ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ లోని వియంటియాన్ పర్యటనకు ముందు ప్రధానమంత్రి ప్రకటన

Posted On: 10 OCT 2024 6:56AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ సోనెక్సే సిఫాండోన్ ఆహ్వానం మేరకు 21వ ఆసియాన్ -ఇండియా 19వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి నేను  ఈ రోజు  లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ లోని వియంటియాన్ రెండు రోజుల పర్యటనకు బయలుదేరాను

ఈ సంవత్సరం మనం యాక్ట్ ఈస్ట్ పాలసీని ప్రారంభించి పదేళ్లు అయిందిమన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని సమీక్షించడానికిసహకారంభవిష్యత్తు దిశను రూపొందించడానికి నేను ఆసియాన్ నాయకులతో సమావేశం అవుతాను

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతిసుస్థిరతసౌభాగ్యానికి ఎదురవుతున్న సవాళ్లపై చర్చించేందుకు తూర్పు ఆసియా సదస్సు అవకాశం కల్పిస్తుంది.

బౌద్ధంరామాయణాల భాగస్వామ్య వారసత్వంతో సుసంపన్నమైన లావో పిడిఆర్ తో సహా ఈ ప్రాంతంతో మనం సన్నిహిత సాంస్కృతికనాగరిక సంబంధాలను పంచుకుంటాంద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి లావో పీడీఆర్ నాయకత్వ సారధ్యంలో సమావేశం కావడం కోసం ఎదురుచూస్తున్నాను.

ఈ పర్యటన ఆసియాన్ దేశాలతో మన సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను.

 

****



(Release ID: 2063728) Visitor Counter : 32