ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గంగా తలావ్ ను సందర్శించిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 12 MAR 2025 5:26PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మారిషస్ లోని పవిత్ర గంగా తలావ్ ను నేడు సందర్శించారు. ఆ పవిత్ర స్థలంలో పూజలు చేసిన ఆయన, త్రివేణి సంగమం నుంచి తెచ్చిన పవిత్ర జలాన్ని అక్కడ కలిపారు.

మహా కుంభమేళా నుంచి గంగా తలావ్ కు పవిత్ర జలాన్ని ప్రధానమంత్రి తీసుకురావడం రెండు దేశాల మధ్య ఆధ్యాత్మిక ఐక్యతకు మాత్రమే కాదు, సుసంపన్నమైన సంప్రదాయాలను పరిరక్షించి, ముందుకు తీసుకెళ్లడంలో వారి అంకిత భావానికి కూడా సంకేతం. ఆ సంప్రదాయాలే ఉమ్మడి సాంస్కృతిక సంబంధాలకు మూలం.  


(రిలీజ్ ఐడి: 2111146) సందర్శకుల సూచీ సంఖ్య : : 63