సహకార మంత్రిత్వ శాఖ
సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వ పథకంపై కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో సమీక్షా సమావేశం
మోదీ ప్రభుత్వ దార్శనిక ఆహార ధాన్యాల నిల్వ పథకం తో పెరగనున్న పీఏసీఎస్ ల ఆదాయం, గ్రామీణ ఉపాధి
పీఏసీఎస్ లకు రుణ సదుపాయం విస్తరణ: పథకంలో పీఏసీఎస్ లకు క్రియాశీలక భాగస్వామ్యం
ఎఫ్ సీఐ, ఎన్ సీసీఎఫ్ , నాఫెడ్ , స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ పీఏసీఎస్ లను వీలైనన్ని ఎక్కువ గోదాములతో అనుసంధానం చేయాలి
సంపూర్ణ సహకార సరఫరా మార్గాన్ని అభివృద్ధి చేయడానికి, రాష్ట్రాలు, సహకార మార్కెటింగ్ సమాఖ్య తమ స్థాయిలో వీలైనన్ని ఎక్కువ పిఎసిఎస్ లను భాగస్వామ్యం చేయాలి
ఆహార ధాన్యాల నిల్వ పథకాన్ని సమన్వయంతో సకాలంలో అమలు చేయాలి: ఇది 'ఆత్మనిర్భర్ భారత్' దిశగా కీలక ముందడుగు
Posted On:
02 JUN 2025 6:51PM by PIB Hyderabad
సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వ పథకంపై కేంద్రహోం, , సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా న్యూఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. సహకార శాఖ సహాయ మంత్రులు శ్రీ క్రిషన్ పాల్ గుర్జార్, శ్రీ మురళీధర్ మొహోల్ లతో పాటు సహకార, ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాలు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సిఐ), నాబార్డ్, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్ సిడిసి), ఇతర సంస్థల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో శ్రీ అమిత్ షా ప్రసంగిస్తూ, ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వ పథకం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత - సహకర్ సే సమృద్ధి - ని సాకారం చేసే దిశగా ఒక పెద్ద అడుగు అని అన్నారు. భారత్ లో ఆర్థిక పురోగతిని కొలవడానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), ఉపాధి కల్పన అనే రెండు ప్రధాన కొలమానాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్) ఆదాయాన్ని పెంచడంతో పాటు గ్రామీణ ఉపాధి అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా ఈ రెండు అంశాలను బలోపేతం చేయడానికి ఆహార నిల్వ పథకాన్ని ఉద్దేశించారు. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఏఐఎఫ్) కింద రుణ వ్యవధిని పొడిగించడం ద్వారా పీఏసీఎస్ ల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు.
ఆహార నిల్వ పథకంలో పీఏసీఎస్ ల విస్తృత భాగస్వామ్యం అవసరాన్ని ఉద్ఘాటిస్తూ, పీఏసీఎస్ లను ఈ పథకంలో అంతర్భాగం చేయడం తప్పనిసరి అని,తద్వారా పీఏసీఎస్ ల ఆర్థిక సామర్ధ్యాన్ని, సామాజిక ప్రభావాన్ని నిర్ధారించవచ్చని కేంద్ర సహకార మంత్రి అన్నారు. ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా పథకం అమలు సజావుగా జరిగేలా దేశవ్యాప్తంగా గోదాముల జాతీయ స్థాయి మ్యాపింగ్ నిర్వహించాలని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలను శ్రీ అమిత్ షా ఆదేశించారు. పీఏసీఎస్ లను వీలైనన్ని ఎక్కువ గోదాములతో అనుసంధానం చేయాలని ఎఫ్సీఐ, ఎన్ సీసీఎఫ్ , నాఫెడ్ , స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లను కూడా ఆయన ఆదేశించారు.
సంపూర్ణ సహకార సరఫరా గొలుసు మార్గాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్రాలు తమ స్థాయిలో ఈ పథకంలో మరిన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను చేర్చాలని, అలాగే రాష్ట్ర స్థాయి మార్కెటింగ్ సమాఖ్యలను కూడా దీనితో అనుసంధానించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
'ఆత్మనిర్భర్ భారత్', 'సహకర్ సే సమృద్ధి' లక్ష్యాలను సాధించడంలో ఒక మైలురాయిగా నిలిచేలా అన్ని సంస్థలను సమన్వయం చేసుకుని సకాలంలో, సమర్థవంతంగా ఈ పథకాన్ని అమలు చేయాలని కేంద్ర సహకార మంత్రి శ్రీ అమిత్ షా పిలుపునిచ్చారు.
***
(Release ID: 2133422)