ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీలంకలోని తమిళ సామాజిక నేతలతో ప్రధాని భేటీ

प्रविष्टि तिथि: 05 APR 2025 9:49PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు కొలంబోలో శ్రీలంకలోని తమిళ సామాజిక నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమిళ నాయకులు ఆర్.సంపంతన్, మావై సేనతిరాజా మృతి పట్ల ప్రధాని సంతాపం తెలిపారు.

 

“శ్రీలంకలోని తమిళ సామాజిక నాయకులను కలవడం నాకు ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. నాకు వ్యక్తిగతంగా పరిచయమున్న గౌరవ తమిళ నాయకులు శ్రీ ఆర్.సంపంతన్, శ్రీ మావై సేనతిరాజాల మరణం పట్ల నా ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేశాను. సమైక్య శ్రీలంకలోని తమిళ సమాజానికి సమానత్వం, గౌరవం, న్యాయంతో కూడిన జీవితానికి భారత్ అచంచలమైన నిబద్ధతను కలిగివుందని పునరుద్ఘాటించాను. ఈ పర్యటన సందర్భంగా నేను ప్రారంభించిన అనేక ప్రాజెక్టులు, కార్యక్రమాలు తమిళుల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పురోగతికి దోహదపడతాయని విశ్వసిస్తున్నాను” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో వేర్వేరు పోస్టుల్లో పేర్కొన్నారు. 

“இலங்கையில் உள்ள தமிழ் சமூகத்தினரது தலைவர்களை சந்திக்கின்றமை எப்பொழுதும் மகிழ்ச்சிக்குரிய ஒரு விடயமாகும்.  பெருமதிப்புக்குரிய தமிழ் தலைவர்களான திரு இரா. சம்பந்தன் மற்றும் திரு மாவை சேனாதிராஜா ஆகியோரது மறைவுக்கு இச்சந்தர்ப்பத்தில் அனுதாபம் தெரிவித்தேன், அவர்கள் இருவருமே தனிப்பட்ட ரீதியில் எனக்கு தெரிந்தவர்கள். அத்துடன், ஐக்கிய இலங்கைக்குள் தமிழ் சமூகத்திற்கு சமத்துவம், கௌரவம் மற்றும் நீதி ஆகியவற்றுடனான வாழ்க்கைக்கான எமது அசைக்கமுடியாத அர்ப்பணிப்பு இச்சந்திப்பின்போது மீண்டும் வலியுறுத்தப்பட்டது. எனது விஜயத்தின்போது ஆரம்பித்துவைக்கப்பட்ட பல திட்டங்களும் முன்னெடுப்புகளும் அவர்களது சமூக, பொருளாதார மற்றும் கலாசார முன்னேற்றத்துக்கான பங்களிப்பை வழங்கும்.”

 

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2119730) आगंतुक पटल : 32
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam