రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav g20-india-2023

జైపూర్‌లో సైనిక‌ పాఠ‌శాల‌ను లాంఛ‌నంగా ప్రారంభించిన ర‌క్ష‌ణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌


“దేశ‌భ‌క్తి గ‌ల యువ‌త‌ను ఈ పాఠ‌శాల అందిస్తుంది.

సాయుధ ద‌ళాల్లో చేర‌డానికి, మాతృభూమికి సేవ చేయ‌డానికి స‌రైన మార్గనిర్దేశం చేస్తుంది”

“సైనిక‌ పాఠ‌శాల‌ విద్యాసంబంధ జ్ఞానాన్ని అందించ‌డంతోపాటు

Posted On: 23 SEP 2024 3:08PM by PIB Hyderabad

యువ‌త స‌మ‌గ్రాభివృద్ధి కోసం క్ర‌మ‌శిక్ష‌ణవిలువ‌లుదేశ‌భ‌క్తిధైర్యాన్ని బోధిస్తుంది”

దేశ‌వ్యాప్తంగా భాగ‌స్వామ్య ప‌ద్ధ‌తిలో 100 కొత్త సైనిక‌ పాఠ‌శాల‌ను ఏర్పాటు చేయాల‌న్న ప్ర‌భుత్వ సంక‌ల్పంలో భాగంగా రాజ‌స్థాన్‌లోని జైపూర్‌లో సైనిక పాఠ‌శాల‌ను సోమ‌వారం ర‌క్ష‌ణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ లాంఛ‌నంగా ప్రారంభించారు. 100 పాఠ‌శాల్లో 45 పాఠ‌శాల‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాలుఎన్జీవోలుప్రైవేటు పాఠ‌శాల‌ల భాగ‌స్వామ్యంతో ఏర్పాటు చేసేందుకు ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందిఇందులో 40 పాఠ‌శాల‌లు ఇప్ప‌టికే కార్య‌క‌లాపాలు ప్రారంభించ‌గావీటిల్లో జైపూర్ పాఠ‌శాల ఒక‌టి.
రాష్ట్రంలోని దేశ‌భ‌క్తి గ‌లిగిన యువ‌త‌కు ఈ పాఠ‌శాల వ‌రంగా మారుతుంద‌నిసాయుధ ద‌ళాల్లో చేరడానికిదేశానికి సేవ చేయ‌డానికి అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాలుస‌రైన మార్గ‌నిర్దేశం చేస్తుంద‌ని ర‌క్ష‌ణ మంత్రి విశ్వాసం వ్య‌క్తం చేశారు. “మ‌హారాణా ప్ర‌తాప్‌పృథ్విరాజ్ చౌహాన్‌మ‌హారాజ్ సూర‌జ్‌మల్‌స‌వాయి జై సింగ్ లాంటి ధైర్య‌వంతుల నేల రాజ‌స్థాన్‌యువ‌త‌రం సైన్యంలో చేరేందుకు ఈ వీరులే స్ఫూర్తిమాతృభూమికి సేవ చేసేందుకు యువ‌త‌కు ఈ కొత్త సైనిక పాఠ‌శాల దిశానిర్దేశం చేస్తుంది” అని ఆయ‌న పేర్కొన్నారు.
పీపీపీ ప‌ద్ధ‌తిని సాధార‌ణంగా ‘ప‌బ్లిక్‌-ప్రైవేటు-పార్ట్‌న‌ర్షిప్’ అని సంబోధిస్తుంటార‌నిఅయితే ఇప్పుడు ఈ భాగ‌స్వామ్యం నిర్దిష్ట అర్థం మార్చుకుంటున్న‌ద‌ని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. “ఇప్పుడు ప్రైవేటు రంగ‌మే దేశ ఆర్థ‌క వ్య‌వ‌స్థ‌కు చోద‌క స్థానంలో ఉందివ్య‌వ‌సాయ‌త‌యారీసేవా రంగాల‌కు గ‌ణ‌నీయంగా దోహ‌ద‌ప‌డుతోందిఈ కొత్త సైనిక పాఠ‌శాల‌ల ద్వారా ప్రైవేటుప్ర‌భుత్వ రంగాలు ఏక‌తాటి మీద‌కు వ‌చ్చి మ‌న భావి త‌రాల‌కు ఉత్త‌మ విద్య‌ను అందిస్తాయి” అని ఆయ‌న అన్నారు.

 

దేశాభివృద్ధికి విద్య అత్యంత ప్రాథ‌మిక అంశ‌మ‌ని ర‌క్ష‌ణ మంత్రి పేర్కొన్నారుపిల్ల‌ల శారీర‌క‌మానసిక‌సామాజిక అభివృద్ధికి భ‌రోసా క‌ల్పిస్తూ దృఢ‌మైన భావిత‌రాన్ని త‌యారు చేయ‌డంలో సైనిక పాఠ‌శాల‌లు చేస్తున్న కృషిని ఆయ‌న ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారుసైనిక పాఠ‌శాల‌లు కేవ‌లం విద్యా సంబంధ‌మైన జ్ఞానాన్ని అందించ‌డంతో పాటు పిల్ల‌ల్లో క్ర‌మ‌శిక్ష‌ విలువ‌ల‌నుదేశ‌భ‌క్తినీధైర్యాన్నీ నింపుతాయ‌ని ఆయ‌న పేర్కొన్నారువిద్యార్థుల స‌ర్వ‌తోముఖ వికాసం దేశాన్ని ముందుకు తీసుకెళ్ల‌డానికి వారిలో స్ఫూర్తిని నింపుతుంద‌ని ఆయ‌న అన్నారు.

ప్ర‌స్తుత ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఉపేంద్ర ద్వివేదినేవీ చీఫ్ అడ్మిర‌ల్ దినేశ్ కే త్రిపాఠిరేవాలోని సైనిక పాఠ‌శాల‌కు చెందిన పూర్వ విద్యార్థులేని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారుకేవ‌లం సాయుధ ద‌ళాలే కాకుండా విద్యార్థులు ఏ వృత్తినైనా ఎంచుకొని వారి మార్గంలో దేశానికి సేవ చేయవచ్చునని ఆయ‌న అన్నారువిద్యార్థులు వారి ల‌క్ష్యాల‌ను సాధించేందుకు శ్ర‌మించాల‌నిఎప్పుడూ ఆశ‌లు వ‌దులుకోవ‌ద్ద‌ని సూచించారు.
ఇప్ప‌టికే ఉన్న ప‌ద్ధ‌తిలో న‌డుస్తున్న 33 సైనిక పాఠ‌శాల‌లు కాకుండా భాగ‌స్వామ్య ప‌ద్ధ‌తిలో కొత్త‌గా 100 సైనిక పాఠ‌శాల‌లు ఏర్పాట‌వుతున్నాయిఈ కొత్త పాఠ‌శాల‌లు సంబంధిత విద్యా బోర్డుల‌కు అనుబంధంగా ఉండ‌టంతో పాటు సైనిక పాఠ‌శాల‌ల సోసైటీ ఆధ్వ‌ర్యంలో ప‌ని చేస్తాయిసొసైటీ నియ‌మ నిబంధ‌న‌లు పాటిస్తాయిఅనుబంధ విద్యాబోర్డుల బోధ‌నా ప్ర‌ణాళిక‌ను ఆచ‌రిస్తూనేఅద‌నంగా సైనిక పాఠ‌శాల‌కు సంబంధించిన బోధ‌నా ప్ర‌ణాళిక‌ (అకాడ‌మిక్ ప్ల‌స్ కరిక్యులం)ను కూడా విద్యార్థుల‌కు అందిస్తాయి.

ఈ బోధ‌నా ప్ర‌ణాళిక‌లో భాగంగా- స్త్రీపురుష స‌మాన‌త్వంప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాల‌పై చ‌ర్చ‌లునైపుణ్య శిక్ష‌ణ‌బోధ‌నేత‌ర కార్య‌క్ర‌మాలుస‌మాజసేవ‌శారీర‌క శిక్ష‌ణ‌ఎన్‌సీసీవిహారవిజ్ఞాన‌ యాత్ర‌లుస్ఫూర్తివంత‌మైన ప్ర‌సంగాలు వంటి విలువైన అంశాలు ఉంటాయిదేశ పురోగ‌తికి దోహ‌ద‌ప‌డేలా విద్యార్థుల స‌మ‌గ్రాభివృద్ధికి భ‌రోసా ఇవ్వ‌డ‌మే ఈ అకాడ‌మిక్ ప్ల‌స్ కరిక్యులం ల‌క్ష్యం.
జైపూర్‌లోని శ్రీ భ‌వానీ నికేత‌న్ ప‌బ్లిక్ స్కూల్‌లో కొత్త సైనిక పాఠ‌శాల‌ను ఏర్పాటు చేసేందుకు శ్రీ భ‌వానీ నికేత‌న్ శిక్షా స‌మితితో 2023 సెప్టెంబ‌ర్‌లో సైనిక పాఠ‌శాల‌ల సొసైటీర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ ఒప్పందం చేసుకున్నాయి.

రాజ‌స్థాన్ ఉప ముఖ్య‌మంత్రి శ్రీమ‌తి దియా కుమారియువ‌జ‌న వ్య‌వ‌హారాలుక్రీడాశాఖ మంత్రి క‌ల్న‌ల్ రాజ్య‌వ‌ర్ధ‌న్ రాథోడ్‌ (విశ్రాంత‌త‌దిత‌ర ప్ర‌ముఖులు జైపూర్ సైనిక పాఠ‌శాల ప్రారంభోత్స‌వంలో పాల్గొన్నారు.

 

****



(Release ID: 2058064) Visitor Counter : 22