ప్రధాన మంత్రి కార్యాలయం

ఓణం పండుగ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు

Posted On: 15 SEP 2024 8:36AM by PIB Hyderabad

   ఓణం పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా పంపిన సందేశంలో:

‘‘ఓణం పండుగ శుభ సందర్భంలో ప్రజలందరికీ శుభాకాంక్షలు. దేశమంతటా శాంతి, సౌభాగ్యం, శ్రేయస్సు పొంగిపొర్లాలని ఆకాంక్షిస్తున్నాను. కేరళ రాష్ట్ర ఉజ్వల సంస్కృతిని ఈ పర్వదినం ప్రతిబింబిస్తుంది. ప్రపంచమంతటా విస్తరించిన మలయాళ సమాజంలో పెల్లుబికే ఆనందోత్సాహలకు ఈ పండుగ ఓ ప్రతీక’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

“ഏവർക്കും സന്തോഷകരമായ ഓണം ആശംസിക്കുന്നു. എങ്ങും സമാധാനവും സമൃദ്ധിയും ക്ഷേമവും ഉണ്ടാകട്ടെ. കേരളത്തിന്റെ മഹത്തായ സംസ്ക്കാരം ആഘോഷിക്കുന്ന ഈ ഉത്സവം ലോകമെമ്പാടുമുള്ള മലയാളി സമൂഹം ആവേശത്തോടെ ആഘോഷിക്കുന്നു.”

 

 

 

***

MJPS/TS



(Release ID: 2055101) Visitor Counter : 6