ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఐఏటీఏ 81వ వార్షిక సర్వసభ్య సమావేశం.. వరల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సమిట్ ప్లీనరీ సమావేశంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ప్రపంచ అంతరిక్ష-విమానయాన రంగాల్లో బలమైన శక్తిగా భారత్ ఎదుగుతోంది

ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భారత్

ఉడాన్ పథకం విజయం భారత పౌర విమానయాన రంగంలో ఒక సువర్ణాధ్యాయం

ప్రపంచంలోని ప్రముఖ విమానయాన సంస్థల పెట్టుబడులకు అద్భుత అవకాశాలను భారత్ అందిస్తోంది: ప్రధానమంత్రి

Posted On: 02 JUN 2025 6:35PM by PIB Hyderabad

విమానయాన రంగంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, కనెక్టివిటీని మెరుగుపరచడం పట్ల తన నిబద్ధతకు అనుగుణంగాప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) 81వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీమ్).. వరల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సమిట్ (డబ్ల్యూఏటీఎస్ప్లీనరీ సమావేశంలో ప్రసంగించారుఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూఈ సమావేశానికి విచ్చేసిన అతిథులను స్వాగతించారునాలుగు దశాబ్దాల అనంతరం మళ్లీ ఈ కార్యక్రమాన్ని భారత్‌లో నిర్వహించడంలోని ప్రాముఖ్యతను ఆయన వివరించారుఈ కాలంలో భారత్‌లో చోటుచేసుకున్న సానుకూల మార్పులను ప్రధానంగా ప్రస్తావించిన ప్రధానమంత్రినేటి భారత్ ఎప్పుడూ లేనంత విశ్వాసంతో ఉందని పేర్కొన్నారుప్రపంచ వైమానిక రంగంలో భారత పాత్రను ప్రస్తావిస్తూవిస్తారమైన మార్కెట్‌గా మాత్రమే కాకుండా విధానపరమైన నాయకత్వంఆవిష్కరణలుసమగ్ర అభివృద్ధికి చిహ్నంగా భారత్ నిలిచిందన్నారు. "నేడుఅంతరిక్ష-విమానయాన రంగాల్లో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతోందిఅని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారుగత దశాబ్దంలో పౌర విమానయాన రంగం సాధించిన చారిత్రాత్మక పురోగతిని ప్రపంచమంతా చూస్తోందన్నారు.

ఈ సదస్సు, చర్చలు కేవలం విమానయాన రంగానికి మాత్రమే పరిమితం కాకుండాఇవి ప్రపంచ సహకారంవాతావరణ ఒప్పందాలుసమాన వృద్ధిని ముందుకు తీసుకెళ్లే వేదికగా పనిచేస్తాయని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారుఈ సదస్సులో జరిగే చర్చలు ప్రపంచ విమానయాన రంగానికి సరికొత్త దిశానిర్దేశం చేస్తాయన్నారుతద్వారా ఈ రంగంలో గల అపారమైన అవకాశాలను అందుబాటులోకి తేవడంతో పాటుదాని సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దపు ఆకాంక్షలు.. సంప్రదాయిక ప్రయాణాలకు మించి అభివృద్ధి చెందుతూనే ఉన్నాయని పేర్కొన్న ప్రధానమంత్రివిస్తారమైన దూరాలనుఖండాంతర ప్రయాణాలను కేవలం కొద్ది గంటల్లోనే పూర్తి చేయగల మానవాళి సామర్థ్యాన్ని ప్రధానంగా ప్రస్తావించారుఆవిష్కరణలుసాంకేతిక పురోగతి వేగంగా పురోగమిస్తున్న తరుణంలో.. సుదూరంలోని ప్రదేశాలు సైతం మన గమ్యస్థానంగా మారుతున్నాయని తెలిపారు.

ప్రయాణం ఇకపై భూమిమీద గల నగరాలకు మాత్రమే పరిమితం కాదని స్పష్టం చేసిన శ్రీ నరేంద్ర మోదీ.. అంతరిక్ష విమానాలుగ్రహాంతర ప్రయాణాలను వాణిజ్యీకరించాలనే ఆకాంక్షలు పెరుగుతున్న క్రమంలోవాటిని పౌర విమానయాన రంగంతో అనుసంధానించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారుఇటువంటి పరిణామాలకు సమయం పడుతుందనీపరివర్తన,  ఆవిష్కరణల కేంద్రంగా విమానయాన రంగ భవిష్యత్తును అవి నిర్దేశిస్తాయని ఆయన పేర్కొన్నారుదీనికోసం భారత్ పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారుభారత విమానయాన రంగానికి మూడు మూలాధారాలను ప్రధానమంత్రి వివరించారుమొదటిదివిస్తారమైన మార్కెట్.. కేవలం వినియోగదారుల సమాహారం మాత్రమే కాకుండా భారత ఆకాంక్షాత్మక సమాజ ప్రతిబింబంరెండోదిబలమైన యువతప్రతిభావంతుల సమూహం.. ఇక్కడ కృత్రిమ మేధస్సురోబోటిక్స్శుద్ధ ఇంధన రంగాల్లో పురోగతికి యువ ఆవిష్కర్తలు మార్గదర్శకులుగా ఉన్నారుమూడోదిస్వేచ్ఛాయుతసహకారాత్మక పరిపాలన వ్యవస్థలు.. పారిశ్రామిక వృద్ధికి వీలు కల్పిస్తాయిఈ బలాలతోభారత్ తన విమానయాన రంగాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

గత కొన్నేళ్లలో పౌర విమానయాన రంగంలో భారత్ సాధించిన అద్భుతమైన పరివర్తనను ప్రధానమంత్రి ప్రస్తావించారు. "ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భారత్ అవతరించిందిఅని ఆయన తెలిపారుఉడాన్ పథకం సాధించిన విజయాన్ని వివరిస్తూభారత పౌర విమానయాన చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా ఆ పథకాన్ని అభివర్ణించారుఈ పథకం ద్వారా 15 మిలియన్లకు పైగా ప్రయాణికులు సరసమైన విమాన ప్రయాణ ప్రయోజనం పొందారన్నారుఈ పథకం కారణంగా చాలా మంది పౌరులు తొలిసారి విమాన ప్రయాణం చేయగలిగారని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారుభారత విమానయాన సంస్థలు రెండంకెల వృద్ధిని సాధిస్తూనే ఉన్నాయనీఏటా 240 మిలియన్ల మంది ప్రయాణికులు విమాన ప్రయాణం చేస్తున్నారని తెలిపారుఈ సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాల మొత్తం జనాభాను అధిగమించిందని ప్రధానమంత్రి వివరించారు. 2030 నాటికి ఈ సంఖ్య 500 మిలియన్లకు చేరుకుంటుందని ఆయన అంచనా వేశారుదేశంలో ఏటా 3.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా జరుగుతోందనిఈ దశాబ్దం చివరి నాటికి ఈ పరిమాణం 10 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరగనుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

ఈ గణాంకాలు కేవలం అంకెలు మాత్రమే కాదని, అపారమైన భారత సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని స్పష్టం చేశారుఈ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచే భవిష్యత్ ప్రణాళికల రూపకల్పన కోసం భారత్ కృషి చేస్తోందని తెలిపారుప్రపంచ స్థాయి విమానాశ్రయ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భారత్ గణనీయంగా పెట్టుబడులు పెడుతోందని తెలిపిన ప్రధానమంత్రి, 2014లో దేశంలో 74 విమానాశ్రయాల్లో కార్యకలాపాలు సాగుతుండగాప్రస్తుతం వాటి సంఖ్య 162కి పెరిగిందని పేర్కొన్నారుభారత విమానయాన సంస్థలు వేలకు పైగా కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చాయనిఇది ఈ రంగంలో వేగవంతమైన వృద్ధిని సూచిస్తుందని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారుభారత విమానయాన రంగం అత్యున్నత స్థాయికి చేరే మార్గంలో కీలకమైన టేకాఫ్ దశలో ఉందనీఇది ప్రారంభం మాత్రమేనని తెలిపారుఈ పరివర్తన భౌగోళిక సరిహద్దులను అధిగమించడమే కాకుండా.. ఈ రంగాన్ని సుస్థిరతపర్యావరణహితమైన రవాణాప్రపంచవ్యాప్తంగా అందరికీ సమానంగా అందుబాటు ఉండడం దిశగా ముందుకు నడిపిస్తోందని వివరించారు.

"భారత విమానాశ్రయాలు ఇప్పుడు సంవత్సరానికి 500 మిలియన్ల మంది ప్రయాణీకుల నిర్వహణ సామర్థ్యాన్ని కలిగి ఉండిసాంకేతికత ద్వారా వినియోగదారుల అనుభవంలో సరికొత్త ప్రమాణాలను నిర్దేశిస్తున్న అతికొద్ది దేశాల్లో ఒకటిగా భారత్‌ను నిలుపుతున్నాయిఅని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారుభద్రతసామర్థ్యంసుస్థిరతకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారుసుస్థిరమైన విమాన ఇంధనాలుపర్యావరణహితమైన సాంకేతికతల్లో పెట్టుబడులుకర్బన ఉద్గారాల తగ్గింపు ప్రయత్నాల దిశగా భారత పరివర్తనను ఆయన స్పష్టం చేశారుఅభివృద్ధి పట్ల సమతుల్య విధానాన్ని బలోపేతం చేస్తూపురోగతిపర్యావరణ భద్రత రెండింటికీ కట్టుబడి భారత్ ముందుకుసాగుతోందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

డిజిటల్ ఏవియేషన్ కోసం ఒక మార్గదర్శక ఉదాహరణగా నిలిచే డిజి యాత్ర యాప్ గురించి అంతర్జాతీయ అతిథులు అవగాహన కలిగి ఉండి, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ప్రధానమంత్రి కోరారుముఖ ధృవీకరణ సాంకేతికత సహాయంతో ప్రయాణికులు అవసరమైన పత్రాలుగుర్తింపు రుజువులను చూపించే అవసరం లేకుండా విమానాశ్రయ ప్రవేశ ద్వారం నుంచి బోర్డింగ్ ద్వారాల వరకు సజావుగా ముందుకు సాగేందుకు డిజి యాత్ర యాప్ వీలు కల్పిస్తుందని ప్రధానమంత్రి వివరించారుఅత్యంత ఎక్కువ జనాభాకు సేవలందించడంలో భారత ఆవిష్కరణలుఅనుభవం అనేక దేశాలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. "దక్షిణార్ధ గోళంలోని దేశాల కోసం ప్రేరణాత్మక నమూనాగా పనిచేసే ఈ డిజి యాత్ర.. సురక్షితమైనస్మార్ట్ పరిష్కారంగా నిలుస్తుందిఅని ఆయన తెలిపారు.

దేశంలో వేగంగా విస్తరిస్తున్న విమానయాన రంగానికి నిరంతర సంస్కరణలు కీలకమైన చోదక శక్తిగా ఉన్నాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ దార్శనికతకు మద్దతునిచ్చే వ్యూహాత్మక చొరవలతో ప్రపంచ తయారీ కేంద్రంగా మారడం పట్ల భారత నిబద్ధతను ఆయన వివరించారుఈ సంవత్సరం బడ్జెట్‌లో మిషన్ మానుఫాక్చరింగ్ ప్రకటన ద్వారా పారిశ్రామిక వృద్ధిపై దృష్టిని భారత్ మరింత బలోపేతం చేస్తుందని తెలిపారుఈ సంవత్సరం పార్లమెంటు ఆమోదం పొందిన విమాన విడిభాగాల బిల్లులోని ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి ప్రస్తావించిన ప్రధానమంత్రి.. ఇది భారత్‌లో కేప్‌టౌన్ ఒప్పందానికి చట్టపరమైన అధికారాలను కల్పించిందని తెలిపారుఈ చట్టంప్రపంచ విమాన లీజింగ్ కంపెనీలకు భారత్‌లో కొత్త అవకాశాలను అందించిందన్నారుగిఫ్ట్ సిటీలో అందించే ప్రోత్సాహకాలను గురించి వివరించిన ఆయనఈ చర్యలు విమాన లీజింగ్‌ కోసం ఆకర్షణీయమైన గమ్యస్థానంగా భారత్‌ను నిలిపాయని పేర్కొన్నారు.

"కొత్త ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం ప్రపంచ అత్యుత్తమ పద్ధతులకు అనుగుణంగా విమానయాన చట్టాలను రూపొందిస్తూ.. క్రమబద్ధీకరించిన నియంత్రణ వ్యవస్థఅనుమతుల సౌలభ్యంసరళీకృత పన్ను నిర్మాణాలకు భరోసానిస్తుందిఇది ప్రధాన అంతర్జాతీయ విమానయాన సంస్థలకు గణనీయమైన పెట్టుబడి అవకాశాలను అందిస్తుందిఅని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారువిమానయాన రంగంలో వృద్ధి కొత్త విమానాలుకొత్త ఉద్యోగాలుకొత్త అవకాశాలకు దారితీస్తుందని ఆయన పేర్కొన్నారుఈ రంగంలో పైలట్లుసిబ్బందిఇంజనీర్లుగ్రౌండ్ స్టాఫ్ కోసం అపారమైన అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని ఆయన పేర్కొన్నారుకొత్తగా అభివృద్ధి చెందుతున్న నిర్వహణమరమ్మత్తుఓవర్‌హాల్ (ఎమ్ఆర్ఓకేంద్రాల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారువిమాన నిర్వహణలో ప్రపంచ కేంద్రంగా మారే దిశగా భారత్ ప్రయత్నాలను వేగవంతం చేస్తోందని ఆయన తెలిపారు. 2014లో దేశంలో 96 ఎమ్ఆర్ఓ కేంద్రాలు ఉండగావాటి సంఖ్య ప్రస్తుతం 154కి పెరిగిందన్నారుఆటోమేటిక్ రూట్జీఎస్‌టీ తగ్గింపుపన్నుల హేతుబద్ధీకరణ చర్యలు భారత ఎమ్ఆర్ఓ రంగానికి కొత్త ఊపునిచ్చాయని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2030 నాటికి బిలియన్ డాలర్ల విలువైన ఎమ్ఆర్ఓ హబ్‌ స్థాపించాలనే భారత లక్ష్యాన్ని వివరించిన ఆయనఇది దేశ విమానయాన రంగ అభివృద్ధి వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు.

భారత్‌ను కేవలం విమానయాన మార్కెట్‌గా పరిగణించరాదన్న ప్రధానమంత్రి, వాల్యూ-చెయిన్ లీడర్‌గా చూడాలని స్పష్టం చేశారుడిజైన్ నుంచి డెలివరీ వరకు ప్రపంచ విమానయాన సప్లయి చెయిన్‌లో భారత్ అంతర్భాగంగా మారుతోందని ఆయన పేర్కొన్నారుభారత దిశవేగం సరైన మార్గంలో ఉన్నాయన్న ఆయన.. నిరంతర వేగవంతమైన దేశ పురోగతి పట్ల విశ్వాసం వ్యక్తం చేశారుప్రపంచ విమానయాన ఆవిష్కరణల్లో భారత నాయకత్వ దార్శనికతను బలోపేతం చేస్తూ, 'మేక్ ఇన్ ఇండియామాత్రమే కాకుండా 'డిజైన్ ఇన్ ఇండియాస్ఫూర్తిగా పనిచేయాలని విమానయాన సంస్థలకు ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు.

భారత విమానయాన రంగం దాని సమ్మిళిత నమూనా ద్వారా బలోపేతం అయ్యిందన్న ప్రధానమంత్రి.. దేశంలో 15 శాతానికి పైగా పైలట్లు మహిళలేననిఇది ప్రపంచ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువ అన్నారుక్యాబిన్ సిబ్బందిలో మహిళల ప్రపంచ సగటు 70 శాతం ఉండగాభారత్‌లో ఇది 86 శాతంగా ఉందని తెలిపారుదేశంలోని ఎమ్ఆర్ఓ రంగంలో మహిళా ఇంజనీర్ల సంఖ్య ప్రపంచ సగటును మించిపోయిందనీఇది ఈ రంగంలో పెరుగుతున్న మహిళా భాగస్వామ్యానికి నిదర్శనమని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

విమానయాన రంగ భవిష్యత్తులో డ్రోన్ సాంకేతికత అత్యంత కీలకమైనదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సాంకేతిక పురోగతితో పాటు ఆర్థిక-సామాజిక సమగ్రత కోసం భారత్ దీనిని చక్కగా ఉపయోగించుకుంటోందని తెలిపారుమహిళా స్వయం సహాయక బృందాలకు సాధికారత కల్పించడానికి.. వ్యవసాయండెలివరీ సేవలువిభిన్న రంగాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచడానికి డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారని ఆయన వివరించారు.

"విమానయాన భద్రతకు ఎల్లప్పుడూ భారత్ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందిఐసీఏఓ సూచించిన ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా భారత్ తన నిబంధనల్లో మార్పులు చేసిందిఅని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారుఅంతర్జాతీయంగా అనుసరిస్తున్న అత్యుత్తమ పద్ధతుల అమలు పట్ల భారత నిబద్ధతను ఇది మరింత బలపరిచిందన్నారుఐసీఏఓ ఇటీవల నిర్వహించిన భద్రతా ఆడిట్ సందర్భంగావిమానయాన భద్రత బలోపేతం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించిందని తెలిపారుఆసియా-పసిఫిక్ మంత్రులస్థాయి సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించడం.. ప్రపంచ విమానయాన నైపుణ్యాల పట్ల భారత నిబద్ధతను మరింత స్పష్టం చేసిందని ప్రధానమంత్రి వివరించారు.

భారత్ ఎప్పుడూ స్వేచ్ఛాయుత గగనతలం, గ్లోబల్ కనెక్టివిటీకి మద్దతునిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారుమరింత అనుసంధానితమైనఅందుబాటులో ఉండే విమానయాన నెట్‌వర్క్ కోసం అనుకూలంగా వాదిస్తూచికాగో ఒప్పంద నియమాలను భారత్ ఆమోదిస్తుందని ఆయన పునరుద్ఘాటించారువిమాన ప్రయాణం అందరికీ అందుబాటులోసరసమైనదిగాసురక్షితమైనదిగా ఉండేలా చేయడం కోసం సంబంధిత సంస్థలువిభాగాలు కలిసి పనిచేయాలని శ్రీ నరేంద్ర మోదీ సూచించారువిమానయానాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే కొత్త పరిష్కారాలను అభివృద్ధి చేయగల ఈ రంగం సామర్థ్యం పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూసంబంధిత సంస్థలువిభాగాలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు శ్రీ కింజరాపు రామ్ మోహన్ నాయుడు, శ్రీ మురళీధర్ మొహోల్ఐఏటీఏ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ శ్రీ పీటర్ ఎల్బర్స్ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ శ్రీ విల్లీ వాల్ష్ఇండిగో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాహుల్ భాటియా తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

ఈ నెల 1 నుంచి వరకు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) 81వ వార్షిక సర్వసభ్య సమావేశం.. వరల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సమిట్ (డబ్ల్యూఏటీఎస్జరుగుతున్నాయిభారత్‌లో చివరగా ఈ ఏజీఎమ్ 42 సంవత్సరాల క్రితం 1983లో నిర్వహించారుప్రపంచ విమానయాన రంగ ప్రముఖులుప్రభుత్వ అధికారులుఅంతర్జాతీయ మీడియా ప్రతినిధులు సహా 1,600 మందికి పైగా ఈ సమావేశాలకు హాజరయ్యారు.

విమానయాన రంగం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై ఈ వరల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సమిట్ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. వీటిలో విమానయాన రంగ ఆర్థిక వ్యవహారాలుఎయిర్ కనెక్టివిటీఇంధన భద్రతసుస్థిర విమాన ఇంధన ఉత్పత్తిఫైనాన్సింగ్ డీకార్బొనైజేషన్ఆవిష్కరణలు మొదలైన ఇతర అంశాలు కూడా భాగంగా ఉన్నాయిప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన రంగ ప్రముఖులుమీడియా ప్రతినిధులు.. భారత విమానయాన రంగంలో చోటుచేసుకున్న అద్భుతమైన పరివర్తననుదేశ సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో దాని సహకారాన్ని గురించి ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు.

 

***


(Release ID: 2133459)