ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

మనీలాండరింగ్, ఉగ్రవాదులకు నిధులు వంటి అక్రమ ఆర్థిక కార్యకలాపాలను అరికట్టడంలో భారత్ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్)


భారత్ ను అత్యున్నత రేటింగ్ కేటగిరీ అయిన
'రెగ్యులర్ ఫాలో-అప్'లో ఉంచిన ఎఫ్ఎటి ఎఫ్

Posted On: 19 SEP 2024 7:06PM by PIB Hyderabad

మనీ లాండరింగ్ఉగ్రవాానికి ఆర్థిక తోడ్పాటు (టెర్రిరిజం ఫైనాన్సింగ్) వంటి అక్రమ ఆర్థిక కార్యకలాపాలను అరికట్టడానికి భారతదేశం అమలు చేస్తున్న చర్యలను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్ప్రశంసించిందిమనీ లాండరింగ్ఉగ్రవాదానికి ఆర్థిక తోడ్పాటుకు వ్యతిరేకంగా తాను అందిస్తున్న సిఫార్సులకు అనుగుణంగా- సాంకేతికపరంగా చర్యలు తీసుకోవడంలో భారతదేశం ఉన్నత స్థాయిని అందుకుందని ఎఫ్ఎటిఎఫ్ పేర్కొందిచట్టవిరుద్ధ ఆర్థిక కార్యకలాపాలను ఎదుర్కొనే చర్యలను అమలు చేయడంలో భారతదేశం కీలకమైన అడుగులు వేసిందని ‘మానీ లాండరింగ్తీవ్రవాదానికి ఆర్థిక తోడ్పాటు నిరోధక ఆర్థిక చర్యలు’ పేరుతో భారతదేశంపై ఇచ్చిన మ్యూచువల్ ఇవాల్యుయేషన్ నివేదిక (ఎంఈఆర్)లో ఎఫ్ఎటిఎఫ్ పేర్కొన్నది.

మనీలాండరింగ్ కు ఉగ్రవాదానికి ఆర్థిక తోడ్పాటు అందించడానికి వ్యతిరేకంగా భారత్ అమలు చేసిన కార్యాచరణ మంచి ఫలితాలను సాధిస్తోందని ఎఫ్ఎటిఎఫ్ఎపిజిఇఎజిల ఉమ్మడి అంచనా నిర్ధారించింది.  అధికారులు ఆర్థిక సంబంధమైన నిఘా సమాచారాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారుదేశీయంగాఅంతర్జాతీయంగా సమర్థవంతంగా సహకరిస్తున్నారు.

ఈ మదింపు తరువాతఎఫ్ఎటిఎఫ్ అత్యధిక రేటింగ్ కేటగిరీ అయిన "రెగ్యులర్ ఫాలో-అప్లో భారతదేశాన్ని ఉంచిందిభారత్ కాకుండా ఇతర జి -20 దేశాలైన బ్రిటన్ఫ్రాన్స్ఇటలీ మాత్రమే ఈ జాబితాలో ఉన్నాయి.

బ్యాంకు ఖాతాదారులను పెంచడండిజిటల్ చెల్లింపు వ్యవస్థలపై ఎక్కువగా ఆధారపడటాన్ని ప్రోత్సహించడం కంటేఆర్థిక సమ్మిళితపరంగా భారతదేశం గణనీయమైన చర్యలు తీసుకుందని నివేదిక ప్రముఖంగా పేర్కొందిఈ ప్రయత్నాలు ఆర్థిక పారదర్శకతను పెంచడంతో పాటుఎఎమ్ఎల్సిఎఫ్టి ప్రయత్నాలకు దోహదం చేశాయి

భారతీయ వ్యవస్థ పరిమాణంసంస్థాగత సంక్లిష్టతలతో నిమిత్తం లేకుండాఆర్థిక నిఘా వ్యవస్థల సహకారంతో భారత అధికారులుఅక్రమ ఆర్థిక కార్యకలాపాల నియంత్రణకు సమర్థవంతంగా చర్యలు తీసుకుంటూసమన్వయంతో పని చేస్తున్నారు.

అంతర్జాతీయ సహకారాన్ని పొందడం ద్వారా భారతదేశంఅక్రమంగా తరలిపోయిన సంపదను కూడా తిరిగి స్వాధీనం చేసుకుంటున్నదనిచట్టవిరుద్ధ మార్గాల్లో డబ్బు తరలిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నదని పేర్కొంది.

ఆర్థిక రంగంలోముఖ్యంగా వాణిజ్య బ్యాంకుల్లో ఎదురయ్యే ప్రతికూలతలువాటిని నివారించే చర్యల అమలుపై కూడా బ్యాంకులకు సరైన అవగాహన ఉందని తెలిపింది.

మనీ లాండరింగ్ఉగ్రవాదానికి ఆర్థిక తోడ్పాటుఆర్థిక తోడ్పాటు వంటి అంశాల్లో భారతీయ అధికారులకు చక్కటి అవగాహన ఉందని అభినందించిందిఆర్థిక నేరాల వల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి వారికి తెలుసుననిఅయితే ఆయా ప్రమాదాల గురించి సంబంధిత వర్గాలన్నింటితో సమాచారాన్ని పంచుకోవాల్సింది ఎంతో ఉందని అన్నది.

భారతదేశం తీవ్రవాద సమస్యను ఎదుర్కొంటున్నదనీఅలాగే తీవ్రవాదానికి ఆర్థిక తోడ్పాటు సమస్యను కూడా ఎదుర్కొంటున్నదనీఐఎస్ఐఎల్ లేదా అల్ ఖైదా వంటి సమస్యలు కూడా ఉన్నాయని నివేదిక తెలిపిందిచాలా సంక్షిష్టమైన ఆర్థిక దర్యాప్తులను కూడా నిర్వహించిందనీఅయితే విచారణలను సత్వరమే పూర్తి చేసినిందితులకు శిక్షలు విధించాల్సి ఉందని వ్యాఖ్యానించింది.

ఉగ్రవాదులకు నిధులు అందించడానికి లాభాపేక్షలేని సంస్థలను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి ఉద్దేశించిన చర్యలను హానికరమనే దృష్టితో అమలు చేయాలనిఉగ్రవాదులకు నిధులు అందిస్తే కలిగే అనర్థాల గురించి ఆ సంస్థలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సూచించింది.


 

రాజకీయ ప్రముఖులులేదా రాజకీయాలతో సంబంధం ఉన్న అధికారుల వంటి వారి విషయంలోఆర్థిక సంస్థలు అనేక చర్యలు తీసుకుంటున్నాసాంకేతిక నిబంధనలను పూర్తిగా అమలు చేయాలన్న దృక్కోణంలో కొన్ని సంస్థలకు మినహాయింపులు ఉన్నాయిఆయా సంస్థలు పూర్తిగా నిబంధనలు పాటిస్తున్నట్లు సమాచారాన్ని అందించేలా చూడాల్సి ఉందిఆర్థికేతర వ్యవస్థలూక్లయింట్ల తరఫున పరోక్ష సంపదను నిర్వహించేవారూఆయా రంగాలపై నిఘా ఉంచడం విషయంలో భారతదేశం ఇంకా ప్రాథమిక దశలోనే ఉందివిలువైన లోహాలుజెమ్స్ రంగంలోని డీలర్లపై డబ్బుపరంగా ఆంక్షలు విధించాల్సిన అవసరం కూడా ఉంది.

 

***



(Release ID: 2056970) Visitor Counter : 27