ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రపంచ జల దినోత్సవం నేపథ్యంలో జల సంరక్షణపై నిబద్ధతను పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి
Posted On:
22 MAR 2025 10:13AM by PIB Hyderabad
ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా జల సంరక్షణ కర్తవ్య నిర్వహణతోపాటు
సుస్థిర ప్రగతిని ప్రోత్సహించడంపై భారత్ నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ
నరేంద్ర మోదీ ఇవాళ పునరుద్ఘాటించారు. మానవ నాగరకతలో నీటికిగల కీలక
పాత్రను స్పష్టం చేస్తూ- భవిష్యత్తరాల కోసం ఈ అమూల్య వనరును
సంరక్షించడానికి సమష్టి కార్యాచరణ అవశ్యమని ఆయన పిలుపునిచ్చారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఈ రోజు ప్రపంచ జల దినోత్సవం నేపథ్యంలో జల సంరక్షణ, సుస్థిర ప్రగతికి
ప్రోత్సాహంపై మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. ప్రపంచ నాగరకతలన్నిటికీ
నీరు జీవనాడి.. కాబట్టి, భవిష్యత్తరాల కోసం ఈ అమూల్య వనరును సంరక్షించడం
అత్యంత అవశ్యం!” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
(Release ID: 2113957)
Visitor Counter : 30