సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
మైక్రో, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రిగా శ్రీ జితన్ రామ్ మాంఝి, సహాయ మంత్రిగా సుశ్రీ శోభా కరంద్లాజే బాధ్యతల స్వీకారం
Posted On:
11 JUN 2024 2:38PM by PIB Hyderabad
కేంద్ర మైక్రో, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రిగా శ్రీ జితన్ రామ్ మాంఝి నేడు బాధ్యతలు స్వీకరించారు. 2014, 2015 సంవత్సరాల మధ్య కాలంలో ఆయన బిహార్ ముఖ్యమంత్రిగా పని చేశారు.
![](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0013V0C.jpg)
శ్రీమతి శోభా కరంద్లాజే కేంద్ర మైక్రో, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె గతంలో వ్యవసాయ, వ్యవసాయదారుల సంక్షేమ శాఖ సహాయమంత్రి; ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయమంత్రిగా కేంద్రంలో పని చేశారు.
![](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0024Y38.jpg)
బాధ్యతల స్వీకారం అనంతరం కేంద్ర మంత్రి శ్రీ జితన్ రామ్ మాంఝి మీడియాతో మాట్లాడుతూ విజన్ 2047, ఆత్మనిర్భర్ భారత్ ప్రయాణంలో తనను కూడా భాగస్వామిని చేసినందుకు గౌరవ ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రయత్నంలో ఎంఎస్ఎంఇ శాఖ కీలకంగా ఉంటుందని ఆయన అన్నారు.
ఎంఎస్ఎంఇ శాఖను స్వయం-సమృద్ధంగా తీర్చి దిద్ది జిడిపిలో పరిశ్రమల వాటా పెంచేందుకు తాను కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఎంఎస్ఎంఇలను సాధికారం చేయడంలో ఎలాంటి అలసత్వం వద్దని మంత్రులిద్దరూ మంత్రిత్వ శాఖ అధికారులను కోరారు.
***
(Release ID: 2024548)
Visitor Counter : 20