వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశం గురించి ప్రపంచానికి చాటి చెప్పే డిజిటల్ రాయబారులే క్రియేటర్లు


రైజ్/డెల్ సమ్మేళనం-2025లో క్రియేటర్లను ఉద్దేశించి ప్రసంగించిన శ్రీ పీయూష్ గోయల్

Posted On: 13 MAR 2025 3:21PM by PIB Hyderabad

సంగీతాన్నిసృజనాత్మక పరిశ్రమలనుఅంకుర సంస్థలను ఒకే వేదిక పైకి తీసుకువచ్చేలా మూడు రోజుల పాటు నిర్వహించిన రైజ్/డెల్ సదస్సు - 2025ను ఉద్దేశించి ఈ రోజు న్యూఢిల్లీలో కేంద్ర వాణిజ్యపరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ప్రసంగించారుభారతీయ సృజనాత్మక రంగానికున్న సామర్థ్యాన్నిదేశ భవిష్యత్తును రూపొందించడంలో డిజిటల్ ఆవిష్కరణల పాత్ర గురించి శ్రీ గోయల్ ప్రసంగించారు.

దేశం గురించి ప్రపంచానికి తెలియజెప్పిఆర్థిక వృద్ధికి తోడ్పడాలని సృజనాత్మక పరిశ్రమకు శ్రీ గోయల్ సూచించారునమ్మకంప్రామాణికతకు ప్రాధాన్యమిచ్చి పని చేయడంఫలితం పట్ల బాధ్యతతోజవాబుదారీతనంతో వ్యవహరించాల్సిన అవసరం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారుఈ అమృత కాలంలో భారత్ అభివృద్ధికి సృజనాత్మక రంగం దోహదపడేలా నాలుగు ప్రధానాంశాలను ఆయన గుర్తించారుఅవి బాధ్యతాయుతమైన కంటెంట్కథ చెప్పే విధానంలో సృజనాత్మకతనైపుణ్యాభివృద్ధిభారతీయ సృజనాత్మకతను ఎగుమతి చేయడం.

 ‘‘మీరు కన్న కలలు కచ్చితంగా సాకారమవుతాయిమీరందరూ కలసి ఒకే వేదిక మీదకు చేరుకున్నప్పుడుభవిష్యత్తుకు అవసరమైన ముఖ్యమైన అంశాలను రూపొందించేందుకు వీలు కలుగుతుంది’’ అని ఆయన అన్నారుక్రియేటర్లను డిజిటల్ అంబాసిడర్లుగా వర్ణించిన ఆయన భారత్‌పై ప్రపంచానికున్న ఆలోచనలను మార్చడంలోమన సాంస్కృతిక విధానాలను విస్తరించడంలో వారు పోషిస్తున్న పాత్ర గురించి వివరించారు.

దశాబ్దం క్రితం దేశంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం కంటెంట్ క్రియేటర్లుఅంకుర సంస్థలుఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో కూడిన నూతన ప్రపంచాన్ని తయారు చేయడమే లక్ష్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ఎలా ప్రారంభించినదీ వివరించారుతక్కువ ధరకే డేటాని అందుబాటులో ఉంచడం ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న డిజిటల్ ఇండియా విధానంలో అత్యంత కీలకమైన అంశమని అన్నారుఇదే డేటా వినియోగంలో భారత్‌ను ప్రపంచంలో అతి పెద్ద వినియోగదారుగా మార్చిందని తెలిపారు. ‘‘ఐరోపాఅమెరికా లేదా ఏ ఇతర అభివృద్ధి చెందిన దేశంతోనైనా పోలిస్తే మన దేశంలో డేటా ధరలు చాలా తక్కువే ఉన్నాయిచౌకగా లభిస్తున్న డేటాను దేశంలో ఉన్న ఉత్తమ ప్రతిభతో అనుసంధానిచినప్పుడుస‌ృజనాత్మకతసాంకేతిక రంగంలో మనకోసం ఒక విప్లవం ఎదురుచూస్తూ ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

భారతీయ సృజనాత్మక రంగంలో ఉన్న విస్తృత అవకాశాల గురించి శ్రీ గోయల్ వివరించారుసంప్రదాయ రంగాలైన చలనచిత్రంనాటకంథియేటర్లకు మించి గేమింగ్ఏఐ ఆధారిత కంటెంట్ రూపకల్పనడిజిటల్ మీడియాలో అవకాశాలు ఉన్నాయని అన్నారుఇప్పటికే బిలియన్ డాలర్ల విలువకు చేరుకున్న ఈ పరిశ్రమదేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉపాధి కల్పిస్తోందని తెలిపారు. ‘‘ఒకప్పుడు స‌‌ృజనాత్మక రంగం అంటే చలన చిత్ర నిర్మాణండ్రామాథియేటర్ ఇప్పుడు ఇవి భవిష్యత్ సాంకేతికతలైన గేమింగ్ఏఐ ఉపయోగించుకొని కొత్త తరహా వినోదాన్ని అందిస్తున్నాయి’’ అని అన్నారు.

భవిష్యత్తులో సాధించాల్సిన అభివృద్ధికి తగిన ప్రణాళికను రూపొందించడంలో ఈ తరహా కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని రైజ్/డెల్‌లో పాల్గొన్న వారిని శ్రీ గోయల్ ప్రోత్సహించారుకొత్త సాంకేతికతలను ప్రజలకు పరిచయం చేయడంలోఇన్లుయెన్సర్ల పాత్రను గుర్తించిన ఆయనసుసంపన్నమైన భారతీయ చరిత్రసంస్కృతిసంప్రదాయాల గురించి తెలుసుకొనేలా ప్రజలకు వారు సహాయపడుతున్నారని అభిప్రాయపడ్డారువిద్యకు సంబంధించిన అనుబంధ కార్యక్రమాలను అభివృద్ధి చేయవచ్చనిఇది కంటెంట్ క్రియేటర్లకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. ‘సామాన్యులతో అనుసంధానమయ్యే విషయంలో క్రియేటర్ల ప్రతిభ చాలా ప్రత్యేకమైనది ఇది అవకాశాల ప్రపంచానికి మార్గం చూపిస్తుంది’’ అని అన్నారు.

తమ సొంత ఆలోచనలనుసాంకేతికతను అభివృద్ధి చేయడంలో వ్యక్తులకు సాయమందించేలా ప్రభుత్వం పోషిస్తున్న పాత్రను శ్రీ గోయల్ వివరించారుస‌ృజనాత్మకతఆడియో-విజువల్ ఆర్ట్స్కంటెంట్ రూపకల్పనలో అంతర్జాతీయ సమాజంలో విస్తరిస్తున్న దేశ ప్రభావాన్ని ప్రముఖంగా ప్రస్తావించారుప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులను భారత్‌తో సహకారానికి ఆహ్వానించారు. ‘‘ప్రపంచంతో ఎంత బాగా మనం మమేకమైతే.. భారతీయ క్రియేటర్లకు అంత ఎక్కువ అవకాశాలు వస్తాయిమన కళాకారులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తోందిటెక్నాలజీ ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి ఇంటికీ మనం చేరుకోగలం’’ అని తెలిపారు.

పర్యాటకాన్ని పెంపొందించడంలో సృజనాత్మకంగా రూపొందించిన విశేషాల సామర్థ్యాన్ని వివరిస్తూ.. మహాకుంభ్‌ను ఉదాహరణగా పేర్కొన్నారుడిజిటల్ కథనాలు ప్రపంచ ప్రేక్షకులను ఎలా ఆకర్షించగలవో మహాకుంభ్ తెలియజేసిందని అన్నారు. ‘‘దేశానికి సంబంధించిన విశేషాలను ప్రపంచానికి తెలియజేస్తున్నపుడుఅవి పర్యాటకుల్లో ఉత్సుకతను రేకెత్తించిఇక్కడికి వారిని ఆకర్షిస్తాయిఅంతేకాకుండాఆర్థిక వ్యవస్థకు ఎంతో సహకారం అందిస్తాయి’’ అని అన్నారుపర్యాటకులకు ఉత్తేజకరమైనఆనందదాయకమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు.

ప్రపంచానికి కంటెంట్ రాజధానిగా మారాలనే దేశ లక్ష్యాన్ని పునరుద్ఘాటిస్తూ శ్రీ గోయల్ తన ప్రసంగాన్ని ముగించారుబాధ్యతాయుతమైనవినూత్నమైన కంటెంట్‌పై దృష్టి సారించాలని క్రియేటర్లకు పిలుపునిచ్చారుదేశ ఎగుమతుల ఆదాయాన్ని పెంచడంలో నైపుణ్యాలుకథనంచిత్ర దర్శకత్వంసంగీత స్వర కల్పనగేమింగ్డిజిటల్ మీడియా పోషిస్తున్న పాత్ర గురించి వివరించారు. ‘‘కంటెంట్ క్రియేటర్ పరిశ్రమకు భవిష్యత్తు ఈ రైజ్అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడంలో ఈ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందిమీ కథలను ప్రపంచానికి చెప్పండిఆత్మవిశ్వాసంతో మీ అంకుర సంస్థలను ప్రారంభించండిభవిష్యత్తు తరాల కోసం వారధిని నిర్మించండిప్రభుత్వంక్రియేటర్లు కలసి ప్రపంచానికి భారత్ గురించి చాటి చెబుదాం’’ అని అన్నారు.

***


(Release ID: 2111328) Visitor Counter : 14