WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ప్రపంచ కంటెంట్ కేంద్రంగా నిలిచేందుకు భారత్‌కు ఇది అద్భుతమైన సమయం: శ్రద్ధా కపూర్

కంటెంట్ క్రియేషన్‌లో భారత్ అపూర్వంగా దూసుకెళ్తోంది: ఆడమ్ మోసెరీ, ఇన్‌స్టాగ్రామ్ హెడ్

ధోరణులు, త్వరిత సమాచార వ్యాప్తి గురించి నిర్మాణాత్మకంగా చర్చిస్తున్న వేవ్స్ 2025

 Posted On: 02 MAY 2025 5:43PM |   Location: PIB Hyderabad

"నేడు, స్మార్ట్‌ఫోన్ ఉన్న ఎవరైనా కంటెంట్ క్రియేటర్, నిర్మాత కావచ్చు" అని ప్రముఖ నటి శ్రద్ధా కపూర్ అన్నారు, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కంటెంట్ ప్రజాస్వామ్యీకరణను ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. సోషల్ మీడియాలో ప్రామాణిక కంటెంట్‌తో క్రియాశీలంగా ఉంటూ ప్రఖ్యాతి గాంచిన శ్రద్ధా, కథ చెప్పడంలో బారతదేశ సుదీర్ఘ వారసత్వాన్ని స్పష్టం చేశారు. "మేం కథలు వింటూ పెరిగాం - అవి మా జీవితాల్లో భాగమయ్యాయి" అని ఆమె వ్యాఖ్యానించారు.

 

 

 

ప్రస్తుత సమయాన్ని భారతీయ కంటెంట్ క్రియేటర్స్ కోసం స్వర్ణయుగంగా ఆమె అభివర్ణించారు: "ప్రపంచ కంటెంట్ కేంద్రంగా మారడానికి భారత్ కోసం ఇది అద్భుతమైన సమయం" అని ఆమె పేర్కొన్నారు, డిజిటల్ సాంకేతికత, సరసమైన డేటా, ఉత్సాహభరితమైన యువజనాభాల కలయికతో ఇది సాధ్యమవుతోందన్నారు. సోషల్ మీడియాలో తన విజయగాథను వివరిస్తూ, కంటెంట్‌లో ప్రామాణికత శక్తిని శ్రద్ధా ప్రధానంగా ప్రస్తావించారు. "కంటెంట్ హృదయం నుంచి వచ్చినప్పుడు, అది సహజంగానే ప్రజలతో కనెక్ట్ అవుతుంది. నేను ఎల్లప్పుడూ వ్యూహాత్మకంగా కాకుండా ప్రామాణికమైన కంటెంట్‌ను పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను" అని ఆమె స్పష్టం చేశారు.

 

 

 

భారత్‌లో పెరుగుతున్న మీమ్ సంస్కృతి ప్రభావాన్ని, ట్రెండింగ్ ఆడియోలు.. హ్యాష్‌ట్యాగ్‌లతో ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు జెన్ జెడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విధానాన్ని శ్రద్ధా వివరించారు. "ప్రతి తరం తనదైన స్వరాన్ని కనుగొంటున్న క్రమంలో, ట్రెండ్‌లు ఇంత త్వరగా ఏర్పడటం, వేగంగా వ్యాప్తి చెందుటను చూడటం చాలా అద్భుతంగా ఉంది" అని ఆమె వ్యాఖ్యానించారు.

 

 

 

మెటా ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోసేరి, భారత్‌లో డిజిటల్ కంటెంట్ క్రియేషన్‌లో వేగవంతమైన పరివర్తన గురించి తన అభిప్రాయాన్ని పంచుకుంటూ ప్రపంచ దృక్పథాన్ని వివరించారు. తగ్గుతున్న డేటా వ్యయం, హై-స్పీడ్ ఇంటర్నెట్ విస్తృతంగా అందుబాటులోకి రావడం కంటెంట్ క్రియేటర్స్ కోసం సరికొత్త అవకాశాలను కల్పించాయన్న ఆయన డిజిటల్ మౌలిక సదుపాయాల విప్లవాన్ని ప్రస్తావించారు. డిజిటల్ ప్రపంచంతో భారతీయులు నిమగ్నమయ్యే విధానంలో సాంకేతికత కీలక పాత్రను అంగీకరిస్తూ "కంటెంట్ క్రియేషన్‌లో భారత్ అపూర్వంగా దూసుకెళ్తోంది" అని మోసేరీ పేర్కొన్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాన వ్యక్తీకరణ విధానంగా మారిన రీల్స్ వంటి విజువల్ కంటెంట్ వృద్ధిని కూడా ఆయన ప్రస్తావించారు. "విజువల్ కంటెంట్ సహజంగానే మరింత ఆకర్షణీయంగా, ప్రభావవంతంగా ఉంటుంది. కథలను క్లుప్తంగా, ప్రభావవంతంగా చెప్పగల శక్తిని రీల్స్ అందించాయి, ప్రపంచ ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యేందుకు సృజనాత్మక వేదికను ఇవి అందిస్తున్నాయి" అని మోసేరీ వ్యాఖ్యానించారు.

 

 

 

"సృజనాత్మక వ్యక్తీకరణకు వీలు కల్పించడం: జెన్ జెడ్ కంటెంట్‌ను ఎలా వినియోగిస్తుంది" అనే అంశంపై జరిగిన సంభాషణల సమావేశం కేవలం సంభాషణలకే పరిమితం కాలేదు. ఇది భారత అపరిమితమైన సృజనాత్మక సామర్థ్యాన్ని, తరువాతి తరం డిజిటల్ కథకులను శక్తివంతం చేయడంలో సాంకేతికత పోషించే పరివర్తనాత్మక పాత్రను సెలబ్రేట్ చేసింది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు కంటెంట్ క్రియేషన్‌ ప్రజాస్వామ్యీకరణను కొనసాగిస్తున్న క్రమంలో, సంస్కృతి, సాంకేతికత, సృజనాత్మకతల సమ్మేళనం జెన్ జెడ్ కోసం కంటెంట్ వినియోగ భవిష్యత్తును ఎలా రూపొందిస్తుందో ఈ సమావేశం వివరించింది.

 

* * *


Release ID: (Release ID: 2126366)   |   Visitor Counter: 18