WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

పాన్-ఇండియన్ అన్నది నిజమే: భారతీయ సినిమా ఐక్యంగా ఉందని స్పష్టం చేసిన సినీరంగ ప్రముఖులు


కోవిడ్ అనంతరం మారుతున్న సినిమా వినియోగ ధోరణులను ప్రధానంగా ప్రస్తావించిన అనుపమ్ ఖేర్
మన ఉమ్మడి వారసత్వాన్ని, మన పాటలను, మన కథలను, మన నేలను మీరు గౌరవించినప్పుడు..

మీ సినిమా భారతీయ సినిమా అవుతుంది: ఖుష్బూ సుందర్

 प्रविष्टि तिथि: 02 MAY 2025 5:57PM |   Location: PIB Hyderabad

ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరుగుతున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్వేవ్స్ 2025 వేదికగా "పాన్-ఇండియన్ సినిమామిత్ ఆర్ మూమెంటమ్" అనే అంశంపై స్ఫూర్తిదాయకమైన ప్యానెల్ చర్చను నిర్వహించారుశ్రీ నమన్ రామచంద్రన్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ చర్చా సమావేశంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన నలుగురు ప్రముఖులు శ్రీ నాగార్జునశ్రీ అనుపమ్ ఖేర్శ్రీ కార్తీశ్రీమతి ఖుష్బూ సుందర్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

సినిమా శక్తి అది పలికించే భావోద్వేగాల్లోనే ఉందని శ్రీమతి ఖుష్బూ సుందర్ ప్రేక్షకులకు గుర్తు చేశారుబాలీవుడ్ప్రాంతీయ చిత్ర పరిశ్రమల మధ్య ఎటువంటి విభజన ఉండకూడదనీభారతీయ సినిమాలన్నీ భారతీయులందరి భావాలను దృష్టిలో ఉంచుకునే రూపొందుతాయని ఆమె స్పష్టం చేశారు. "మన ఉమ్మడి వారసత్వాన్నిమన పాటలనుమన కథలనుమన నేలను గౌరవించినప్పుడుమీ సినిమా ప్రాంతీయ సినిమాగానో.. జాతీయస్థాయి సినిమాగానో కాకుండాభారతీయ సినిమా అవుతుందనీ దానివల్ల అన్నీ చక్కబడుతాయిఅని ఆమె వ్యాఖ్యానించారు.

శ్రీ నాగార్జున మాట్లాడుతూ... భారత చలనచిత్ర నిర్మాణ సంప్రదాయాలన్నీ కలిపి అల్లిన గొప్ప సాంస్కృతిక వేడుకగా దీనిని అభివర్ణించారుకథలు చెప్పే వారికి సదా స్ఫూర్తినిచ్చే అసంఖ్యాక భాషలుఆచారాలుప్రకృతి దృశ్యాల గురించి ఆయన ప్రస్తావించారుఒకరి మూలాల పట్ల గర్వం సృజనాత్మకతను అడ్డుకోదనిఅది దానిని విముక్తి చేస్తుందని పేర్కొన్న నాగార్జున అదే భారతీయ సినిమా నిజమైన సారాంశం అని ప్రేక్షకులకు గుర్తు చేశారు.

శ్రీ అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.... కోవిడ్ మహమ్మారి కారణంగా సినిమా వినియోగ ధోరణిలో వచ్చిన మార్పులను ప్రస్తావించారుప్రేక్షకులు వివిధ వనరుల ద్వారా సినిమాలను చూడడం ప్రారంభించారని అయితే ఇది వివిధ ప్రాంతాలకు చెందిన సినిమా గురించి కాదు... భారతీయ సినిమా గురించి మాత్రమేనన్నారుప్రతిఒక్కరూ తమ కళా నైపుణ్యం విషయంలో సత్యంనిజాయితీలను ఆచరించాలని ఆయన సూచించారు, “మీరు పెద్ద తెరపై ఒక పౌరాణిక గాథను ప్రదర్శిస్తున్నాజీవిత భాగాన్ని నాటకంగా ప్రదర్శిస్తున్నాఆ కథను చెప్పడంలో మీ నిజాయితీ మీకు  గొప్ప మిత్రునిగా తోడుంటుందిప్రేక్షకులు ఆకర్షణీయమైన దృశ్యాలను కోరుకుంటారు. కానీ వారు ఎల్లప్పుడూ నిజాయితీనే ప్రశంసిస్తారు.. అదే సినిమా విషయంలో పనిచేస్తుంది.” అని ఆయన వ్యాఖ్యానించారు.

శ్రీ కార్తీ మాట్లాడుతూజీవితాతీతమైన అనుభవాల పట్ల శాశ్వతమైన ఆసక్తిని గురించి ప్రస్తావించారునేటి ప్రేక్షకులకు వైవిధ్యమైన కంటెంట్ అందుబాటులో ఉన్నప్పటికీపాటలు-నృత్యాల గొప్ప ఉత్సాహం కోసంవీరోచిత ఇతిహాసాల మాయాజాలం కోసం వారు ఇప్పటికీ థియేటర్లకు తరలివస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

చర్చల అంతటాప్యానెలిస్టులు "ప్రాంతీయచిత్రాల భావనకు మించి వృద్ధి చెందడం గురించిభారతీయ చిత్రాల భావనను స్వీకరించాల్సిన ప్రాముఖ్యతను గురించి ప్రస్తావించారుభావోద్వేగాలునిజాయితీల ప్రాముఖ్యాన్ని వివరించారుభారతీయ సినిమా నిజమైన బలం విభజనల్లో కాదు. మన నేలతో ముడిపడి ఉన్న ఐక్యతలోనే ఉందనీ.. అదే ఊపు భారతీయ సినిమాను ముందుకు తీసుకెళ్లగలదని వారు స్పష్టం చేశారు.

ఎప్పటికప్పుడు అధికారిక అప్‌డేట్స్ కోసందయచేసి మమ్మల్ని అనుసరించండి:

ఎక్స్ పై

https://x.com/WAVESummitIndia

https://x.com/MIB_India

https://x.com/PIB_India

https://x.com/PIBmumbai

 

***


रिलीज़ आईडी: 2126650   |   Visitor Counter: 31

इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Punjabi , Gujarati , Kannada