రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

ఆగస్టు 2వ, 3వ తేదీల్లో రాష్ట్రపతి భవన్ లో జరుగనున్న గవర్నర్ల రెండు రోజుల సమావేశానికి అధ్యక్షత వహించనున్న భారత రాష్ట్రపతి

Posted On: 30 JUL 2024 5:52PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము 2024 ఆగస్టు 2వ3వ తేదీలలో రాష్ట్రపతి భవన్ లో జరుగనున్న గవర్నర్ల సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.  ఈ సమావేశం రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము అధ్యక్షత వహించనున్న గవర్నర్ల తొలి సమావేశం  కానుంది.

 

 

ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల గవర్నర్లు పాల్గొననున్నారు.  ఈ సమావేశంలో ఉప రాష్ట్రపతిప్రధాన మంత్రికేంద్ర హోం శాఖ, వ్యవసాయం-రైతుల సంక్షేమ శాఖ మంత్రి, విద్య శాఖ మంత్రి, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి. సమాచార-ప్రసార శాఖ మంత్రి, పర్యావరణంఅడవులు-వాతావరణ మార్పుయువజన వ్యవహారాలు-క్రీడలు శాఖ మంత్రి, నీతి ఆయోగ్ వైస్ చైర్ మన్నీతి ఆయోగ్ సిఇఒ లతో పాటు ప్రధాన మంత్రి కార్యాలయం, మంత్రివర్గ సచివాలయం, హోం మంత్రిత్వ శాఖ, ఇతర మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు కూడా పాల్గొననున్నారు.

 

 

సమావేశంలో చర్చించనున్న విషయాలలో నేర సంబంధి చట్టాలు మూడింటి అమలు,  ఉన్నత విద్యలో సంస్కరణలు- విశ్వవిద్యాలయాలకు ఆధికారిక గుర్తింపు, గిరిజన ప్రాంతాలు, ఆకాంక్షయుక్త జిల్లాలుబ్లాకులు మరియు సరిహద్దు ప్రాంతాల వంటి ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొంటున్న ప్రాంతాల అభివృద్ధి, మై భారత్’, ‘ఏక్ భారత్శ్రేష్ఠ భారత్’; ‘ఏక్ వృక్ష మా కే నామ్’ వంటి ప్రచార ఉద్యమాలలో గవర్నర్ల పాత్రతో పాటు ప్రాకృతిక వ్యవసాయంప్రజలతో సంబంధాలను పెంచుకోవడం, ప్రభుత్వ వివిధ కేంద్రీయ సంస్థల మధ్య మెరుగైన సమన్వయాన్ని నెలకొల్పడంలో గవర్నర్ల పాత్ర వంటివి భాగంగా ఉన్నాయి.  గవర్నర్లు అనేక బృందాలుగా విడివడి, ఈ విషయాలపై చర్చోపచర్చలు సాగించనున్నారు.  సమావేశం ముగింపు సదస్సులో, గవర్నర్ల బృందాలు వాటి ఆలోచనల సారంతో కూడిన నివేదనలను రాష్ట్రపతిఉపరాష్ట్రపతిప్రధాన మంత్రి తదితర ప్రముఖుల సమక్షంలో ప్రతిపాదించనున్నాయి. 

 

 

 

***


(Release ID: 2039559)