గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కలుపు మొక్క కాదు… గెలుపు మొక్క స్వచ్ఛ హరిత వనరుగా గుర్రపుడెక్క


అస్సాం మోరిగావ్ లోని వరద-బాధిత ప్రాంతం బోర్చిలా మహిళలూ,

దీపోర్ బీల్ కు చెందిన ఇద్దరు ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తల కృషి

గుర్రపుడెక్క నుంచి పర్యావరణ హిత ఉత్పత్తుల తయారీ...

నగర ప్రాంత-స్వచ్ఛ్ భారత్ ఉద్యమం కింద ఉపాధి అవకాశాల కల్పన

Posted On: 24 OCT 2024 5:16PM by PIB Hyderabad

కేంద్ర గృహనిర్మాణపట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ నేతృత్వంలో ‘నగర ప్రాంత-స్వచ్ఛ్ భారత్’ కింద ఇటీవల చేపట్టిన ‘స్వచ్ఛతా హీ సేవా’ ప్రచారోద్యమానికి దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించిందిఈశాన్య రాష్ట్రాలు ఈ ఉద్యమంలో ముందుండిపండుగల వేళ ఆరోగ్యంపారిశుద్ధ్యం కోసం ప్రత్యేకంగా  శ్రమిస్తున్నాయి.

పర్యావరణానికి అనుకూలంగా ఉంటూపునర్వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థను అవలంబించేందుకు ఈశాన్య రాష్ట్రాలు అనేక వినూత్న పద్ధతులను ఆచరణలో పెడుతున్నాయిస్వచ్ఛత కోసం అనేక క్రియాశీల చర్యలు చేపడుతున్నాయిభారతదేశ నీటి వనరులకు విదేశీ జాతి మొక్క... గుర్రపుడెక్క బెడదగా మారిందిఆకర్షణీయ ఊదా రంగు పువ్వులు గల ఈ తీగజాతి మొక్కమంచినీటి సరస్సులూకొలనులూనదులనూ ఆక్రమించి చేపల వేటరవాణాఇతర పనులకు అడ్డంకిగా మారినీటి వనరు ఉపయోగాన్ని తగ్గిస్తోంది.

అస్సాం మోరిగావ్ జిల్లాలోని వరద బాధిత ప్రాంతం బోర్చిలా గ్రామానికి చెందిన ఒక  మహిళల బృందంఆ ప్రాంత మంచినీటి వనరుల్లో అధికంగా లభ్యమయ్యే గుర్రపుడెక్క నుంచి అందమైన హస్తకళా ఉత్పత్తుల తయారీని చేపట్టివ్యర్ధాల నుంచీ సంపద సృష్టిస్తోందితమ జీవితాలకు లక్ష్యంగౌరవం ఉండాలన్న స్పష్టమైన ఉద్దేశంతో బోర్చిలా గ్రామ మహిళలు చేపట్టిన ఈ పని ద్వారా ఒక్కో మహిళకూ నెలకు రూ.10,000 ఆదాయంగా లభిస్తోందిఅస్సాం రాష్ట్ర గ్రామీణ ఉపాధి పథకం-‘ఏఎస్ఆర్ఎల్ఎం’ లో భాగమైన ఈ వినూత్న కార్యక్రమంమహిళల స్వావలంబనకు దోహదపడటమే కాకవారి ఆర్థిక ఇక్కట్లను తగ్గించింది.

తమ తుకులు మెరుగవ్వాలన్న బలమైన కాంక్షతో ముందడుగు వేసిన ఈ 60 మంది మహిళలకూముడిపదార్థాల ఖర్చు అవరోధంగా నిలిచిందిఅప్పుడేసమీపాన గల సోనాయ్ నదిలోని గుర్రపుడెక్క వారికి వరదాయినిగా దర్శనమిచ్చిందిస్థానికంగా ‘పానీ మెటేకా’గా పిలిచే ఈ కలుపు మొక్కను అస్సామీయులు జీవవైవిధ్యానికి  ప్రతీకగా భావించినప్పటికీనీటి వనరులని నిరుపయోగపరిచే స్థాయిలో ఆక్రమిస్తుందని గుర్తించారు. వరద బాధిత ప్రాంతాల్లో విస్తారంగా కనపడే గుర్రపుడెక్కకు గల వివిధ సద్గుణాలను వాడుకుంటూఉపయోగకర వస్తువుల తయారీ చేపట్టాలని వారు నిర్ణయించుకున్నారు.

అస్సాంలోని ఏకైక రాంసర్ ప్రాంతం దీపోర్ బీల్ చిత్తడి నేలలకు పర్యావరణపరంగా ప్రాముఖ్యం ఉంది. గుర్రపుడెక్క ఈ ప్రాంతపు జలపర్యావరణాన్ని కబళిస్తూ పెద్ద సమస్యగా మారిందిస్థానిక యువకులు రూపాంకర్ భట్టాచార్యఅనికేత్ ధర్ లు మాత్రం సమస్యలో అవకాశాన్ని చూశారుసృజనాత్మత కలిగిన ఈ ఇరువురూకొత్త పద్ధతిలో ‘పానీ మెటేకా’ నుంచీ ‘కుంభీ కాగజ్’ అనే పర్యావరణ హిత కాగితాన్ని తయారు చేశారుతయారీలో ఎటువంటి రసాయనాలనూ వాడనిమచ్చల ఊసు లేని ఈ నునుపైన కాగితం, 100 శాతం భూమిలో కలిసిపోయే గుణం కలదికొత్త విషయాలు నేర్చుకునిఆ జ్ఞానాన్ని అమలులో పెట్టాలన్న ఈ యువకుల పట్టుదల, ‘జీరో వేస్ట్ సిటీస్ ఛాలెంజ్’ పోటీలో విజేతలుగా నిలిపిందివ్యర్థాల నుంచీ పర్యావరణ అనుకూల ఉత్పత్తుల తయారీలో నిమగ్నమైఉపాధిని కల్పించే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఈ పోటీ  ప్రోత్సాహిస్తుంది.  కుంభీ కాగజ్ కాగితం పరిశ్రమ 40 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది.

బోర్చిలా గ్రామ మహిళలయువ సృజనకారులు రూపాంకర్అనికేత్ ల ప్రయాణం స్ఫూర్తిదాయకంగా నిలుస్తూకలుపు మొక్క నుంచీ సంపద సృష్టి సాధ్యమని నిరూపిస్తోందిపర్యావరణ హిత కళాకృతుల ఉత్పాదనరసాయన రహిత కాగితం తయారీల్లో నిమగ్నమైన వీరుతమ తోటి వారికి సహాయ పడటమే కాకపర్యావరణ పరిరక్షణలోనూ భాగమవుతున్నారు.

 

***




(Release ID: 2068302) Visitor Counter : 19