సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
కథ చెప్పడంపై ఐఐఎంసీలో కార్యశాల: గొప్ప కథల గుట్టు విప్పనున్న సరస్వతీ బుయ్యాల
ఆకర్షణీయమైన కథల ద్వారా పెట్టుబడిదారులు, నిర్మాతలను ఆకర్షించడానికి, ప్రపంచ సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఔత్సాహిక ఫిల్మ్ మేకర్స్, క్రియేటర్స్కు సాధికారత కల్పించనున్న కార్యశాల
Posted On:
23 JAN 2025 7:49PM by PIB Hyderabad
వేవ్స్ 2025 ఆధ్వర్యంలో క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్-1లో భాగంగా యానిమేషన్ ఫిల్మ్మేకర్స్ పోటీ నిర్వహిస్తున్న డ్యాన్సింగ్ ఆటమ్స్... ఈరోజు న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎమ్సీ)లో స్టోరీటెల్లింగ్ కార్యశాలను నిర్వహించింది. ప్రఖ్యాత రచయిత-దర్శకురాలు సరస్వతి బుయ్యాల ఈ ఆసక్తికరమైన సెషన్కు నేతృత్వం వహించారు. ఔత్సాహిక ఫిల్మ్మేకర్స్ తమ కథలతో పెట్టుబడిదారులు, నిర్మాతలను ఆకర్షించగల నైపుణ్యాలను సాధించేలా వారిని సన్నద్ధం చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.
డిజైన్ ఇన్ ఇండియా, డిజైన్ ఫర్ ది వరల్డ్ దార్శనికతకు అనుగుణంగా...
గేమింగ్, యానిమేషన్ అలాగే ఫిల్మ్ మేకింగ్ వంటి సృజనాత్మక రంగాల్లో అభివృద్ధి చెందుతున్న ఉద్యోగాలు, పెరుగుతున్న అవకాశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 114వ ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న 'క్రియేట్ ఇన్ ఇండియా' పోటీల్లో పాల్గొనాలని ఆయన సృజనకారులను కోరారు. వీటిని "డిజైన్ ఇన్ ఇండియా, డిజైన్ ఫర్ ది వరల్డ్" అనే విస్తృత దార్శనికతకు అనుగుణంగా వివిధ రంగాల్లో ప్రతిభను, ఆవిష్కరణలను పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు.
కార్యశాల గురించి
ఆకర్షణీయంగా ఒక కథనాన్ని రూపొందించే ఆచరణాత్మక విధానాలనూ, కథను నిర్మాతల వద్దకు తీసుకుపోవడం, శక్తిమంతంగా లాగ్ లైన్ ను తీర్చిదిద్దడం, పాత్రల చిత్రణ, పిచ్ డెక్స్ తయారీ వంటివాటి ద్వారా దర్శకులు తమ దృక్పథాన్ని బలంగా చెప్పడానికి అవసరమైన అంశాలను ఈ కార్యశాలలో అందించారు.
కార్యశాల గురించిన ముఖ్యాంశాలు
· ఆకర్షణీయమైన కథలతో పెట్టుబడిదారులు, నిర్మాతలను ఆకర్షించటంలో ఫిల్మ్మేకర్స్కు సహాయపడేందుకు రూపొందించిన పిచ్ విధానంలో ప్రావీణ్యం సంపాదించుట కోసం గల ఒక వ్యక్తిగత కార్యశాల.
· https://wavesindia.org పై ప్రాజెక్టులను సమర్పించండి. అలాగే క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనండి. వారు వారి లక్ష్యాలను సాధించుటలో WAVES India platform ఎలా సహాయపడగలదో తెలుసుకోండి.
-
ప్రపంచ నిర్మాతలు, పెట్టుబడిదారులతో కథకులను అనుసంధానించే వేదిక అయిన వేవ్స్ 2025 కార్యక్రమంలో పాల్గొనడం.
-
కథ చెప్పడంలో రహస్యాలను వెలికితీసేందుకు టాయ్ స్టోరీ, 3 ఇడియట్స్, బాహుబలి వంటి దిగ్గజ చిత్రాల కేస్ స్టడీస్ పరిశీలించడం.
కథ చెప్పడం, చిత్రనిర్మాణ కళకు అంకితమైన ఈ ఆసక్తికరమైన వర్క్షాప్ కోసం అభిరుచి గల విభిన్న చిత్రనిర్మాతలు, రచయితలు, స్క్రీన్ రైటర్లు, చలనచిత్ర ఔత్సాహికులు సమావేశమయ్యారు. పాల్గొన్నవారంతా కథ చెప్పడం కోసం అవసరమైన సూత్రాలు, ఆచరణాత్మక చిత్రనిర్మాణ పద్ధతులతో కూడిన అధ్భుతమైన అభ్యాస అనుభవంలో నిమగ్నమయ్యారు.
రచయితలు, స్క్రీన్ రచయితలు తమ కథన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ, ప్రేక్షకులను ఆకట్టుకునే పాత్రలను, ప్రభావవంతమైన కథాంశాల రూపకల్పనపై దృష్టి సారించడం ద్వారా ఈ రంగంలో ఔత్సాహికులకు బలమైన పునాదిని ఈ కార్యశాల అందించింది. సినిమా ఔత్సాహికులు కథ చెప్పడం, పాత్ర చిత్రణలో చిక్కులను గురించి తెలుసుకోవడం ద్వారా సినిమా పట్ల వారి అభిమానాన్ని మరింత పెంచుకున్నారు.
సరస్వతి బుయ్యాల: ఆస్కార్ అవార్డు గెలుచుకున్న దృశ్య కళాఖండాల సృష్టికర్త
రచయిత్రి-దర్శకురాలు అయిన సరస్వతి బుయ్యాల, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమ్లు, కామిక్స్ అలాగే ఏఆర్/వీఆర్ రంగాల్లో నైపుణ్యం గడించారు. ఆమె లైఫ్ ఆఫ్ పై, ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా, ది గోల్డెన్ కంపాస్ వంటి అనేక ప్రశంసలు పొందిన, ఆస్కార్ అవార్డు సాధించిన చిత్రాలకు ఆమె రచనలు అందించారు. ఆమె రచనలు కథ చెప్పడం పట్ల ఆమెకు గల లోతైన మక్కువను అలాగే అత్యాధునిక దృశ్య పద్ధతులపై ఆమెకు గల నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి.
మరిన్ని వివరాల కోసం
https://wavesindia.org/ ను సందర్శించండి మీ సృజనాత్మకతను ప్రకాశింపజేయండి. మీ ప్రాజెక్ట్ ప్రత్యేకతను ప్రపంచానికి చూపించండి!
***
(Release ID: 2095835)
Visitor Counter : 32