గనుల మంత్రిత్వ శాఖ

హైదరాబాద్‌లో ఖనిజాన్వేషణ హ్యాకథాన్ సహా నేషనల్ డిఎంఎఫ్ పోర్టల్‌కు కేంద్ర బొగ్గు-గనులశాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి శ్రీకారం


దేశం 2047కల్లా ‘వికసిత భారత్’గా రూపొందడంలో ఖనిజాల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి

Posted On: 20 JUL 2024 4:47PM by PIB Hyderabad

   నిజాన్వేషణలో వినూత్న పద్ధతులపై దృష్టి సారించడంలో భాగంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఖనిజాన్వేషణ హ్యాకథాన్‌ను కేంద్ర బొగ్గు-గనులశాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఇవాళ  ప్రారంభించారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హా సహా గనులశాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వాధికారులు, ప్రభుత్వ సంస్థల-పరిశ్రమల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

   భూ-భౌతిక సమాచార సేకరణ, వివిధ ఖనిజాల అన్వేషణ ద్వారా సేకరించిన సమాచార సమాహారం సమన్వయంలో కృత్రిమ మేధ (ఎఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) వంటి వర్ధమాన సాంకేతికతల వినియోగాన్ని ప్రోత్సహించడం ఈ హ్యాకథాన్ నిర్వహణ ధ్యేయం. కొత్త ఖనిజ లక్ష్యాల గుర్తింపు, ప్రాథమిక సమాచారం, ఇప్పటికే అందుబాటులోగల అన్వేషణ సమాచారం కూడా ఈ సమాహారంలో భాగంగా ఉంటాయి. ముఖ్యంగా భూమి లోతుల్లో దాగిన/అంతర్భాగంగా మారిపోయిన ఖనిజ నిక్షేపాల కోసం గాలించడంలో వినూత్న సాంకేతికతల దిశగా కొత్త ఆలోచనలకు ఇది రూపమిస్తుంది.

   ఈ కార్యక్రమంలో భాగంగా ‘‘గ్లింప్స్ ఆఫ్ జియాలజీ అండ్ మినరల్ రిసోర్సెస్, తెలంగాణ’’, ‘‘మినరల్స్ ఇన్ తెలంగాణ- స్పాట్‌లైట్స్‌’’ పుస్తకాలను కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక స్థానం, దాంతోపాటు రాష్ట్రంలో సంభావ్య ఖనిజ లభ్యతపై ప్రధానంగా దృష్టి సారిస్తూ ఈ రచనలు వెలువడ్డాయి.

   ఈ సందర్భంగా కీలక-వ్యూహాత్మక ఖనిజ క్షేత్రాల 2వ, 3వ విడత ఇ-వేలంలో భాగంగా ఎంపిక చేసిన 8 మంది బిడ్డర్లకు మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ధ్రువీకరణ పత్రాలను ప్రదానం చేశారు. ఈ మేరకు 2, 3 విడతల కింద విజయవంతంగా వేలం వేసిన క్షేత్రాల వివరాలు కింది విధంగా ఉన్నాయి:

                  2024 ఫిబ్రవరి 29నాటి ఎన్ఐటి ప్రకారం రెండో విడత వివరాలు

వ.

సం.

క్షేత్రం పేరు

రాష్ట్రం

జిల్లా

ఎంల్/

సిఎల్

ఎంపికైన బిడ్డర్

1.

గోలీఘట్ గ్రాఫైట్, వెనాడియం క్షేత్రాలు

మధ్యప్రదేశ్

బేతుల్

ఎంఎల్

శాంతి జిడి ఇస్పాత్ అండ్ పవర్ ప్రైవేట్‌ లిమిటెడ్

2.

గొల్లరహట్టి-మల్లెనహళ్లి నికెల్, క్రోమియం, పిజిఇ క్షేత్రాలు

కర్ణాటక

హసన్

సిఎల్

వేదాంత లిమిటెడ్

3.

బహెరా- గోరియారా గ్రాఫైట్, బేస్‌మెట‌ల్‌ క్షేత్రాలు

మధ్యప్రదేశ్

సిద్ధి

సిఎల్

విన్‌మిర్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్

4.

ఖత్తాలీ ఛోటీ గ్రాఫైట్ క్షేత్రం

మధ్యప్రదేశ్

అలీరాజ్‌పూర్

సిఎల్

కోల్ ఇండియా లిమిటెడ్

 

                  2024 మార్చి 14నాటి ఎన్ఐటి ప్రకారం మూడో విడత వివరాలు

వ.

సం.

క్షేత్రం పేరు

రాష్ట్రం

జిల్లా

ఎంల్/

సిఎల్

ఎంపికైన బిడ్డర్

1.

పిప్రది-భుర్వా గ్లాకోనైట్ క్షేత్రం

బీహార్

రోహ్‌తాస్‌

సిఎల్

రుంగ్తా సన్స్ ప్రైవేట్‌ లిమిటెడ్

2.

కుర్చా గ్లాకోనైట్ క్షేత్రం

ఉత్తరప్రదేశ్

సోన్‌భ‌ద్ర‌

సిఎల్

శోభా మినరల్స్

3.

చుటియా-నౌహట్టా గ్లాకోనైట్ క్షేత్రం

బీహార్

రోహ్‌తాస్‌

సిఎల్

రుంగ్తా సన్స్ ప్రైవేట్‌ లిమిటెడ్

4.

జెంజనా నికెల్, క్రోమియం, పిజిఇ క్షేత్రం

బీహార్

గ‌య‌

సిఎల్

వేదాంత లిమిటెడ్

             

ఈ కార్యక్రమంలో భాగంగా నేషనల్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (ఎన్‌డిఎంఎఫ్‌) పోర్టల్‌ను కూడా శ్రీ జి.కిషన్ రెడ్డి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా జిల్లా ఖనిజాభివృద్ధి సంస్థల సమాచార సేకరణ ఈ పోర్టల్ ఒక కేంద్రీకృత వేదికగా ఉపయోగపడుతుంది. ఈ మేరకు ‘డిఎంఎఫ్’ సమాచార సౌలభ్యంతోపాటు  దానికింద అభివృద్ధి-వినియోగాలను అనుసరించడం ఈ పోర్టల్‌ ప్రారంభంలో ప్రధానోద్దేశం. దీనిద్వారా మరింత మెరుగైన పారదర్శకతతో దేశంలోని 645 ‘డిఎంఎఫ్’ల వివరాలను మన ముందుంచుతుంది. అలాగే కార్యకలాపాలన్నీ ఒకే వేదికపై కనిపిస్తాయి కాబట్టి- ప్రాజెక్టుల పర్యవేక్షణ, గతిశీల విశ్లేషణలు, ప్రభావశీల అమలు వగైరాల సంబంధిత అత్యుత్తమ విధానాల భాండాగారంగానూ ఇది ఉపయోగపడుతుంది.

   ఈ కార్యక్రమం అనంతరం 2024 జూన్ 24నాటి ఎన్ఐటి ప్రకారం కీలక-వ్యూహాత్మక ఖనిజ క్షేత్రాల నాలుగో విడత ఇ-వేలం సంబంధిత రోడ్ షో నిర్వహించారు. ఇ-వేలం ప్రక్రియలో పరిశ్రమల భాగస్వామ్యం పెంచడం, సంభావ్య బిడ్డర్‌ల పరిచయం లక్ష్యంగా ఈ రోడ్‌ షోను గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఇందులో భాగంగా లావాదేవీల సలహాదారు ఎస్‌బిఐ కేపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ ద్వారా ఇ-వేలం ప్రక్రియ సంబంధిత వివరణాత్మక ప్రదర్శన ఉంటుంది. అలాగే ఇ-వేలం పోర్టల్ నిర్వాహక సంస్థ ఎంఎస్‌టిసి ద్వారా ఇ-వేలం వేదిక వినియోగం సంబంధిత మార్గదర్శకాలతోపాటు  ఖనిజాన్వేషణ-సంప్రదింపుల సాంకేతిక సలహాదారు సంస్థ ద్వారా 21 కీలక-వ్యూహాత్మక ఖనిజ క్షేత్రాల సాంకేతిక వివరాలు కూడా తెలుసుకోవచ్చు.

***



(Release ID: 2034680) Visitor Counter : 72