మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హైదరాబాద్‌లో మార్చి 8న ‘ఫిషరీస్ స్టార్టప్ కాన్‌క్లేవ్ 2.0

కార్యక్రమానికి హాజరు కానున్న కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్,

సహాయ మంత్రులు ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్ బఘేల్, శ్రీ జార్జ్ కురియన్


నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్‌ఫాం మొబైల్ యాప్‌తోపాటు ‘ఫిషరీస్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ 2.0’ ఆవిష్కరణ

Posted On: 07 MAR 2025 2:46PM by PIB Hyderabad

మత్స్యపశుసంవర్ధకంపాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పని చేస్తున్న మత్స్య విభాగం మార్చి 8న తెలంగాణలోని హైదరాబాద్‌లో ఫిషరీస్ స్టార్టప్ కాన్‌క్లేవ్ 2.0ను నిర్వహించనుందిఈ కార్యక్రమంలో  కేంద్ర మత్స్యపశుసంవర్ధకంపాడి శాఖ మంత్రిపంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్‌సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్ బఘేల్పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ జార్జ్ కురియన్ పాల్గొంటారుఇంకా ప్రభుత్వ అధికారులుమత్స్య పరిశ్రమ రంగంలోని అంకుర సంస్థలుఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

మత్స్య రంగంలో నవకల్పనను గురించి చర్చించినూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఈ విషయాలపై ఆసక్తి ఉన్న వర్గాల వారందరినీ స్టార్టప్ కాన్‌క్లేవ్ 2.0 ఒక చోటుకు తీసుకురానుందిఈ సందర్భంగా చేపలురొయ్యల పెంపకం రంగంలో అంకుర సంస్థలకు-కామర్స్ అవకాశాలపైన కూడా చర్చలు నిర్వహిస్తారు. చేపలు పట్టే వృత్తికి సంబంధించిన సేవలువనరులను డిజిటల్ మాధ్యమం ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చి సువ్యవస్థీకృతం చేసే ప్రధానోద్దేశంతో రూపొందించిన నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్‌ఫాం (ఎన్ఎఫ్‌డీపీమొబైల్ యాప్‌ను ఈ కాన్‌క్లేవ్‌లో ఆవిష్కరించనున్నారుఅలాగే ‘ఫిషరీస్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ 2.0’ను కూడా ప్రకటించనున్నారుమత్స్య రంగంలో సాంకేతిక మార్పులనుఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ నిబద్ధతను ఈ కార్యక్రమం బలోపేతం చేస్తుంది.

దీనికి అదనంగామత్స్య రంగంలో అంకుర సంస్థలకు ఔత్సాహిక పారిశ్రామికవేత్త నమూనా అనుమతుల ప్రక్రియను వివరించడం వల్ల ఈ రంగంలో ఆసక్తి ఉన్న నూతన వాణిజ్య సంస్థలను గుర్తించడంతోపాటు వాటికి అవసరమైన మద్దతును అందించడానికి మార్గాన్ని సుగమం చేయనున్నారుఇది మత్స్య రంగంలో అంకుర సంస్థల అనుబంధ విస్తారిత వ్యవస్థ (కోసిస్టమ్)ను ఇప్పటికన్నా మరింతగా పటిష్టపరుస్తుందిటెక్నికల్ ఫీడ్‌బ్యాక్, పరస్పరానుబంధ కార్యక్రమం భారత్‌లో మత్స్య రంగ కోసిస్టమ్‌కు సంబంధించిన లోతైన చర్చలకుఅలాగే జాతీయ మత్స్య పరిశ్రమాభివృద్ధి మండలి (ఎన్ఎఫ్‌డీబీ), భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) చేపట్టిన ముఖ్య కార్యక్రమాలపైన కూడా సమగ్ర చర్చలకు ఒక వేదికను అందించనుందిఅంతేకాకుండా మత్స్య పరిశ్రమలో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంకుర సంస్థలు సైతం వాటి అనుభవాన్ని ఈ కాన్‌క్లేవ్‌లో పంచుకోనున్నాయి.

నేపథ్యం

భారతదేశంలో చేపలురొయ్యల పెంపకం రంగం కోట్ల మందికి జీవనోపాధిని కల్పిస్తోందిఈ రంగానికి సంబంధించిన అనుబంధ కార్యకలాపాల్లోనూ ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. 2015 మొదలుప్రభుత్వం నీలి విప్లవ పథకంఎఫ్ఐడీఎఫ్ (చేపలురొయ్యల పెంపకానికి సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి), ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై), ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి స యోజన (పీఎం-ఎంకేఎస్‌ఎస్‌వైతదితర కార్యక్రమాల అమలు ద్వారా సుస్థిర వృద్ధి సాధన కోసం రూ. 38,572 కోట్లను సమకూర్చింది.

భారత చేపలురొయ్యల పెంపకం రంగం శరవేగంగా వృద్ధి చెందుతూ ఈ క్రమంలో మత్స్య పరిశ్రమకు సంబంధించిన 300కన్నా ఎక్కువ అంకుర సంస్థల ఏర్పాటుకు మార్గాన్ని సుగమం చేసిందిదీంతో ఈ రంగంలో సామర్థ్యంనైపుణ్యంనవకల్పన జోరందుకుంటున్నాయిఈ అంకుర సంస్థలు బ్లాక్‌చైన్ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), కృత్రిమ మేధ (ఏఐవంటి ఆధునిక సాంకేతికతల శక్తియుక్తులను వినియోగించుకొంటూ వాణిజ్య సరళిలో లాభసాటి కాగల పరిష్కారాలను కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నాయివీటి ద్వారా మౌలిక సవాళ్లను పరిష్కరించడంఉత్పాదకతను పెంచడంవినియోగ దశలకు మెరుగులు దిద్దాలని ఈ సంస్థలు నడుం బిగించాయినవకల్పననూమత్స్య పరిశ్రమలోని అంకుర సంస్థలకు అండదండలను అందించడానికీ మత్స్య విభాగం అనేక కార్యక్రమాలను మొదలుపెట్టిందిఆసక్తిదారు సంస్థలు జ్ఞానాన్ని పరస్పరం ఇచ్చి పుచ్చుకొనేందుకూఒక సంస్థతో మరొక సంస్థ సహకరించుకొనేందుకూ మత్స్య మంథన్ కార్యక్రమాలు ఒక వేదికగా ఉపయోగపడుతున్నాయిసరికొత్త ధోరణులనుఉత్తమ విధానాలను గురించి తెలుసుకోవడానికి వీలుగా చర్చలకు ఈ కార్యక్రమాలు అవకాశం కల్పిస్తున్నాయిమత్స్య పరిశ్రమలో అంకుర సంస్థల అనుబంధ విస్తారిత వ్యవస్థను పటిష్టపరచడానికిఈ విభాగం ప్రత్యేక ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసిందిప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై)లో మొదటి లైనాక్-ఎన్‌సీడీసీ ఫిషరీస్ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ (ఎల్ఐఎఫ్ఐసీ)ని 2021లో గురుగ్రామ్‌లో  ప్రారంభించారురూ.9 కోట్ల మొత్తం వ్యయంతో చేపలురొయ్యల పెంపకానికి ఉద్దేశించిన ఒక బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటరును అసోంలో గౌహతి బయోటెక్ పార్కులో ఏర్పాటు చేశారుకనీసం 100 మత్స్య రంగ అంకుర సంస్థలుసహకార సంఘాలుఎఫ్‌పీఓలుఎస్‌హెచ్‌జీలకు సాయం చేయడానికి మరో ప్రతిష్ఠాత్మక సంస్థలు.. మేనేజ్ హైదరాబాద్ఐసీఏఆర్-సీఐఎఫ్ఈ ముంబయిఐసీఏఆర్-సీఐఎఫ్‌టీ కోచి..లను ఇంక్యుబేషన్ సెంటర్లుగా  మత్స్య విభాగం నోటిఫై చేసిందిమత్స్య పరిశ్రమలో అంకుర సంస్థలకు సంబంధించిన అనుబంధ విస్తారిత వ్యవస్థను బలపరచడానికి ఈ విభాగం ఆసక్తిదారుసంస్థలతో క్రమం తప్పక సంప్రదింపుల కోసం అవకాశాన్ని అందిస్తోంది. సవాళ్లను పరిష్కరిస్తూఆర్థిక సహాయాన్ని అందిస్తూఈ రంగంలో వృద్ధికి చోదకశక్తిగా నిలచే సానుకూల విధాన నిర్ణయాలకు రూపకల్పన కూడా చేస్తోంది.

 

***


(Release ID: 2109150) Visitor Counter : 23