ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ హరీష్‌ భాయ్ నాయక్ మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం

నాడు పోస్టు చేయడమైనది: 12 APR 2025 2:29PM by PIB Hyderabad

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సీనియర్ ప్రచారక్ శ్రీ హరీష్‌ భాయ్ నాయక్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సంతాపం వ్యక్తం చేశారుసేవా కార్యకలాపాలుసంస్థాగత పనుల కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయం అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ఎక్స్’ వేదికగా ఒక పోస్టులో ఆయన ఇలా రాశారు:

"రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సీనియర్ ప్రచారకర్త శ్రీ హరీష్‌భాయ్ నాయక్ మరణం బాధాకరంసేవా కార్యకలాపాలుసంస్థాగత పనుల కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయం.

ఆయన తన జీవితాన్ని దేశానికే అంకితం చేయడం.. మరణానంతరం సైతం ఆయన కోరిక ప్రకారం ఆయన శరీరాన్ని భవిష్యత్ తరాల వైద్య విద్య కోసం దానం చేయడం స్ఫూర్తిదాయకం.

మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ... ఓం శాంతి...!!”


(రిలీజ్ ఐడి: 2121322) సందర్శకుల సూచీ సంఖ్య : : 69