ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

ముంబయిలో మేటి మరాఠీ భాష కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

మరాఠీని ప్రాచీన భాషగా గుర్తించడం ప్రతి ఒక్కరికీ గర్వకారణం: ప్రధాన మంత్రి



మరాఠీతో పాటు బెంగాలీ, పాలీ, ప్రాకృత, అస్సామీ భాషలకు కూడా ప్రాచీన భాష హోదా కల్పించాం

ఈ భాషలతో సంబంధం ఉన్న ప్రజలకు అభినందనలు: ప్రధాన మంత్రి



మరాఠీ భాషా చరిత్ర చాలా గొప్పది: ప్రధాన మంత్రి



మహారాష్ట్రకు చెందిన అనేక మంది విప్లవ నాయకులు, ఆలోచనాపరులు మరాఠీ భాషను ఒక మాధ్యమంగా ఉపయోగించి ప్రజలను చైతన్యవంతులను చేశారు: ప్రధానమంత్రి



భాష కేవలం సందేశ మాధ్యమం మాత్రమే కాదు, సంస్కృతి, చరిత్ర, సంప్రదాయం, సాహిత్యంతో లోతుగా ముడిపడి ఉంది: ప్రధాని

Posted On: 05 OCT 2024 8:50PM by PIB Hyderabad

మరాఠీ భాషకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రాచీన భాష హోదా కల్పించిందని ప్రధానమంత్రి అన్నారుమరాఠీ భాష మాట్లాడే ప్రజల చిరకాల ఆకాంక్షను గుర్తించిమహారాష్ట్ర కలను సాకారం చేసినందుకు మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారుముంబయిలో ఇవాళ జరిగిన ‘‘మేటి మరాఠీ భాష’’ కార్యక్రమంలో ప్రధాని మట్లాడుతూ మరాఠీ భాషా చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా అభివర్ణించారుఈ సందర్భంగా ప్రధాన మంత్రి మహారాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారుఈ చారిత్రాత్మక నిర్ణయంలో భాగమైనందుకు గర్వపడుతున్నట్లు తెలిపారుమరాఠీతో పాటు బెంగాలీపాలీప్రాకృతఅస్సామీ భాషలకు కూడా ప్రాచీన భాష హోదా కల్పించినట్లు తెలిపిన ప్రధాని... ఆయా భాషలతో సంబంధం ఉన్న ప్రజలకు అభినందనలు తెలిపారు.

మరాఠీ భాషా చరిత్ర చాలా గొప్పదనిఈ భాష నుంచి ఉద్భవించిన జ్ఞాన ప్రవాహం అనేక తరాలకు మార్గనిర్దేశనం చేశాయని ప్రధాని అన్నారుఅవి నేటికీ మనకు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నాయన్నారుమరాఠీ భాషను ఉపయోగించి వేదాంత చర్చతోసంత్ జ్ఞానేశ్వర్ ప్రజలను అనుసంధానం చేశారనిఅదేవిధంగా జ్ఞానేశ్వరి గీత జ్ఞానంతో భారతదేశ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పునరుజ్జీవింపజేశారని అన్నారుసంత్ నామ్‌దేవ్ మరాఠీ భాష ద్వారా భక్తి మార్గ చైతన్యాన్ని బలోపేతం చేశారనిసంత్ తుకారమ్ మరాఠీ భాషలో మతపరమైన అవగాహనా ప్రచారాన్ని ప్రారంభించారని ప్రధాని తెలిపారుసంత్ చొఖమేలా సామాజిక మార్పు కోసం ఉద్యమాలను శక్తిమంతం చేశారని తెలిపారు. "మహారాష్ట్రమరాఠీ భాషకు చెందిన గొప్ప సాధువులకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానుఅని ప్రధాని అన్నారుమరాఠీ భాషకు ప్రాచీన భాష హోదా ఇవ్వడం అంటేఛత్రపతి శివాజీ మహరాజ్ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యావత్ దేశం ఆయనను గౌరవించడమేనని ప్రధానమంత్రి అన్నారు.

సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూమరాఠీ భాష భారత స్వాతంత్ర్య పోరాటంలో అందించిన అమూల్యమైన తోడ్పాటును ప్రధానంగా ప్రస్తావించారుప్రజలకు అవగాహన కల్పించడానికీవారిని సంఘటితం చేయడానికి మహారాష్ట్రకు చెందిన అనేక మంది విప్లవ వీరులుఆలోచనాపరులూ భాషను ఒక మాధ్యమంగా ఎలా ఉపయోగించిందీ ప్రస్తావించారులోకమాన్య తిలక్ తన మరాఠీ వార్తాపత్రిక 'కేసరిద్వారా విదేశీ పాలన పునాదులను పెకిలించారనిమరాఠీలో ఆయన చేసిన ప్రసంగాలు ప్రతి భారతీయుడి హృదయాల్లో స్వరాజ్య కాంక్షను రగిలించాయని ప్రధాని అన్నారున్యాయంసమానత్వం కోసం పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మరాఠీ భాష కీలక పాత్ర పోషించిందనిగోపాల్ గణేష్ అగార్కర్ వంటి ఇతర ప్రముఖుల కృషిని ఆయన గుర్తు చేశారుఆయన తన మరాఠీ వార్తాపత్రిక సుధారక్ ద్వారా సామాజిక సంస్కరణల ప్రచారాన్ని ప్రతి ఇంటికి చేరవేశారుస్వాతంత్ర్య పోరాటాన్ని తన లక్ష్యం వైపు నడిపించడానికి మరాఠీపై ఆధారపడిన మరొక దిగ్గజ వ్యక్తి గోపాల కృష్ణ గోఖలే అని ప్రధాని పేర్కొన్నారు.

మరాఠీ సాహిత్యం దేశ అమూల్య వారసత్వమనిమన నాగరికత ఎదుగుదలసాంస్కృతిక పురోగతిని పరిరక్షిస్తుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారుస్వరాజ్యంస్వదేశీమాతృభాషసాంస్కృతిక అభిమానం వంటి ఆదర్శాలను వ్యాప్తి చేయడంలో మరాఠీ సాహిత్యం కీలక పాత్ర పోషించిందన్నారుస్వాతంత్య్రోద్యమ కాలంలో గణేష్ ఉత్సవాలుశివాజీ జయంతి వేడుకలువీర్ సావర్కర్ విప్లవాత్మక ఆలోచనలుబాబాసాహెబ్ అంబేడ్కర్ నేతృత్వంలోని సామాజిక సమానత్వ ఉద్యమంమహర్షి కార్వే మహిళా సాధికారత ఉద్యమంమహారాష్ట్రలో పారిశ్రామికీకరణవ్యవసాయ సంస్కరణల వంటి కార్యక్రమాలన్నీ మరాఠీ భాషలోనే బలపడ్డాయని ప్రధానమంత్రి పేర్కొన్నారుమరాఠీ భాషతో అనుసంధానం కావడం ద్వారా మన దేశ సాంస్కృతిక వైవిధ్యం మరింత సుసంపన్నమవుతుందని ఆయన అన్నారు.

"
భాష అనేది కేవలం సందేశ మాధ్యమం మాత్రమే కాదుసంస్కృతిచరిత్రసంప్రదాయం సాహిత్యంతో గాఢంగా ముడిపడి ఉందిఅని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారుపోవాడా అనే జానపద గేయం గురించి ప్రస్తావిస్తూఛత్రపతి శివాజీ మహరాజ్ఇతర గొప్ప నాయకుల ధైర్యసాహసాల కథలు అనేక శతాబ్దాల తరువాత కూడా మనకు చేరాయని ప్రధాని వ్యాఖ్యానించారునేటి తరానికి మరాఠీ భాష అందించిన అద్భుతమైన బహుమతి పొవాడా అని ఆయన అన్నారునేడు మనం వినాయకుడిని ఆరాధిస్తున్నప్పుడు 'గణపతి బప్పా మోరియాఅనే పదాలు సహజంగానే మన మనస్సులో ప్రతిధ్వనిస్తాయనిఇది కేవలం కొన్ని పదాల కలయిక కాదనిఅంతులేని భక్తి ప్రవాహం అని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా తెలిపారుఈ భక్తి... దేశం మొత్తాన్ని మరాఠీ భాషతో కలుపుతుందని ఆయన అన్నారుఅదేవిధంగా శ్రీ విఠల్ అభాంగ్ వినే వారు కూడా స్వతసిద్ధంగా మరాఠీతో అనుసంధానం అవుతారని ప్రధానమంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

మరాఠీ భాషకు ఇక్కడి సాహితీవేత్తలురచయితలుకవులుఅసంఖ్యాకమైన మరాఠీ ప్రేమికులు చేసిన కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారుఈ భాషకు ప్రాచీన హోదా లభించడం ఎంతో మంది ప్రతిభావంతులైన సాహితీవేత్తల సేవకృషి ఫలితమని వ్యాఖ్యానించారుబాలశాస్త్రి జంభేకర్మహాత్మా జ్యోతిబా ఫూలేసావిత్రిబాయి ఫూలేకృష్ణాజీ ప్రభాకర్ ఖడిల్కర్కేశవసూత్శ్రీపాద్ మహదేవ్ మాఠేఆచార్య ఆత్రేఅన్నా భావు సాఠేశాంతాబాయి షెల్కేగజానన్ దిగంబర్ మద్గుల్కర్కుసుమరాజ్ వంటి ప్రముఖుల సేవలను ప్రధాని కొనియాడారుమరాఠీ సాహిత్య సంప్రదాయం పురాతనమైనదే కాకుండా బహుముఖమైనదని ప్రధాన మంత్రి ఈ సమావేశంలో పేర్కొన్నారువినోబా భావేశ్రీపాద్ అమృత్ డాంగేదుర్గాబాయి భగవత్బాబా ఆమ్టేదళిత సాహితీవేత్త దయా పవార్బాబాసాహెబ్ పురందరే వంటి ఎందరో ప్రముఖులు మరాఠీ సాహిత్యానికి విశేష కృషి చేశారన్నారుపురుషోత్తం లక్ష్మణ్ దేశ్ పాండేడాక్టర్ అరుణా ధేరేడాక్టర్ సదానంద్ మోరేమహేష్ ఎల్కుంచ్వార్సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నామ్ దేవ్ కాంబ్లే సహా మరాఠీ భాషకు కృషి చేసిన సాహితీవేత్తల సేవలను మోదీ గుర్తు చేసుకున్నారుఆశా బాగేవిజయ రాజధ్యాక్షడాక్టర్ శరణ్ కుమార్ లింబాలేరంగస్థల దర్శకుడు చంద్రకాంత్ కులకర్ణి వంటి ఎందరో దిగ్గజాలు మరాఠీకి ప్రాచీన భాష హోదా కల్పించాలని ఎన్నో ఏళ్లుగా కలలు కన్నారని పేర్కొన్నారు.

మరాఠీ సినిమాసాహిత్యంసాంస్కృతిక రంగాల్లో సేవలందించిన వారిని ప్రధాన మంత్రి కొనియాడారుభారతీయ సినిమాకు పునాది వేసిన దిగ్గజాలు వి.శాంతారాందాదాసాహెబ్ ఫాల్కే అందించిన సేవలను ప్రధాని పేర్కొన్నారుమరాఠీ నాటకరంగం అణచివేతకు గురైన వారికి/బడుగులకు స్వరాన్ని అందించిదనిమరాఠీ సంగీతాన్ని వేడుక చేసిందని పేర్కొన్నారుబాల గంధర్వభీమ్ సేన్ జోషిలతా మంగేష్కర్ వంటి దిగ్గజాల కృషిని ప్రధాని ప్రశంసించారు.

అహ్మదాబాద్‌కు చెందిన ఒక మరాఠీ కుటుంబం తనకు భాష నేర్చుకోవడంలో సహాయపడిన జ్ఞాపకాన్ని ప్రధాని ఈ సందర్భంగా పంచుకున్నారుమరాఠీని ప్రాచీన భాషగా గుర్తించడం వల్ల దేశమంతా అన్ని విశ్వవిద్యాలయాల్లో భాషా పరిశోధనను ప్రోత్సహించడంతో పాటు సాహిత్య సేకరణను కూడా ప్రోత్సహిస్తుందని ప్రధాన మంత్రి ప్రధానంగా ప్రస్తావించారుమరాఠీ భాషాభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థలువ్యక్తులువిద్యార్థులకు ఈ నిర్ణయం గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుందని ప్రధాని ఆకాంక్షించారుఈ నిర్ణయం విద్యపరిశోధనల్లో కొత్త మార్గాలను అన్వేషిస్తుందనిఈ రంగాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రాంతీయ భాషల్లో విద్యకు ప్రాధాన్యమిచ్చే ప్రభుత్వం దేశంలో ఉందని ప్రధాని అన్నారునూతన జాతీయ విద్యావిధానం కింద మరాఠీ భాషలో వైద్యఇంజినీరింగ్ కోర్సులను అభ్యసించే అవకాశాలను ప్రధాని వివరించారుసైన్స్ఆర్థిక శాస్త్రంకళలు వంటి వివిధ సబ్జెక్టుల్లో మరాఠీలో పుస్తకాల లభ్యత పెరుగుతోందనిమరాఠీని ఆలోచనల వాహకంగా మార్చాలనితద్వారా అది చైతన్యవంతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారుమరాఠీ సాహిత్యాన్ని ప్రపంచ అభిమానులకు చేరువ చేసే ప్రయత్నాలను ఆయన అభినందించారుభాషా అడ్డంకులను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడే 'భాషిని'- అనువాద అనువర్తనాన్ని కూడా ప్రధాని సమావేశంలో ప్రస్తావించారు.

ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకోవడం బాధ్యతను పెంచుతుందని ప్రధాని ప్రతి ఒక్కరికీ గుర్తు చేశారుమరాఠీ మాట్లాడే ప్రతి వ్యక్తి ఈ భాష ఎదుగుదలకు సహకరించాలని ఆయన ఉద్ఘాటించారుభవిష్యత్ తరాలకు గర్వకారణంగా నిలిచేలా మరాఠీ పరిధిని విస్తరించేందుకు కృషి చేయాలని ఆయన కోరారుమరాఠీకి ప్రాచీన భాష హోదా లభించిన సందర్భంగా మరొక్కసారి అందరికీ అభినందనలు తెలుపుతూ ముగించారు.

 

 

 

***

MJPS/SR/TS



(Release ID: 2062660) Visitor Counter : 7