WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

వేవ్స్ వేదికగా భారత సృజనాత్మక రంగ భవిష్యత్తును వివరించిన కిరణ్ మజుందార్ షా


అంకురసంస్థలు సినిమాలకు అతీతంగా ఆలోచిస్తూ గ్లోబల్ వేవ్స్ సృష్టించే బ్రాండ్లను రూపొందించాలి: షా

సంప్రదాయం-సాంకేతికతల సమ్మేళనంతో భారత్ సరికొత్త కథలు రూపొందించాల్సిన సమయం ఆసన్నమైంది: షా

 Posted On: 02 MAY 2025 8:17PM |   Location: PIB Hyderabad

 ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరుగుతున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్ప్రారంభ ఎడిషన్ రెండో రోజైన శుక్రవారం జరిగిన ఇన్ కన్వర్జేషన్ సమావేశంలోప్రముఖ ప్రపంచస్థాయి వ్యాపారవేత్తబయోకాన్ సంస్థ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా పాల్గొన్నారుఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూసృజనాత్మక కంటెంట్ రంగంలో ప్రమేయం గల భారత అంకురసంస్థలు సినిమాలకు అతీతంగా ఆలోచించి గ్లోబల్ వేవ్స్ సృష్టించే బ్రాండ్లనువ్యవస్థలను అలాగే మేధో సంపత్తిని నిర్మించాలని సూచించారు.

"భారత ఆవిష్కరణల పునరుజ్జీవనం్రపంచస్థాయి అంకుర సంస్థలు... తదుపరి దశాబ్దంఅనే అంశంపై ఫోర్బ్స్‌ ఎడిటర్-ఎట్-లార్జ్ మనీత్ అహుజాతో చర్చలో పాల్గొన్న జుందార్ షాకథలు చెప్పడంలో భారతీయుల ప్రపంచస్థాయి సామర్థ్యం గురించి మాట్లాడారురామాయణం గురించి ప్రస్తావిస్తూ, "భారత్ సంప్రదాయంసాంకేతికతను మిళితం చేస్తూ కొత్త కథలను రూపొందించాల్సిన సమయం ఆసన్నమైందన్నారుస్టార్ వార్స్ కోసం జార్జ్ లూకాస్ భారతీయ ఇతిహాసాల నుంచి ప్రేరణ పొందినట్లేమన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచ ఫ్రాంచైజీలుగా మార్చడానికి మనం సాంకేతికతను ఉపయోగించవచ్చుఅని అన్నారు.

భారత జనాభాడిజిటల్ బలాలను ప్రస్తావిస్తూ ఆమె ఇలా అన్నారు... "ఒక బిలియన్‌కు పైగా స్మార్ట్‌ఫోన్‌లుసాంకేతిక పరిజ్ఞానం గల జనరేషన్ జెడ్‌తోభారత్ ప్రపంచస్థాయి ఆవిష్కరణలకు సిద్ధంగా ఉందికానీ ఏ బ్లాక్‌బస్టర్ విషయంలోనైనాఒక ఆలోచనవ్యూహంఅలాగే అవిశ్రాంతంగా దృష్టిసారించడం ద్వారా లభించే విజయం మొదట చిన్నగానే ప్రారంభమవుతుంది." అని తెలిపిన ఆమెబయోకాన్‌ను ఒక గ్యారేజీలో ప్రారంభించిదానిని ప్రపంచ బయోటెక్ శక్తిగా అభివృద్ధి చేసిన తన సొంత ప్రయాణాన్ని ఉటంకించారు.

భారత సృజనాధారిత ఆర్థిక వ్యవస్థ గురించి ఆమె మాట్లాడుతూ... ఈ రంగంలో ఉన్నవారు అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్న సృజనాధారిత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. "మీడియా-వినోద రంగం నేడు జీడీపీకి 20 బిలియన్ డాలర్లను సమకూరుస్తోందిమనం మొదట 100 బిలియన్ డాలర్లను లక్ష్యంగా చేసుకోవాలి. అలాగే 2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆరెంజ్ ఎకానమీ లక్ష్యంగా కృషి చేయాలి. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను ప్రతిధ్వనిస్తుందిఅని షా పేర్కొన్నారు.

సృజనకారులుఅంకురసంస్థలకు సాధికారత కల్పించడం

భారత సృజనాత్మక రంగానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ఏఆర్వీఆర్,  లీనమయ్యే అనుభవాల కలయికను కీలక సరిహద్దులుగా ఆమె అభివర్ణించారు. "తదుపరి యునికార్న్స్ కేవలం యాప్‌లనే కాకుండా ఐపీటెక్లీనమయ్యేలా కథలు చెప్పడం వంటి వాటిని అర్థం చేసుకునే సృజనకారులుగా ఉంటారుఅని ఆమె పేర్కొన్నారుఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటను ఉటంకిస్తూభారత సృజనాత్మక రంగం ఆకర్షణను మించి ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు. "ఇది ప్రపంచవ్యాప్త ఔచిత్యం కలిగి ఉండాలిఅని ఆమె సూచించారు.

"ప్రతి గొప్ప ఆలోచన చిన్నగానే మొదలవుతుందిఅయితే దానిని మీరు ఎంత దూరం తీసుకువెళతారనేది కీలకం అవుతుందివైఫల్యం ప్రయాణంలో ఒక భాగం మాత్రమేఅని పేర్కొన్న ఆమె వాస్తవితకతనునిలకడను కొనసాగించాలని అంకుర సంస్థలను కోరారు.

 

* * *


Release ID: (Release ID: 2126583)   |   Visitor Counter: 3