ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

16,17 లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉపరాష్ట్రపతి పర్యటన


ఆంధ్రప్రదేశ్ లోని వెంకటాచలంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ 23వ వార్షికోత్సవ
వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొనున్న ఉపరాష్ట్రపతి

Posted On: 15 AUG 2024 11:46AM by PIB Hyderabad

ఉపరాష్ట్రపతి శ్రీ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ఆగస్టు 16,17 తేదీల్లో తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో పర్యటించనున్నారు. శ్రీ ధన్‌ఖడ్‌ ఆగస్టు 16న హైదరాబాద్‌లోని కన్హ శాంతి వనాన్ని సందర్శిస్తారు. ఆగష్టు 17న శ్రీ ధన్‌ఖడ్‌ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో అక్షర విద్యాలయ క్యాంపస్, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, స్వర్ణ భారత్ ట్రస్ట్, ముప్పవరపు ఫౌండేషన్‌లను సందర్శిస్తారు.
అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ 23వ వార్షికోత్సవ వేడుకలో శ్రీ ధన్‌ఖడ్‌ ముఖ్య అతిథిగా పాల్గొంటారు.



 

***



(Release ID: 2045624) Visitor Counter : 12


Read this release in: English , Urdu , Hindi , Tamil