ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం

Posted On: 08 MAY 2025 2:17PM by PIB Hyderabad

జాతిభద్రత విషయమై ఇటీవలి పరిణామాల నేపథ్యంలో దేశం మొత్తంలో అప్రమత్తతఅంతర మంత్రిత్వశాఖల మధ్య సమన్వయం వంటి ముఖ్యమైన అంశాలను సమీక్షిస్తూ... వివిధ మంత్రిత్వ శాఖలువిభాగాల కార్యదర్శులతో ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించారుమంత్రిత్వశాఖలూకార్యనిర్వాహక వ్యవస్థల మధ్య సందిగ్ధానికి తావులేకుండా చక్కటి సమన్వయం ఉండాలనీవ్యవస్థ మొత్తం అత్యంత పటిష్టంగా ఉండాలనీ ఆయన గట్టిగా సూచించారు.

ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవడంలో మంత్రిత్వ శాఖల ప్రణాళికలనుసన్నద్ధతను ప్రధాని సమీక్షించారు

తమకు సంబంధించిన మంత్రిత్వ శాఖల కార్యకలాపాలపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని ఆయన కార్యదర్శులను ఆదేశించారుఅలాగే అవసరమైన వ్యవస్థల పనితీరులో ఎలాంటి లోపాలు లేకుండా చూడటంతో పాటు సన్నద్ధతఅత్యవసర సమయాల్లో స్పందనఅంతర్గత సమాచార వ్యవస్థల ప్రొటోకాల్‌పై దృష్టి సారించాలని ఆదేశించారు.

ప్రస్తుత వాతావరణానికి అనుగుణంగామంత్రిత్వశాఖల ప్రణాళికలూసన్నద్దత అంశాలను ఆయన సమీక్షించారు.

మంత్రిత్వశాఖల సన్నాహాలుసంబంధిత అత్యవసర వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నదీ లేనిదీ కూడా శాఖల వారీగా ఆయా శాఖలకు చెందిన కార్యదర్శులు పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించాలని ఆదేశించారుఅత్యవసర వ్యవస్థల సన్నద్ధతసత్వర స్పందనప్రోటోకాల్ కు అనుగుణంగా సమాచార వినిమయంఅన్న అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ప్రధాని సూచించారు.

ప్రస్తుత సమయంలోప్రభుత్వం-ఏకోన్ముఖంగా అన్నట్లు ఏ రకంగా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నదీ కార్యదర్శులు వివరంగా ప్రధానమంత్రి ముందు ఉంచారు.

ఘర్షణకు సంబంధించివెంటనే కార్యచరణకు దిగాల్సిన అంశాలను అన్ని మంత్రిత్వశాఖలూ ఇప్పటికే గుర్తించాయికార్యాచరణకు వీలుగా వాటిని మరింత బలోపేతం కూడా చేశారుఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు మంత్రిత్వశాఖలన్నీ సర్వసన్నద్ధంగా ఉన్నాయి.


 

సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయిసివిల్డిఫెన్స్ వ్యవస్థలూఅబద్ధపు వార్తల ప్రచారాన్ని నిరోధించడంకీలక వ్యవస్థల భద్రత వంటి అంశాలు ఇందులో ఉన్నాయిరాష్ట్ర ప్రభుత్వాలుక్షేత్రస్థాయి వ్యవస్థలతోనూ సమన్వయం చేసుకోవాలని కూడా మంత్రిత్వశాఖలకు సూచించారు.

ఈ సమావేశంలో క్యాబినెట్ కార్యదర్శిప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారులురక్షణహోం వ్యవహరాలువిదేశీ వ్యవహారాలుసమాచార-ప్రసార శాఖవిద్యుత్ఆరోగ్యంటెలికమ్యూనికేషన్లతో పాటు ఇతర కీలక మంత్రిత్వ శాఖల కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న సున్నిత వాతావరణంలోనిరంతర అప్రమత్తతసంస్థాగత సమన్వయంస్పష్టమైన సమాచార వినిమయం ఉండాలని ప్రధానమంత్రి తెలిపారుదేశభద్రతకార్యసన్నద్ధతపౌర రక్షణ అంశాల్లో ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

 

 ***


(Release ID: 2127706)