నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

మధ్యతరహా పరిశ్రమల కోసం విధాన రూపకల్పనపై నీతి ఆయోగ్ నివేదిక


మధ్యతరహా పరిశ్రమలే భవిష్యత్తులో పెద్ద సంస్థలు.. వికసిత భారత్‌కు చోదకాలు

భారత జీడీపీలో ఎంఎస్ఎంఈ రంగం వాటా 29%


60% శ్రామిక శక్తికి ఎంఎస్ఎంఈలతో ఉపాధి


ఎంఎస్ఎంఈల్లో మధ్యతరహా పరిశ్రమల వాటా 0.3 శాతమే అయినా,

ఆ రంగంలో ఎగుమతుల్లో 40 శాతం వాటా.. వాటి సమర్థతకు ఇది నిదర్శనం


తగిన ఆర్థిక మార్గాలు, సాంకేతిక ఏకీకరణ, ఇండస్ట్రీ 4.0, క్లస్టర్ ఆధారిత పరీక్ష కేంద్రాలు,

పరిశోధన- అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, కేంద్రీకృత డిజిటల్ పోర్టలుపై దృష్టి

Posted On: 26 MAY 2025 1:52PM by PIB Hyderabad

భారత ఆర్థిక వ్యవస్థకు మధ్యతరహా పరిశ్రమలను భవిష్యత్ వృద్ధి చోదకాలుగా నిలిపే సమగ్ర ప్రణాళికను అందిస్తూ.. ‘మధ్యతరహా పరిశ్రమల కోసం విధాన రూపకల్పన’ పేరిట నీతి ఆయోగ్ ఓ నివేదికను విడుదల  చేసిందిమధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీవాటికి తక్కువ ప్రాధాన్యమే ఇస్తున్నారని ఈ నివేదిక ప్రముఖంగా పేర్కొన్నదివాటి పూర్తి సామర్థ్యాన్ని ఆవిష్కరించడం లక్ష్యంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించిందినీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే సారస్వత్డాక్టర్ అరవింద్ వీర్మానీ సమక్షంలో వైస్ చైర్మన్ సుమన్ బేరీ ఈ నివేదికను ఆవిష్కరించారు.

దేశ జీడీపీలో దాదాపు 29 శాతంఎగుమతుల్లో 40 శాతం వాటాతోపాటు శ్రామిక శక్తిలో 60 శాతానికి పైగా ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈ రంగంలో నిర్మాణాత్మక అసమతౌల్యాన్ని ఈ నివేదిక పరిశీలిస్తుందికీలక పాత్ర పోషిస్తున్న ఈ రంగం కూర్పు అసమానంగా ఉందినమోదైన ఎంఎస్ఎమ్ఈలలో 97% సూక్ష్మ సంస్థలు, 2.7% చిన్న సంస్థలు కాగా, 0.3% మాత్రమే మధ్యతరహా సంస్థలు.

అయితేఈ 0.3 శాతం మధ్యతరహా పరిశ్రమల నుంచే దాదాపు 40% ఎంఎస్ఎంఈ ఎగుమతులు జరుగుతున్నాయిభారీఆవిష్కరణ ఆధారిత యూనిట్లుగా వాటి సామర్థ్యాన్ని ఇంకా ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకతను ఇది స్పష్టం చేస్తుందివికసిత భారత్ @2047లో భాగంగా స్వయంసమృద్ధిఅంతర్జాతీయ పారిశ్రామిక పోటీతత్వం దిశగా భారత పరివర్తనలో మధ్యతరహా సంస్థలను వ్యూహాత్మక పాత్రధారులుగా ఈ నివేదిక గుర్తించింది.

పరిమిత ఆర్థిక వనరులుఅధునాతన సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో పరిమితులుపరిశోధనఅభివృద్ధికి తగినంత చేయూత లేకపోవడంరంగాల వారీగా పరీక్ష మౌలిక సదుపాయాలు లేకపోవడంశిక్షణ కార్యక్రమాలు సంస్థల అవసరాలకు మధ్య అసమతౌల్యం సహా మధ్యతరహా సంస్థలు ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను ఈ నివేదిక ప్రస్తావించిందిఇవి వాటి స్థాయిని పరిమితం చేయడంతోపాటు ఆవిష్కరణ సామర్థ్యానికీ ఆటంకంగా ఉన్నాయి.

ఈ సమస్యల పరిష్కారం కోసంఆరు ప్రాధాన్య రంగాల్లో లక్ష్యాల సాధన దిశగా కార్యక్రమాలతో సమగ్ర విధానాలను ఈ నివేదిక వివరిస్తుంది:

  • తగిన ఆర్థిక సాధనాలు: సంస్థ టర్నోవర్‌తో ముడిపడి ఉన్న నిర్వహణ మూలధన పెట్టుబడి పథకాన్ని ప్రవేశపెట్టడంమార్కెట్ రేట్ల ప్రకారం రూ.5 కోట్ల క్రెడిట్ కార్డు సదుపాయంరిటైల్ బ్యాంకుల ద్వారా త్వరితగతిన నిధుల పంపిణీ యంత్రాంగాలుఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణ.

  • సాంకేతిక ఏకీకరణఇండస్ట్రీ 4.0: ఇండస్ట్రీ 4.0 అంశాలను ప్రోత్సహించేలా ప్రస్తుత సాంకేతిక కేంద్రాలను రంగాలవారీగాప్రాంతీయంగా అనుకూలీకరించిన ఇండియా ఎస్ఎంఈ 4.0 సామర్థ్య కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయడం.

  • పరిశోధన అభివృద్ధి ప్రోత్సాహక యంత్రాంగంఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖలో పరిశోధనఅభివృద్ధి కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడంజాతీయ ప్రాధాన్యం కలిగిన క్లస్టర్ ఆధారిత ప్రాజెక్టుల కోసం స్వయంసమృద్ధ భారత్ నిధిని ఉపయోగించడం.

  • క్లస్టర్ ఆధారిత పరీక్ష సదుపాయాలు: అనుమతులను సులభతరం చేయడంతోపాటు ఉత్పత్తి నాణ్యతను పెంచడానికి రంగాలవారీగా పరీక్షధ్రువీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం.

  • నైపుణ్యాభివృద్ధి: ప్రాంతాలురంగాల వారీగా పారిశ్రామిక అవసరాలకు తగిన నైపుణ్య కార్యక్రమాలను రూపొందించడంప్రస్తుత పారిశ్రామికనైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలతో (ఈఎస్‌డీపీమధ్యతరహా సంస్థల కేంద్రీకృత నమూనాలను అనుసంధానం చేయడం.

  • కేంద్రీకృత డిజిటల్ పోర్టల్: ఉద్యమ్ వేదికలో ప్రత్యేక సబ్‌పోర్టల్ ఏర్పాటు చేయడంసంస్థలు తమ వనరులను సమర్థంగా గుర్తించడంలో సాయపడేలా పథకాలను గుర్తించే సాధనాలుఅనుమతుల కోసం చేయూతఏఐ ఆధారిత సహాయాన్ని ఈ సబ్ పోర్టల్‌లో అంతర్భాగం చేయడం.

సమ్మిళిత విధాన రూపకల్పనను సహకారంతో కూడిన నిర్వహణ దిశగా మళ్లించడం ద్వారా మధ్యతరహా సంస్థల సామర్థ్యాన్ని పూర్తిగా ఆవిష్కరించాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక స్పష్టం చేసిందిపెట్టుబడిసాంకేతికతమౌలిక సదుపాయాలునైపుణ్యాభివృద్ధిసమాచారాన్ని అందుబాటులోకి తేవడం ద్వారా.. సృజనాత్మకతఉపాధిఎగుమతుల్లో వృద్ధికి చోదకాలుగా మధ్యతరహా పరిశ్రమలు నిలుస్తాయి. 2047 నాటికి వికసిత భారత్‌ను సాకారం చేసుకోవడానికి ఇది అత్యంత కీలకమైన అంశం.

పూర్తి నివేదికను ఇక్కడ చదవండిhttps://www.niti.gov.in/sites/default/files/2025-05/Designing-a-Policy-for-Medium-Enterprises.pdf

 

***

 


(Release ID: 2131393)