భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

'అమ్మ పేరిట ఒక మొక్క' (ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌) ప్రచారంలో భాగంగా మొక్క నాటిన కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ

Posted On: 03 JUL 2024 1:44PM by PIB Hyderabad

'అమ్మ పేరిట ఒక మొక్క' నాటమంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన  "ఏక్ పేడ్‌ మా కే నామ్" ప్రత్యేక ప్రచారంలో భాగంగా, కేంద్ర ఉక్కు & భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ ఒక మొక్క నాటారు.

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలంతా చెట్లు పెంచేలా ప్రోత్సహించేందుకు "అమ్మ పేరుతో ఒక మొక్క" పేరిట ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి, మన పరిసరాలను పచ్చగా మార్చడానికి ఈ చిన్న చర్య సాయపడుతుందని అన్నారు.

 

     

 

దేశంలోని ప్రతి ఒక్కరు ఈ ప్రచారానికి సహకరించాలని, మొక్కలు నాటే దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకుని ఈ ప్రచారాన్ని పెద్ద ఉద్యమంగా మార్చాలని మంత్రి కోరారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వానికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కేంద్ర ఉక్కు & భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ ధన్యవాదాలు తెలిపారు.

 

*******



(Release ID: 2030403) Visitor Counter : 38