ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారతదేశంలో ఔషధాలకు లొంగని టీబీకి సరికొత్త చికిత్స

నూతన చికిత్స విధానం స్వల్పకాలికం, మరింత సమర్థవంతం

కొత్త చికిత్స ప్రారంభానికి ఆమోదం తెలిపిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

BPaLM చికిత్సలో బెడాక్విలిన్, ప్రీటోమానిడ్, లైనిజోలిడ్, మోక్సిఫ్లోక్సాసిన్ కాంబినేషన్

ఈ నాలుగు ఔషధాల ఉపయోగం సురక్షితం, మరింత ప్రభావవంతం

మునుపటి ఎండీఆర్ -టీబీ చికిత్సా విధానం కంటే వేగవంతమైనది

భారతదేశంలో టీబీ నిర్మూలన లక్ష్య సాధనలో

దేశ పురోగతికి ఊతమివ్వనున్న కేంద్ర ప్రభుత్వ చర్యలు

Posted On: 06 SEP 2024 3:14PM by PIB Hyderabad

2025 నాటికి దేశంలో టీబీని పూర్తిగా నిర్మూలించాలనే గౌరవ ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగాసుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశలో ప్రపంచ లక్ష్యానికి అయిదు సంవత్సరాల ముందే ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి భారత్ కృషి చేస్తుందిదీని కోసం కేంద్ర ఆరోగ్యకుటుంబ మంత్రిత్వశాఖ కొత్త చికిత్సా విధానానికి ఆమోదం తెలిపిందిబహుళ ఔషధాలకు లొంగని క్షయ (ఎండీఆర్-టీబీకోసం జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమం (ఎన్‌టీఈపీఆధ్వర్యంలో సరికొత్త చికిత్సా విధానం బీపాల్మ్ (BPaLM) ప్రారంభానికి ఆమోదం లభించిందిఈ చికిత్సా విధానం అత్యంత ప్రభావవంతమైనది అలాగే స్వల్పకాలిక చికిత్సఈ చికిత్సలో క్షయ వ్యాధిని నయం చేయడం కోసం ప్రిటోమానిడ్‌కు బెడాక్విలిన్ లైనిజోలిడ్ (మోక్సిఫ్లోక్సాసిన్‌తో/లేకుండాఔషధం ఉపయోగిస్తారుప్రీటోమానిడ్ గతంలోనే కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓద్వారా భారతదేశంలో ఉపయోగం కోసం ఆమోదాన్ని పొందింది.


 

బీపాల్మ్ చికిత్స బెడాక్విలిన్ప్రీటోమానిడ్లైన్‌జోలిడ్ అలాగే మోక్సిఫ్లోక్సాసిన్ అనే నాలుగు-ఔషధ కలయికమునుపటి చికిత్సా విధానం కంటే సురక్షితమైనదిమరింత ప్రభావవంతమైనదిఅలాగే వేగవంతమైన చికిత్సా విధానంగా ఈ కొత్త పద్ధతి నిరూపణ అయిందిసంప్రదాయ ఎండీఆర్ టీబీ చికిత్స తీవ్రమైన దుష్ప్రభావాలతో 20 నెలల వరకు కొనసాగుతుందిఅయితే ఈ కొత్త చికిత్సా విధానం అధిక విజయవంతమైన రేటుతో కేవలం ఆరు నెలల్లోనే ఔషధాలకు లొంగని టీబీని నయం చేస్తుందిభారతదేశంలో ఔషధాలకు లొంగని టీబీతో బాధపడుతున్న 75,000 మంది రోగులకు ఈ స్వల్పకాలిక చికిత్స ప్రయోజనకరంగా ఉంటుందిఇతర ప్రయోజనాలతో పాటుఖర్చు కూడా ఆదా అవుతుంది.

ఆరోగ్య పరిశోధనా విభాగంతో సంప్రదించిదేశంలోని విషయ నిపుణుల ఆధారాలను సమీక్షించి కేంద్ర ఆరోగ్యంకుటుంబ సంక్షేమ శాఖ ఈ కొత్త టీబీ చికిత్సా విధానాన్ని నిర్ధారించిందిఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ ఆరోగ్య పరిశోధన విభాగం ద్వారా ఆరోగ్య సాంకేతిక పరీక్షలను నిర్వహించి మొండి క్షయ చికిత్స కోసం సురక్షితమైనసరసమైన ఎంపిక అని నిర్ధారించింది.

దేశంలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్య సాధనలో దేశ పురోగతికి ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు ఊతమిచ్చాయిరాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదించి ఆరోగ్యంకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ టీబీ విభాగం ద్వారా బీపాల్మ్ చికిత్సతో నిర్ధిష్ట కాలపరిమితిలో దేశ-వ్యాప్తంగా క్షయ నిర్మూలనకు ప్రణాళికను సిద్ధం చేస్తోందిదానిలో భాగంగా నూతన చికిత్సా విధానాన్ని సురక్షితంగా అమలు చేయడానికి వీలుగా ఆరోగ్య నిపుణుల సామర్థ్యాలను పెంపొందించేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నారు.


 


 

నేపథ్యం:

మునుపటి రివైజ్డ్ నేషనల్ ట్యుబర్‌క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ (ఆర్ఎన్‌టీసీపీఅయిన ప్రస్తుత జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం (ఎన్‌టీఈపీసుస్థిర అభివృద్ధి లక్ష్యం కంటే ఐదేళ్ల ముందే అంటే 2025 నాటికి భారతదేశంలో టీబీని వ్యూహాత్మకంగా తగ్గించే లక్ష్యంతో పనిచేస్తున్నది. 2018 మార్చిలో ఢిల్లీలో జరిగిన ఎండ్ టీబీ సదస్సులో మొదటిసారిగా ప్రధాన మంత్రి మోదీ ఈ దార్శనికతను వ్యక్తం చేశారు. 2025 నాటికి భారతదేశంలో టీబీని పూర్తిగా నిర్మూలించాలనే భారత ప్రభుత్వ లక్ష్యాన్ని స్పష్టం చేయడం కోసం 2020లో ఆర్ఎన్‌టీపీసీనిజాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమం (ఎన్‌టీఈపీ)గా మార్చారుఇది 632 జిల్లాలు/రిపోర్టింగ్ యూనిట్లలోని వంద కోట్ల మందికి చేరువైందిఅలాగే టీబీ నిర్మూలన కోసం రాష్ట్రాలు/కేంద్రపాలిక ప్రాంతాలతో కలిసి భారత ప్రభుత్వం అయిదు సంవత్సరాల జాతీయ వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేసే బాధ్యతను నిర్వరిస్తున్నది.


 

మిషన్ మోడ్‌లో 2025 నాటికి టీబీని అంతం చేసే లక్ష్యాన్ని సాధించడానికి టీబీ నిర్మూలన కోసం జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక ప్రారంభం అయిందిఇది బహుముఖ విధానంఇది ప్రైవేట్ వైద్యుల వద్ద చికిత్స తీసుకునే టీబీ రోగులను గుర్తించడంటీబీ నిర్ధారణ జరగని అధిక ముప్పు గల ప్రజలలో టీబీని గుర్తించే లక్ష్యంతో పనిచేస్తుందిరోగనిర్ధారణ జరిగిన ప్రతి టీబీ రోగికి చికిత్స ప్రారంభించే ముందే లేదా చికిత్స సమయంలోనే ఔషధాలకు లొంగని లక్షణాన్ని నిరోధించేందుకు ఎన్‌టీఈపీ ఆధ్వర్యంలో యూనివర్సల్ డ్రగ్ ససెప్టబిలిటీ పరీక్ష (యూడీఎస్‌టీనిర్వహిస్తారు.

2022, సెప్టెంబర్ 9న ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ (పీఎమ్‌టీబీఎమ్‌బీఏ)ను గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రారంభించారుఈ కార్యక్రమం ద్వారా జన్ భాగీదారి స్ఫూర్తితో యుద్ధ ప్రాతిపదికన టీబీ నిర్మూలనకు పౌరులు సమష్టిగా కృషి చేయాలని కోరారుటీబీ చికిత్స తీసుకునే వారికి రోగనిర్ధారణపోషకాహారం అలాగే ఉపాధి పరంగా అదనపు సహాయాన్ని అందించడానికి రాష్ట్రపతి ‘‘ని-క్షయ్ (Ni-kshay) మిత్ర’’ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారురోగులు పూర్తిగా కోలుకోవడంలో సహాయం చేయడానికి ఎన్నికైన ప్రతినిధులుకార్పొరేట్లుఎన్‌జీఓలు అలాగే ప్రజలు దాతలుగా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.

ని-క్షయ్ (Ni-kshay) 2.0 పోర్టల్ (https://communitysupport.nikshay.in/టీబీ రోగుల చికిత్స ఫలితాన్ని మెరుగుపరిచేందుకూఅదనపు సాయం అందించేందుకూ ఉపయోగపడుతుంది. 2025 నాటికి టీబీ నిర్మూలన పట్ల భారతదేశ నిబద్ధతకు అనుగుణంగా సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందిస్తుందిఅలాగే దీనికోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత అవకాశాలను ఉపయోగించుకుంటుంది.

భారతదేశం 7,767 వేగవంతమైన మాలిక్యులర్ టెస్టింగ్ సదుపాయాలుఅలాగే 87 కల్చర్ అండ్ డ్రగ్ ససెప్టబిలిటీ టెస్టింగ్ లేబొరేటరీలతో ప్రపంచంలోనే అతిపెద్ద టీబీ లేబొరేటరీ నెట్‌వర్క్‌ను కలిగి ఉందిఈ విస్తృత లేబొరేటరీల నెట్‌వర్క్ ఎ:డీఆర్ టీబీని సకాలంలో గుర్తించడంలోఅలాగే టీబీ చికిత్సను త్వరగా ప్రారంభించడంలో తోడ్పడుతుంది.

 

***



(Release ID: 2052697) Visitor Counter : 56