ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2025 ఏప్రిల్ 20 నుంచి 30 వరకు అమెరికా, పెరూలో అధికారిక పర్యటనకు వెళుతున్న

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్

ఐఎంఎఫ్-వరల్డ్ బ్యాంక్ స్ప్రింగ్ సమావేశాలలో పాల్గొననున్న కేంద్ర ఆర్థికమంత్రి

పలు దేశాలు, సంస్థలతో ద్వైపాక్షిక సమావేశాలతో పాటు జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఎఫ్ ఎంసీబీజీ) సమావేశాల్లో కూడా పాల్గొననున్న ఆర్థికమంత్రి

వివిధ వేదికలలో బహుపాక్షిక చర్చల్లో పాల్గొని, భారత ఆర్థిక ప్రగతిని చాటనున్న శ్రీమతి సీతారామన్

Posted On: 19 APR 2025 5:11PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థికకార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ 2025 ఏప్రిల్ 20 నుంచి అమెరికాపెరూలో అధికారిక పర్యటన ప్రారంభించనున్నారుఅమెరికా పర్యటనలో భాగంగా 20 నుంచి 25 వరకు శాన్ ఫ్రాన్సిస్కోవాషింగ్టన్ డీసీ లను సందర్శిస్తారు

ఏప్రిల్ 20 నుంచి శాన్ ఫ్రాన్సిస్కోలో రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి అక్కడి స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలోని హూవర్ ఇనిస్టిట్యూషన్ లో 'వికసిత భారత్ 2047కు పునాదులు వేయడంఅనే అంశంపై ప్రధానోపన్యాసం చేస్తారుఅనంతరం ఒక ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు

ఇన్వెస్టర్లతో రౌండ్‌టేబుల్ సమావేశంలో  ప్రముఖ ఫండ్ మేనేజ్‌మెంట్ సంస్థల ప్రధాన సీఈఓలతో సంభాషించడంతో పాటులో ఉన్న ప్రముఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీసంస్థల సీఈఓలతో శ్రీమతి సీతారామన్ ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించనున్నారుశాన్ ఫ్రాన్సిస్కోలో ప్రవాస భారతీయులతో ఏర్పాటయ్యే కార్యక్రమంలో శ్రీమతి సీతారామన్ పాల్గొంటారుఅక్కడ స్థిరపడిన భారతీయులతో సంభాషిస్తారు.

ఏప్రిల్ 22 నుంచి 25 వరకు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో పర్యటించనున్న నిర్మలా సీతారామన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు స్ప్రింగ్ మీటింగ్స్రెండో జీ20 ఆర్థిక మంత్రులుసెంట్రల్ బ్యాంక్ గవర్నర్ (ఎఫ్ఎంసీబీజీసమావేశాలుడెవలప్మెంట్ కమిటీ ప్లీనరీఐఎంఎఫ్సీ ప్లీనరీగ్లోబల్ సావరిన్ డెట్ రౌండ్ టేబుల్ (జీఎస్డీఆర్సమావేశాల్లో పాల్గొంటారు.

వాషింగ్టన్ డి.సి.లో జరిగే స్ప్రింగ్ సమావేశాల సందర్భంగా శ్రీమతి సీతారామన్ -  అర్జెంటీనాబహ్రెయిన్జర్మనీఫ్రాన్స్లక్సెంబర్గ్సౌదీ అరేబియాబ్రిటన్అమెరికా సహా అనేక దేశాలకు చెందిన తన సహచరులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారుఈయూ కమిషనర్ ఫర్ ఫైనాన్షియల్ సర్వీసెస్,  ప్రెసిడెంట్ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ),  ఆసియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ (ఏఐఐబీఅధ్యక్షుడుఫైనాన్స్ హెల్త్ కు సంబంధించి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రత్యేక న్యాయవాది (యూఎన్ఎస్జీఎస్ఏ),  అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్లను శ్రీమతి సీతారామన్ కలుసుకుంటారు

ఏప్రిల్ 26 నుంచి  30 వరకు పెరూలో తన మొదటి పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి తన మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు,  వాణిజ్య ప్రతినిధులతో కూడిన భారతీయ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తారురెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక,  వాణిజ్య సంబంధాలను బలోపేతం లక్ష్యంగా చర్చలు నిర్వహిస్తారు

లిమాలో పర్యటనను ప్రారంభించనున్న శ్రీమతి సీతారామన్ పెరూ అధ్యక్షురాలు శ్రీమతి దినా బోలువార్టేపెరూ ప్రధాన మంత్రి శ్రీ గుస్టావో అడ్రియన్జెన్ లతో భేటీ అవుతారుఅలాగే పెరూ ఆర్థికఎకానమీరక్షణఇంధనంగనుల శాఖల మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారుస్థానిక ప్రజాప్రతినిధులను కూడా కలుసుకుంటారు

పెరూ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి భారత్పెరూ దేశాలకు చెందిన ప్రముఖ వాణిజ్య ప్రతినిధులు పాల్గొనే ఇండియా-పెరూ బిజినెస్ ఫోరం సమావేశానికి అధ్యక్షత వహిస్తారుప్రస్తుతం పెరూలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ పెట్టుబడిదారులువ్యాపార ప్రతినిధులతో పాటుపెరూ‌ను సందర్శిస్తున్న భారతీయ వాణిజ్య ప్రతినిధి బృందంతో కూడా శ్రీమతి నిర్మలా సీతారామన్ సమావేశమవుతారు.

 

***


(Release ID: 2122989) Visitor Counter : 135