కొన్ని గంటల తర్వాత అప్డేట్ చేసేవారు. ఒక్కోసారి మరుసటి రోజు కూడా ఈ ప్రక్రియ జరిగేది. దీంతో నాలుగైదు గంటలు లేదా ఎక్కువగా జాప్యం జరిగేది. దీంతో కొన్ని తప్పుడు అంచనాలకు అవకాశముండేది.
***
(Release ID: 2133668)