ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రికి కువైట్లో నివసిస్తున్న భారతీయ సముదాయం ఆత్మీయ స్వాగతం: సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాని
కువైట్లో శ్రీ మంగళ్ సైన్ హాండీ జీతో ప్రధాని భేటీ
Posted On:
21 DEC 2024 6:16PM by PIB Hyderabad
కువైట్లో నివసిస్తున్న భారతీయ సముదాయం తనకు ఆత్మీయంగా స్వాగతం పలికినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. వారిలో ఉప్పొంగుతున్న శక్తి, ప్రేమ, భారత్ అంటే అచంచలమైన అనుబంధం నిజంగా ప్రేరణనిచ్చేవిగా ఉన్నాయని ఆయన అన్నారు.
ఈ రోజు మధ్యాహ్నంపూట కువైట్లో శ్రీ మంగళ్ సైన్ హాండీ జీని తాను కలుసుకోవడం తనకు సంతోషాన్నిచ్చిందని కూడా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘కువైట్లో హుషారుతనం ఉప్పొంగుతున్న భారతీయ సముదాయం నాకు ఆత్మీయ స్వాగతాన్ని అందించింది.
వారి శక్తి, ప్రేమ, భారత్ అంటే వారికున్న అచంచల అనుబంధం నిజంగా ప్రేరణనిచ్చేవే. వారు చూపిన ఉత్సాహానికి కృతజ్ఞుడినై ఉంటాను. మన రెందు దేశాల మధ్య సంబంధాలను బలపరచడంలో వారు అందిస్తున్న తోడ్పాటును చూస్తే గర్వంగా ఉంది.’’
‘‘ఈ రోజు మధ్యాహ్నం కువైట్లో శ్రీ మంగళ్ సైన్ హాండా జీ (@MangalSainHanda Ji)ని కలుసుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది. భారత్కు ఆయన అందించిన తోడ్పాటు, భారత్ అభివృద్ధి కోసం ఆయన కనబరుస్తున్న ఉత్సాహ, ఉద్వేగాల్ని నేను మెచ్చుకొంటున్నాను.’’
***
(Release ID: 2087107)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam