ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

31, 1 తేదీల్లో ఉపరాష్ట్రపతి ఉత్తరాఖండ్ పర్యటన

శాస్త్రవేత్తలు,అధ్యాపక బృందం, విద్యార్థులతో డెహ్రాడూన్ లోని సిఎస్ఐఆర్-ఐఐపి లో సమావేశం

డెహ్రాడూన్ లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజి సందర్శన

రుషికేశ్ లోని ఎఐఐఎమ్ఎస్ కూ

Posted On: 30 AUG 2024 10:47AM by PIB Hyderabad

ఉపరాష్ట్రపతి శ్రీ జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఆగస్టు 31 - సెప్టెంబరు 1 తేదీల్లో ఉత్తరాఖండ్ ను సందర్శించనున్నారు.

శ్రీ జగ్‌దీప్ ధన్‌ఖడ్ తన పర్యటనలో భాగంగా శాస్త్రవేత్తలు, అధ్యాపక బృందం, విద్యార్థులతో డెహ్రాడూన్ లోని సిఎస్ఐఆర్ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియమ్‌ లో జరిగే సమావేశంలో పాలుపంచుకోనున్నారు.

శ్రీ జగ్‌దీప్ ధన్‌ఖడ్ తన పర్యటన రెండో రోజున, డెహ్రాడూన్ లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజిని సందర్శిస్తారు. అలాగే రుషికేశ్ లోని ఎఐఐఎమ్ఎస్  కూడా ఉపరాష్ట్రపతి సందర్శించి, ఆ సంస్థ అధ్యాపక బృందం, విద్యార్థులతోను జరిగే సమావేశంలో పాల్గొంటారు.



(Release ID: 2050149) Visitor Counter : 18