సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎలక్ట్రానిక్ మీడియా (టీవి) విభాగంలో ఓటరు అవగాహనకు ఇసిఐ మీడియా పురస్కారం దూరదర్శన్‌కు గర్వకారణం


"చునావ్ కా పర్వ్ దేశ్ కా గర్వ్" సిరీస్‌ సహా 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో సమాచారాత్మక, బాధ్యతాయుతమైన ఓటింగ్‌ను ప్రోత్సహిస్తూ అందించిన ప్రభావవంతమైన కవరేజీకి తగిన గుర్తింపు

నాడు పోస్టు చేయడమైనది: 25 JAN 2025 7:47PM by PIB Hyderabad

ఓటరు అవగాహనఎడ్యుకేషన్ గురించి సంపూర్ణసమగ్ర ప్రచారానికిగానూ ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో ప్రతిష్టాత్మక పురస్కారాన్ని దూరదర్శన్ సగర్వంగా అందుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సమాచారాత్మకబాధ్యతాయుతమైన ఓటింగ్ ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రచారం చేసిన "చునావ్ కా పర్వ్ దేశ్ కా గర్వ్సిరీస్‌ సహా దాని ప్రభావవంతమైన కవరేజీ కోసం దూరదర్శన్‌కు ఈ గుర్తింపు లభించింది.

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా పురస్కారం అందుకుంటున్న దూరదర్శన్ డీజీ శ్రీమతి కాంచన్ ప్రసాద్

 2024 పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రచారం ద్వారా పౌరులకు సమాచారం అందించడంవారిని క్రియాశీలం చేయడంలో దూరదర్శన్ నిబద్ధతను ప్రదర్శించిందిఇందులో భాగంగా ఉన్నవి:

·         వినూత్న కార్యక్రమాలుఓటరు అవగాహన కోసం 30 లఘు చిత్రాల రూపకల్పనప్రసారం.

·         బహుభాషా ప్రచారం: డిడి నేషనల్డిడి ఇండియాడిడి న్యూస్ ఛానెళ్లలో విస్తృత ప్రచారం ద్వారాదేశంలోని ప్రతి మూలకు సందేశాలు చేరేలా చూసుకోవడం.

·         ఆకర్షణీయమైన ప్రకటనలుప్రజాస్వామ్య పండుగలో లక్షలాది మందిని ఉత్సాహంగా పాలుపంచుకునేలా ప్రేరేపించే లక్ష్యంతో ఆకర్షణీయమైన L-బ్యాండ్ ప్రకటనలుమగ్ బ్రాండింగ్ప్రకటనలు (45 సెకన్లు/స్పాట్‌లుప్రసారం చేయడం.

తన సృజనాత్మకసమ్మిళిత విధానం ద్వారాదూరదర్శన్ ప్రజాస్వామ్య ప్రక్రియకు తమ వంతు సహకారం అందించేందుకు దేశవ్యాప్తంగా ఓటర్లనుముఖ్యంగా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువతను శక్తిమంతం చేసింది.

ఈ పురస్కారం అందుకున్న సందర్భంగాప్రజల విశ్వసనీయ గొంతుకగా కొనసాగడం ద్వారా జాతి నిర్మాణం పట్ల తన అంకితభావాన్ని దూరదర్శన్ పునరుద్ఘాటించింది.

 

***


(రిలీజ్ ఐడి: 2096327) సందర్శకుల సూచీ సంఖ్య : : 73
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Punjabi