ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

'డిజిటల్ గవర్నెన్స్ కోసం యూఐ/యూఎక్స్ ద్వారా పవర్ ట్రాన్స్‌ఫర్మేషన్' అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించిన ఎంఇఐటివై


వెబ్‌సైట్‌లు/యాప్‌లను ఉపయోగించడంలో వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఇది మార్గదర్శకాలను రూపొందిస్తుంది

Posted On: 28 MAY 2024 5:25PM by PIB Hyderabad

ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఇఐటివై) వెబ్‌సైట్‌లు/పోర్టల్‌లు/అప్లికేషన్‌లను ఉపయోగించడంలో వినియోగదారుల అనుభవాన్ని పెంపొందించడానికి అలాగే మార్గదర్శకాలను సెటప్ చేయడానికి 28 మే 2024న ‘డిజిటల్ గవర్నెన్స్ కోసం యూఐ/యూఎక్స్‌ పవర్ ట్రాన్స్‌ఫర్మేషన్’పై జాతీయ వర్క్‌షాప్‌ను నిర్వహించింది.

 
image.png

డిజిటల్ ల్యాండ్‌స్కేప్ వేగంగా అభివృద్ధి చెందుతోంది మరియు వినియోగదారులు అప్లికేషన్‌లో సమస్యలు లేని మరియు స్పష్టమైన చర్యలను ఆశిస్తున్నారు. దీంతో  “డిజిటల్ గవర్నెన్స్ కోసం యూఐ/యూఎక్స్‌ ద్వారా పవర్ ట్రాన్స్‌ఫర్మేషన్” అనే అంశంపై నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌ వాటికి మార్గం చూపడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వర్క్‌షాప్ ప్రభుత్వం, పరిశ్రమలు, డిజైనర్లు, డెవలపర్‌లు మరియు ఇతర సంబంధిత ప్రాక్టీషనర్ల నుండి వాటాదారులను కలిసి పబ్లిక్ ఫేసింగ్ డిజిటల్ సేవలకు  సమర్థవంతమైన యూఎక్స్‌/యూఐని  ఏర్పాటు చేయడంలో ఉన్న అభ్యాసాలు మరియు సవాళ్లను చర్చించింది.

వర్క్‌షాప్‌లో విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు సాధారణ సేవా కేంద్రాల మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

ఉత్పత్తి రూపకల్పనలో సహజమైన మరియు దృశ్యమానంగా అద్భుతమైన వినియోగదారు అనుభవాన్ని (యూఎక్స్‌) మరియు వినియోగదారు ఇంటర్‌ఫేస్ (యూఐ) రూపొందించడంలో అత్యుత్తమ అభ్యాసాలు మరియు అసాధారణమైన నాయకత్వం మరియు అంకితభావాన్ని గుర్తించేందుకు గాను ఎంఈఏ  జాయింట్ సెక్రటరీ శ్రీ బ్రహ్మ కుమార్‌కు ప్రశంసా పత్రాన్ని అందించారు; అలాగే ఈ-మైగ్రేట్‌ కోసం ఎంఈఏ అండర్‌ సెక్రటరీ ఎంఎస్ వల్లరి గైక్వాడ్,  టీ-యాప్‌ ఫోలియోకు తెలంగాణ ఐటీ స్పెషల్‌ ముఖ్యకార్యదర్శి శ్రీ జయేష్ రంజన్,  ఎస్‌బీఐ యోనోకు సంబంధించి సీజీఎం శ్రీ రాజీవ్ రంజన్ ప్రసాద్,  మరియు లక్షపతి దీదీకి ఎంఆర్‌డి జాయింట్ సెక్రటరీ శ్రీమతి స్వాతి శర్మకు ప్రశంసా పత్రాలను అందించారు.
 
image.png

వర్క్‌షాప్‌కు యూఐడిఏఐ సీఈఓ మరియు ఎన్‌ఐసి డీజీ   శ్రీ అమిత్ అగర్వాల్ అధ్యక్షత వహించారు. వర్క్‌షాప్‌లో పరిశ్రమకు చెందిన నాయకులతో పాటు ప్రభుత్వ అధికారుల మధ్య వివిధ ప్యానెల్ చర్చలు జరిగాయి. ప్రముఖ వక్తలచే కింది అంశాలపై ప్యానెల్ చర్చ జరిగింది:

ఎ. ఉత్తమ యూఎక్స్‌ విధానాలు

బి. ప్రభుత్వంతో సిటిజన్ ఎంగేజ్‌మెంట్‌లో యూఎక్స్‌/యూఐ పాత్ర.

సి. యూఎక్స్/యూఐ అభ్యాసాల కోసం సాధనాలు & సాంకేతికతలు

డి.  సామాజిక డొమైన్‌లో పౌరుల ఆకాంక్షలు మరియు అనుభవాలు

వారి అసాధారణ నాయకత్వానికి గుర్తింపుగా ఈ సమావేశాలు జరిగాయి.

వర్క్‌షాప్‌లో గూగుల్, మైక్రోసాఫ్ట్, మ్యాప్ మై ఇండియా, ఎస్‌బిఐ, జోహో, శాంసంగ్ మొదలైన పరిశ్రమలకు సంబంధించిన స్టాల్‌ కూడా ఉంది.

ఈ వర్క్‌షాప్‌ని  పరిశ్రమల ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు ప్రశంసించారు మరియు భారత ప్రభుత్వంతో పాటు వెబ్‌సైట్‌లు/అప్లికేషన్‌లలో యూఐ/యూఎక్స్‌ని మెరుగుపరచడానికి మరింత నిబద్దతతో పనిచేయాలని నిర్ణయించారు.

 
***


(Release ID: 2022030) Visitor Counter : 78


Read this release in: Odia , English , Urdu , Hindi , Tamil