రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఆత్మనిర్భర భారత్: నావికా దళానికి మధ్య శ్రేణి క్షిపణుల కోసం బీడీఎల్ తో రక్షణ శాఖ ఒప్పందం

Posted On: 16 JAN 2025 12:21PM by PIB Hyderabad

భారత నావికా దళానికి ఉపరితలం నుంచి వాయుమార్గంలోకి ప్రయోగించగల మధ్య శ్రేణి క్షిపణులను (ఎంఆర్ఎస్ఏఎం) సరఫరా చేయడం కోసం భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)తో రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ దాదాపు రూ. 2,960 కోట్లు. రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ రాజేశ్ కుమార్ సింగ్ సమక్షంలో ఢిల్లీలో రక్షణ మంత్రిత్వ శాఖ, బీడీఎల్ అధికారులు ఒప్పందంపై గురువారం సంతకం చేశారు.

ఎంఆర్ఎస్ఏఎం వ్యవస్థ ప్రామాణికంగా ఉండి కచ్చితంగా సరిపోవడంతోపాటు దీనిని వివిధ భారత నావికా దళ నౌకలపై నిలుపుతారు. భవిష్యత్తులో సమకూర్చుకోవాలని భావిస్తున్న అనేక నావికాదళ వేదికలపై దీనిని అమర్చాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దేశ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడానికీ, అధునాతన సైనిక సాంకేతికతను దేశీయంగా రూపొందించడానికీ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ ఒప్పందం సూచిస్తుంది.

‘ఆత్మనిర్భర భారత్’కు ప్రాధాన్యమిస్తూ.. కొనుగోలు (భారతీయ)’ విభాగం కింద అధిక శాతం దేశీయ తయారీకి ప్రాధాన్యమిస్తూ బీడీఎల్ ఈ క్షిపణులను సరఫరా చేస్తుంది. వివిధ ఎంఎస్ఎంఈలు సహా రక్షణ రంగంలో ఈ ఒప్పందం ద్వారా దాదాపు 3.5 లక్షల పనిదినాల ఉపాధి లభిస్తుంది.  

 

***


(Release ID: 2093754) Visitor Counter : 75