బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విజన్ 2030, వికసిత్ భారత్ 2047 బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడం కోసం బొగ్గు తరలింపు మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేసిన బొగ్గు మంత్రిత్వ శాఖ

Posted On: 09 AUG 2024 3:14PM by PIB Hyderabad

దేశంలో బొగ్గు తరలింపు మౌలిక సదుపాయాలను పెంచే ఒక ముఖ్యమైన చర్యలో భాగంగా కీలకమైన రవాణా ప్రాజెక్టుల అభివృద్ధిని వేగంవతం చేసేందుకు ఉద్దేశించిన సమగ్ర వ్యూహాన్ని బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
వికసిత్ భారత్ 2047 ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడంలో కీలకమైన, ప్రధాన మంత్రి దార్శనికత అయిన "సమగ్ర ప్రణాళిక, సమన్వయంతో కాలపరిమితి అమలు"కు అనుగుణంగా దీన్ని తీసుకొచ్చారు.


దేశంలో ఇంధన అవసరాల్లో బొగ్గు కీలక పాత్రను గుర్తించిన మంత్రిత్వ శాఖ, ప్రస్తుతం సమర్థవంతమైన బొగ్గు రవాణాకు ఆటంకం కలిగించే పరిమితులను తొలగించటానికి లేదా తగ్గించడానికి కట్టుబడి ఉంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కాలానుగుణ పురోగతిపై ప్రభావం చూపే సమస్యలను పరిష్కరించడానికి.. రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ సంస్థలతో కలిసి బొగ్గు మంత్రిత్వ శాఖ పనిచేస్తోంది. ఈ సహకార విధానం వివిధ ప్రక్రియలను క్రమబద్ధీకరిస్తుందని, అభివృద్ధికి మరింత అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందిస్తుందని భావిస్తున్నారు.

బొగ్గు తరలింపు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యాలు-


లభ్యత: తగినంత బొగ్గు లోడింగ్, తరలింపు మౌలిక సదుపాయాలు

ఆప్టిమైజేషన్: రవాణా నెట్‌వర్క్ హేతుబద్ధీకరణ ద్వారా మొత్తం రవాణా ఖర్చు, లోడింగ్, రవాణాను ఆప్టిమైజేషన్ చేయటం

ఆధునికీకరణ: ఆధునికీకరించిన మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేధ, డ్రోన్లు, సెన్సర్లు, ఆవిష్కరణలతో కూడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం

సమగ్ర రవాణా: ఇంటర్‌కనెక్టెడ్ మల్టీమోడల్ నెట్‌వర్క్, హరిత రవాణను ప్రోత్సహించడం

సమర్ధత: ఉత్పత్తి కేంద్రాల నుంచి వినియోగదారులకు సకాలంలో, తక్కువ ఖర్చుతో బొగ్గును తరలించేలా చూడటానికి రవాణా వ్యవస్థలను మెరుగుపరచడం

సమ్మిళితం: భాగస్వాములందరి అవసరాలను తీర్చడం ద్వారా సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించడం

కీలక కార్యక్రమాలు-


* ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం: పెరుగుతోన్న ఉత్పత్తికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించటం ద్వారా 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 1.5 బిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని సాధించటం.


* రైలు రవాణా వాటా  పెంచటం: 2030 ఆర్థిక సంవత్సరం నాటికి బొగ్గు విషయంలో రైల్వే రవాణా వాటాను 64% నుంచి 75%కు పెంచటం, తద్వారా రహదారి రద్దీని తగ్గించి పర్యావరణ సుస్థిరతను పెంచటం.
రైల్వే మంత్రిత్వ శాఖతో సన్నిహిత సమన్వయంతో 38 ప్రాధాన్య రైలు ప్రాజెక్టులను మంత్రిత్వ శాఖ గుర్తించింది. వీటిని వేగంగా పూర్తి చేసేందుకు ఆ శాఖతో కలిసి పనిచేస్తోంది. ఈ ప్రాజెక్టులు రైలు అనుసంధానాన్ని మెరుగుపరచడానికి, దేశవ్యాప్తంగా విద్యుతుత్పత్తి కేంద్రాలు, పరిశ్రమలకు సకాలంలో బొగ్గు సరఫరాను చేయటానికి కీలకమైనవి.


* బొగ్గు నిర్వహణ సౌకర్యాల్లో తప్పనిసరి యంత్రీకరణ: సంవత్సరానికి 2 మిలియన్ టన్నుల(ఎంటీ) కంటే ఎక్కువ ఉత్పత్తి చేసే అన్ని పెద్ద బొగ్గు గనులు వచ్చే ఐదేళ్లలో బొగ్గు నిర్వహణ సౌకర్యాలను యంత్రీకరించాలి. నిర్వహణ భద్రత, సురక్షితమైన పని పరిస్థితులను కల్పించటం, బొగ్గు రవాణాలో పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్యను తీసుకుంటున్నారు.

* సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి : పీఎం గతి శక్తి కార్యక్రమం ద్వారా మల్టీ మోడల్ కనెక్టివిటీని పెంపొందించడం, నిరంతరాయంగా బొగ్గు తరలింపునకు  వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం చేసుకోవటం.


* సుస్థిరత, పర్యావరణ పరిగణనలు: బొగ్గు తరలింపులో పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడం, వాతావరణ పరంగా దేశ లక్ష్యాలకు అనుగుణంగా హరిత సాంకేతికతలు, పద్ధతులను అవలంబించడంపై మంత్రిత్వ శాఖ దృష్టి పెడుతోంది.


వీటి ద్వారా ఆశిస్తోన్న ఫలితాలు


వ్యూహాత్మక ప్రణాళిక, అమలు ద్వారా దేశ బొగ్గు రంగాన్ని మార్చడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ అంకితభావంతో పనిచేస్తోంది. మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడం ద్వారా, భాగస్వాముల మధ్య సహకారాన్ని పెంపొందించడం ద్వారా.. సుస్థిర బొగ్గు ఉత్పత్తి, రవాణాలో దేశాన్ని అగ్రగామిగా ఉంచాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.  2047 నాటికి సంపన్న, అభివృద్ధి చెందినది మన దేశం మారేందుకు మార్గం సుగమం చేయనుంది. 

***


(Release ID: 2044193)