ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్వాతంత్య్ర సమరయోధుడు శ్యామ్‌జీ కృష్ణ వర్మ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

నాడు పోస్టు చేయడమైనది: 04 OCT 2024 9:28AM by PIB Hyderabad

స్వాతంత్య్ర  సమరయోధుడు శ్యామ్‌జీ కృష్ణ వర్మ 95వ జయంతి సందర్భంగా ఆయనను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకున్నారు.


దేశం పట్ల ఆయన అంకితభావం, సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.


సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ఈ విధంగా పేర్కొన్నారు:

'గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు,భరతమాత వీర పుత్రుడు శ్యామ్‌జీ కృష్ణ వర్మ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను. తన విప్లవాత్మక కార్యక్రమాలతో దేశ స్వాతంత్య్ర సంకల్పంలో శక్తిని నింపేందుకు కృషి చేశారు. దేశం పట్ల ఆయన అంకితభావం, సేవలు ప్రతి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.”

 

 

***

MJPS/RT


(రిలీజ్ ఐడి: 2062007) సందర్శకుల సూచీ సంఖ్య : : 110