ప్రధాన మంత్రి కార్యాలయం
శారీరక దారుఢ్య ప్రాధాన్యతను చెబుతూ ఊబకాయం నివారణకు నీరజ్ చోప్రా చేస్తున్న కృషికి ప్రధానమంత్రి అభినందన
Posted On:
12 FEB 2025 12:41PM by PIB Hyderabad
శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకునేందుకూ, ఉబకాయం నివారణకూ ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా చేస్తున్న కృషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఊబకాయాన్ని ఎదుర్కోవడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించడం అత్యావశ్యకమని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ఫిట్ ఇండియా కోసం సమష్టి కృషి ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా రాసిన వ్యాసంపై స్పందిస్తూ.. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“నీరజ్ చోప్రా రాసిన ఆలోచనాత్మకమైన, స్ఫూర్తిదాయకమైన వ్యాసమిది. ఊబకాయంతో పోరాడి ఆరోగ్యంగా ఉండాల్సిన ఆవశ్యకతను ఇది పునరుద్ఘాటిస్తుంది. @Neeraj_chopra1”
(Release ID: 2106330)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam