ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డెన్మార్క్ ప్రధాన మంత్రి మెట్టె ఫ్రెడరిక్సేన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రపంచ పరిణామాలపై చర్చించిన ఇరువురు నేతలు

త్వరలో జరగనున్న భారత్-నార్డిక్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా నార్వేలో సమావేశం కానున్న ఇరువురు నేతలు..

ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటన

Posted On: 15 APR 2025 6:02PM by PIB Hyderabad

డెన్మార్క్ ప్రధాన మంత్రి గౌరవ మెట్టె ఫ్రెడరిక్ సన్‌తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఫోన్‌లో మాట్లాడారుద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రపంచ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు.

2020లో వ్యూహాత్మక హరిత భాగస్వామ్యం (గ్రీన్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్ప్రారంభించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయిలో జరిగిన చర్చలను గుర్తు చేసుకున్న నాయకులు వివిధ రంగాలలో ఈ భాగస్వామ్యాన్ని విస్తరించటం గురించి ప్రస్తావించారుఇది భారతదేశంలో హరిత పరివర్తనకు ఉపయోగపడే విధంగా డెన్మార్క్ ‌పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులను సృష్టించిందని అన్నారుపరస్పర ప్రయోజనాలున్న ప్రాంతీయఅంతర్జాతీయ అంశాలపై నేతలు చర్చించారు.

ఈ ఏడాది చివర్లో నార్వేలో జరగనున్న 3వ భారత్నార్డిక్ శిఖరాగ్ర సదస్సుఇందులో భాగంగా ప్రధాని ఫ్రెడెరిక్సేన్‌తో భేటీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు


(Release ID: 2121992)