హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

శ్రీ అమర్నాథ్ యాత్రను విజయవంతంగా నిర్వహించినందుకు భద్రతా బలగాలను, శ్రీ అమర్నాథ్ జీ ఆలయ బోర్డును, జమ్ము కాశ్మీర్ పాలనా యంత్రాంగాన్నీ, స్వచ్ఛంద సేవా సంస్థలనీ అభినందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా


అమర్ నాథ్ యాత్రను సురక్షితంగా, సజావుగా నిర్వహించేందుకు అందరూ తమ వంతు ప్రత్యేక కృషి చేశారు.: కేంద్ర హోంమంత్రి

ఈ ఏడాది 52 రోజుల పాటు సాగిన అమర్ నాథ్ యాత్ర సందర్బంగా 5.12 లక్షల మందికిపైగా యాత్రికులు పవిత్ర అమర్నాథ్ గుహను దర్శించుకున్నారు. గత 12 సంవత్సరాలలో ఇంత పెద్ద సంఖ్యలో జనం అమర్ నాథ్ గుహను దర్శించడం ఇదే ప్రథమం.

प्रविष्टि तिथि: 21 AUG 2024 8:16PM by PIB Hyderabad

శ్రీ  అమర్నాథ్ యాత్రను విజయవంతంగా  నిర్వహించినందకు భద్రతా బలగాలను, శ్రీ అమర్నాథ్ జీ ఆలయ బోర్డును, జమ్ము కాశ్మీర్ పాలనా యంత్రాంగాన్నీ, స్వచ్ఛంద సేవా సంస్థలనీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు.

ఇందుకు సంబంధించి శ్రీ అమిత్ షా సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ఒక సందేశమిస్తూ, అమర్ నాథ్ యాత్ర విజయంతంగా ముగిసిందన్నారు. ఈ ఏడాది 52 రోజులపాటు సాగిన పవిత్ర అమర్నాథ్ యాత్ర సందర్భంగా 5.12 లక్షల మంది యాత్రికులు పవిత్ర అమర్నాథ్ గుహ ఆలయాన్ని సందర్శించారన్నారు. గత 12 సంవత్సరాలలో మున్నెన్నడూ లేనంత గరిష్ఠ స్థాయిలో ఈ ఏడాది ప్రజలు అమర్నాథ్ గుహను సందర్శించారని పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రను విజయవంతం చేసినందుకు- భద్రతా సిబ్బందినీ, శ్రీ అమర్నాథ్ ఆలయ బోర్డునీ, జమ్ము కాశ్మీర్ పాలనా యంత్రాంగాన్నీ, స్వచ్ఛంద సేవా సంస్థలనీ శ్రీ అమిత్ షా అభినందించారు. యాత్రికుల ప్రయాణం సురక్షితంగా, సజావుగా ఉండేలా అమర్నాథ్ యాత్రను నిర్వహించడంలో ప్రతిఒక్కరూ తమ వంతు ప్రత్యేక కృషి చేశారని ఆయన కొనియాడారు.. బాబా ఆశీస్సులు ప్రతి ఒక్కరికీ ఉండగలవన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. జై బాబా బర్ఫని!

***


(रिलीज़ आईडी: 2047874) आगंतुक पटल : 94
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Hindi_MP , Marathi , Gujarati , Kannada